
"Kota Rajababu Visits Kaleshwaram Temple"
కాలేశ్వరం ముక్తేశ్వర స్వామినీ దర్శించుకున్న – జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్
మహాదేవపూర్ ఆగస్టు 18 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం లోని కాలేశ్వరం ముక్తేశ్వర స్వామినీ సోమవారం రోజున దర్శనం చేసుకున్న జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ కోట రాజబాబు. శ్రావణ మాసం ముగుస్తున్న సందర్భంగా చివరి సోమవారం రోజు కావడంతో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ కోట రాజబాబు కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనంలో భాగంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలకడం తో స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించు కోవడంతో పాటు ఆలయ అధికారులు శాలువాతో సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాకు పదవిని కట్టబెట్టిన సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి, మండల ప్రజలకు మరియు ఎల్లవేళలా నాకు తోడు నీడగా ఉండి నా అభివృద్ధికి తోడ్పడిన తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ శ్రావణమాసం రోజున కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించు కోవడం జరిగింది. అలాగే మండల స్థాయి నుండి జిల్లా స్థాయి పదవి కట్టబెట్టిన మంత్రి శ్రీధర్ బాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ నాయకులకు అండదండగా ఉంటూ ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ అభివృద్ధి దిశగా ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్, కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ప్రధాన అర్చకులు నాగేష్ శర్మ మరియు పురహితులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.