ప్రమాదాలకు నిలయంగా మారుతున్న బ్రిడ్జి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం లక్ష్మీ పూరికి వెళ్లే దారిలో. తంగళ్ళపల్లి లక్ష్మీపూర్ గ్రామాల మధ్య సండ్ర వాగుపై బ్రిడ్జి నిర్మించడం జరిగింది. బ్రిడ్జి పైనుండి నిత్యం సిరిసిల్ల నుండి ఇల్లంతకుంట వరకు వాహనాలు ఎక్కువ తిరుగుతుంటాయి అలాగే బ్రిడ్జి ప్రక్కన అటు ఇటు కంకర వల్ల వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ దారిలో వెళ్లే ద్విచక్ర వాహనాలకు నిత్యం పంచర్ అవ్వడం జరుగుతున్నందున దారిన పోయే వారికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని దయచేసి సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి కంకర తీసి వేయించి మట్టి అయినా లేదా దానిపై దాంబర్ రోడ్డు అయినా వేయగలరని ప్రజలు కోరుకుంటున్నారు దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు