ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు నాంది.

అమ్మ ఆదర్శ పథకంతో విద్యార్థులకు మౌలిక వసతులు.
ప్రభుత్వ పాఠశాలలో విద్య విద్యార్థులకు వరం.
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ఎంపీపీ, జడ్పీటీసీలు.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని మండల పరిషత్ అధ్యక్షురాలు, రాణి బాయ్, జిల్లా పరిషత్ సభ్యురాలు, గుడాల అరుణ అన్నారు. మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థినిలకు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని, నాణ్యమైన ఉపాధ్యాయులచే విద్య, ఉచిత పుస్తకాలు, విద్యార్థుల విద్యపై ప్రత్యేక శ్రద్ధ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. మండలానికి సంబంధించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి వారి ఉజ్వల భవిష్యత్తు అందించే లా చేయాలని, అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తో పాటు విలువతో కూడిన విద్యను అందించాలని కోరారు. పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ వామన్ రావు, తోపాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!