బిఆర్ఎస్వి నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం.

BRSV leaders BRSV leaders

బిఆర్ఎస్వి నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు పురిటి గడ్డ అని. ఝరాసంగం మండలం మేధపల్లి తాజా మాజీ సర్పంచ్ మండలబి ఆర్ యస్. యువనాయకులు. పరమేశ్వర్ పాటిల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బిఆర్ఎ స్ నాయకలును ఎక్కడిక్కడ ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం హేమమైన చర్య అని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో నిరసనల కార్యక్రమాలు రద్దు చేసే సర్క్యులర్ ప్రతిపాదన ను వెంటనే రద్దు చేయాలి అని లేదంటే ఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేస్తాం అని ఈసందర్బంగా పరమేశ్వర్ పాటిల్ అన్నారు. టిఆర్ఎస్వీ నాయకులు , అదేవిధంగా దేవరం పల్లి తాజా మాజీ ఉపసర్పంచ్ శంకర్ యాదవ్. ప్యాలవరం తాజా మాజీ ఉపసర్పంచ్ మాణిక్ యాదవ్ లు మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నా మాకు ముందస్తుగా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిండమే అప్రజాస్వామికం అయిపోయింది ఈ కాంగ్రెస్ పాలన లో అని. సామాజిక ప్రజా ఉద్యమా లకు వేదికైనటువంటి ఓయులో నిరసన కార్యక్రమాలు రద్దుకు సర్క్యులర్ జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ముర్కత్వపు చర్య అని మండిపడ్డారు. ప్రతి పక్షంలో ఉన్నపుడు ఇదే ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి దొడ్డి దారిన ఉస్మానియా యూనివర్శిటీ లో నిరసన కార్యక్రమాలు చేయొచ్చు గానీ ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యా ర్థులు నిరుద్యోగ, విద్య, వైద్యం, నీళ్లు, నిధులు నియామకాల కోసం మరియు ప్రభుత్వ తీరును ఎండగట్టి ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తే మాలాంటి యువకులను అరెస్ట్ చెయ్యడం. విడ్డురం అని.విద్యార్థి లోకం నేడు నక్సలైట్లు గా అభివర్ణిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టిఆర్ఎస్వి అద్వర్యంలో విద్యార్థుల పక్షాన పోరాడి మరిత పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!