నిందితులను అరెస్ట్ చేయాలి

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో మూడు రోజుల క్రితం బావిలో శవమైన బైరి రాజు మృతికి కారకులైన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని కురుమ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈవిషయమై శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతునికి ఈత వస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారని అలాంటప్పుడు నీటిలో పడిన మృతి చెందే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈసంఘటనపై విచారణ జరిపి అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ కురుమ సంఘం అధ్యక్షులు ఒగ్గు మల్లేశం, జిల్లా గౌరవ అధ్యక్షులు కడారి ఐలయ్య, ఎల్కపెల్లి లచ్చయ్య, కోరే గట్టయ్య, కడారి వీరయ్య, ఈరల్ల విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *