అక్రమ వసూళ్లకు ప్రోత్సాహమే లక్ష్యంగా టిజిఎండిసి.

Encourage Encourage

అక్రమ వసూళ్లకు ప్రోత్సాహమే లక్ష్యంగా టిజిఎండిసి.

38 రోజుల్లో 24 అక్రమ వసూళ్ల సాక్షాలతో కథనాలు.

చర్యలకు బదులు సెటిల్మెంట్లు చేసుకుంటున్న అధికారులు.

అదనపు ఇసుక అక్రమ వసూళ్లు జోరులో కాంట్రాక్టర్లు.

పక్క జిల్లా ఇసుక క్వారీల హద్దులు దాటి ఇసుక తరలిస్తున్న, టీజీఎండిసి నిశ్శబ్దం.

టీజీఎండిసి అక్రమ వసూళ్లలో సూత్రధారిగా వ్యవహరిస్తే కొత్త ఇసుక పాలసీ ఏలా అమలవుతుంది.

అక్రమ వసూళ్లకు ప్రభుత్వం కూడా పరోక్షంగా మద్దతు పలుకుతుందా.!?

టీజీఎండిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండి ఎక్కడ.!?

మహాదేవపూర్- నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నీ మహాదేవపూర్ మండల గోదావరి పరివాహక ప్రాంతానికి అనుకొని నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ ల్లో అక్రమ వసూళ్లకు టీజీఎండిసి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల రూపాయల సొమ్మును కాంట్రాక్టర్లకు దూచిపెట్టడం జరుగుతుంది. అక్రమ వసూళ్లే కాదు అక్రమ ఇసుక తవ్వకాలను కూడా టీజీఎండిసి సహకరించడం జరుగుతుంది. కాంట్రాక్టర్ల ఇష్ట రాజ్యాన్ని టీజీఎండిసి అధికారులు కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారి కాంట్రాక్టర్లు చెప్పింది వేగంగా వ్యవహరించడం జరుగుతుంది. అక్రమ ఇసుక రవాణా వసూళ్ల సాక్షాలు, వందల సంఖ్యలో తెరపైకి తీసుకువచ్చిన టీజీఎండిసి, చర్యల కు బదులు కాంట్రాక్టర్లతో హోటల్లో సెటిల్మెంట్ చేసుకోవడం, ఆనవాయితీగా మరణంతో పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేసే క్వారీలు దోపిడీలో మరింత ముందుకు దూసుకు వెళ్లడం జరుగుతుంది. టీజీఎండిసి ఉన్నత అధికారి ఇసుక రీచులను సందర్శించి అక్రమాలు అక్రమ ఇసుక రవాణాకు కఠిన చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ, ఇసుక రీచ్ లో అక్రమాలు బయటపడుతున్న, ఆ ఉన్నత అధికారి ఎందుకు స్పందించడం లేదు అనేది సందిగ్ధంగా మారింది.

చర్యలకు బదులు సెటిల్మెంట్లు చేసుకుంటున్న అధికారులు.

మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక రీచులకు సంబంధించి అక్రమ వసూళ్ల వ్యవహారం, అదుపు ఇసుక రవాణా చేస్తున్న లారీల వివరాలు, కాంటాల వద్ద అదునపు ఇసుక వసూళ్లు, సాక్షాలతో “నేటి ధాత్రి” గత నెల నాలుగవ తేదీ నుండి నేటి వరకు, 34 కథనాలు అక్రమ వసూళ్లు అదనపు ఇసుక రవాణా చేస్తున్న సాక్షాలతో ప్రచురించడం జరిగింది. కానీ అధికారులు చర్యలకు బదులు, హోటళ్లలో కాంట్రాక్టర్లను పిలుచుకొని సెటిల్మెంట్ చేసుకుని వెళ్లడం జరగడంతో, రెచ్చిపోయిన కాంట్రాక్టర్లు వసూళ్ల పరంపర అక్రమంగా అదునపు ఇసుక రవాణా కు హద్దు అదుపు లేకుండా మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించడం ఆశ్చర్యం. అంతేకాకుండా పక్క జిల్లా కు కేటాయించిన ఏర్రాయిపేట ఇసుక క్వారీ, గోదావరిలో అక్రమంగా రోడ్డు నిర్మించి, కుంట్లం గ్రామ సరిహద్దు వద్ద తవ్వకాలు జరిపి ఇసుకను తరలిస్తుంటే, కాంట్రాక్టర్లతో టీజీఎండిసి అధికారుల చీకటి ఒప్పందం నేటి వరకు ఏర్రాయిపేట ఇసుక కాంట్రాక్టర్, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రోడ్డును నిర్మించి భారీ తవ్వకాలతో ఇసుకను రవాణా చేయడం జరుగుతుంది అంటే, టీజీఎండిసి అధికారులు ఎంతవరకు అవినీతి మత్తులో ఉన్నారు అర్థమవుతుంది.

Encourage
Encourage

 

అదనపు ఇసుక అక్రమ వసూళ్లు జోరులో కాంట్రాక్టర్లు.

తాజాగా పలుకుల తొమ్మిది, ఉసుక్పల్లి మహదేవపూర్ ఒకటి, పలుగుల ఎనిమిది, పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేసే ఈ మూడు ఇసుక క్వారీల అక్రమ వసూళ్ల అరాచకాలు హద్దు లేకుండా పోయింది. టీజీఎండిసి సిబ్బంది, కాంట్రాక్టర్ సూపర్వైజర్లు కలిసి, పలుగుల ఎనిమిది ఇసుక రీచ్ లో 1400, పలుగుల తొమ్మిది 1100, అలాగే పుసుక్కుపల్లి మహదేవ్పూర్ ఒకటవ నంబర్ ఇసుక రీచ్ లో 1100 రూపాయల చొప్పున ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది, అక్రమ వసూళ్ల వ్యవహారంతో పాటు, లోడింగ్ వద్ద 200 అదనపు రూపాల వసూలు, కాంట్రా వద్ద పాసింగ్ పై అదనపు ఇసుక మరో 500 రూపాయల చొప్పున వసూళ్లు చేస్తున్న సాక్షాలతో ప్రచురించిన, టీజీఎండిసి మాత్రం సెటిల్మెంట్ చేసుకొని అక్రమాల వైపు కన్నెత్తి చూడడం లేదు. తాజాగా పలుకుల తొమ్మిది, మహదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, ప్రస్తుతం వందల సంఖ్యలో లారీల్లో ఇసుక రవాణా చేస్తూ పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లతో లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటుంది. కానీ వీటిపై చర్యలకు టి జి ఎం డి సి, ఏ అధికారి కూడా సాహసం చేయడం లేదు.

 

టీజీజిడిసి అక్రమ వసూళ్లలో సూత్రధారిగా వ్యవహరిస్తే కొత్త ఇసుక పాలసీ ఏలా అమలవుతుంది.

ఇసుక రీచ్ లో అక్రమాలపై పరోక్షంగా ప్రత్యక్షంగా టీజీఎండిసి అధికారులు లంచాలకు మత్తులో ఇసుక రీచుల్లో అక్రమాలు కనబడకుండా పోయింది. కాంట్రాక్టర్లు మాత్రం పెద్ద మొత్తంలో లంచాలు అందించడం జరిగిందని తమకు అడిగే వారు లేరు అనుకొని అక్రమ వసూళ్ల అరాచకాలను మరింత జోరుగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికె మండలంలో అనేక రీచ్లు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ల వెసులుబాటు కొరకు టీజిఎండిసి కాంట్రాక్టర్లు చెప్పే విధంగా తల ఊపడంతో మండలంలో ఇసుక రీచులు ప్రారంభం కావడం లేదు. అంతేకాకుండా ఇప్పటికీ నెలల తరబడి ఇసుక స్టార్ చేసుకొని ఉన్న రీచులు కూడా లోడింగ్ ప్రక్రియ ప్రారంభించపోకపోవడానికి టీజీఎండిసి చీకటి ఒప్పందమే ప్రధాన కారణం. అవినీతికి కేరాఫ్ టీజిఎండిసీ, గా శాఖ మారడంతో, నూతన ఇసుక పాలసీ అక్రమ ఇసుక రవాణా అక్రమ వసూళ్ల వ్యవహారంపై, కొరడా విధించడం జరుగుతుందని ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది. అధికారుల ప్రవర్తన మార్చుకోవాలని ప్రభుత్వం డేట్ లైన్ కూడా డొంట్ కేర్ అనే విధంగా వ్యవహారిసున్న టీజీఎండిసి వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సాక్షాలతో ఇసుక రచుల్లో అక్రమాలను తెరపైకి వస్తున్న పక్షం రోజులైనప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రభుత్వం కూడా ఇసుక రీచ్ లో అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తుందన్నా వాదనలు బలమవుతున్నాయి.

టీజీఎండిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండి ఎక్కడ.!?

ఇసుక రీచ్ లు ప్రారంభం కాకముందే,టిజీ ఎం డి సి ఉన్నత అధికారి మేనేజింగ్ డైరెక్టర్ మండలంలోని పలు ఇసుక రీచ్ లను సందర్శించి అక్రమాలు అదనపు ఇసుక ఇలాంటి వ్యవహారాన్ని ఉపేక్షించమని బల్ల గుద్ది చెప్పిన ఎండి, పక్షం రోజులుగా టిజిఎండిసి సిబ్బంది వసూళ్ల పర్వాన్ని, సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన, అదనపు వసూళ్ల వ్యవహారం ఇసుక కాంట్రాక్టర్ల సూపర్వైజర్లు దౌర్జన్యంగా అదనపు వసూళ్ల వ్యవహారాన్ని కూడా సాక్షాలతో తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది. అంతేకాకుండా పక్క జిల్లాల ఇసుక రీచులు కూడా హద్దులు దాటి అక్రమ తవ్వకాలు, లాంటి వాటిని కూడా సాక్షాలతో ప్రచురించినప్పటికీ టీజీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ ఎందుకు నిశ్శబ్దాన్ని వహిస్తున్నారు, మరోవైపు అధికారులు కాంట్రాక్టర్లకు హోటల్లో పిలుచుకొని సెటిల్మెంట్లు చేసుకున్నారు అని స్పష్టంగా ప్రచురించడం జరిగినప్పటికీ కూడా ఎండి చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణమేమిటి, ఇసుక రీచుల్లో కాంట్రాక్టర్లు టీజీఎండిసి సిబ్బంది అధికారుల ప్రోత్సాహంతో దోపిడి రాజ్యాన్ని సృష్టించి అక్రమ వసూళ్లు అదనపు ఇసుక రవాణా చేస్తుంటే మేనేజింగ్ డైరెక్టర్ టి జి ఎం డి సి ఎక్కడ అని, ప్రజలు ప్రశ్నించక తప్పడం లేదు. ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ టి జి ఎం డి సి తక్షణమే, చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!