ఇంటి ముందు ఉన్న టేకు మొద్దులను ఎత్తుకెళ్లిన ఘటన
సిసి కెమెరాల్లో రికార్డైన దొంగతనం దృశ్యం.
పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయనున్న బాధిత కుటుంబం.
వరుస దొంగతనాలతో నర్సంపేట డివిజన్ ప్రజల్లో అలజడి.
పోలీసులకే సవాల్ గా మారుతున్న దొంగతనాలు.
నర్సంపేట నేటిధాత్రి :
నర్సంపేట డివిజన్ పరిధిలోని నల్లబెల్లి మండలంలో కలప దొంగలు భీవత్సం సృష్టించారు.నల్లబెల్లి మండలంలోని బోల్లోనిపల్లే గ్రామంలో నేషనల్ హైవే కు అనుకొని ఉన్న గాజర్ల రాజమల్లు గౌడ్ అనే వ్యక్తి ఇంటివద్ద ఉన్న టేకు మొద్దులను సోమవారం అర్థరాత్రి (2.30 AM ఈ రోజు తెల్లవారు జామున) సమయంలో గుర్తు తెలియని ముసుగుదొంగ వ్యక్తి ఎత్తుకెళ్లాడు.దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి ముందుగా ఇంట్లో ఎవరైనా ఉన్నారా అనేది చూసాడు.రోడ్డుపైన సిద్ధంగా ఉన్న వాహనంలో ఒక్కో టేకు మొద్దును ఒక్క నిమిషం వ్యవధిలోనే ఎత్తుకెళ్లాడు.బాధిత కుటుంబ సభ్యులు తెల్లవారి చూసే సరికి టేకుమొద్దులు ఆ టేకు మొద్దులు కనిపించలేదు.వెంటనే వారి ఇంట్లో అమర్చుకున్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించడంతో ఫేస్ ఆధారాలు కనిపించకుండా ముసుగు వేసుకొని దొంగతనం చేస్తున్న ఆధారాల దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.దొంగతనం జరిగిన ఆధారాలు బయటపడ్డ ఒక గంట వ్యవధిలోనే నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా వైరల్ గా మారింది.
వరుస దొంగతనాలతో నర్సంపేట డివిజన్ ప్రజల్లో అలజడి.
బాధితుడు రాజమల్లు గౌడ్.
నర్సంపేట డివిజన్ పరిధిలో గత 25 రోజుల వ్యవధిలోనే నర్సంపేట పట్టణంలో ఐదు ఏటిఎంలను ద్వంసం చేయడం, అదే పట్టణంలో ఒక జాయింట్ వీల్ వ్యాపారి ఇంట్లో దొంగతనం,ఖానాపూర్ మండలంలో ఒక ఘటన ఇప్పుడు నల్లబెల్లి మండలంలో మరో రకమైన టేకుకలపను దొంగతనానికి పాల్పడడం ఇలా వరుస దొంగతనాలతో డివిజన్ పరిధిలోని ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నది.దీంతో పోలీసులకే సవాల్ గా మారుతున్నాయి.