(TEOBDA) తెలంగాణ ఐ ఆర్గాన్ బాడీ డోనర్స్ అసోసియేషన్ కన్వీనర్ గా గోనె ఎల్లప్ప
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )
అవయవ దానం అత్యున్నత మైన దానమని, మానవత్వంతో అమరత్వం పొందవచ్చునని, మరణానంతర జీవం మరణించి జీవించవచ్చని తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిరిసిల్ల వాసి గోనె ఎల్లప్పను తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల(TEOBDA) సంఘం జిల్లా కన్వీనర్ గా డాక్టర్ అశోక్ నియమించారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో గోనె ఎల్లప్పకు సిరిసిల్ల జిల్లా కన్వీనర్ గా నియామక పత్రాన్ని అందజేశారు, వారు సిరిసిల్ల జిల్లాలో అవయవదానంపై అవగాహన, నేత్రదానాలు, దేహదానాలు ప్రోత్సహించవలసి ఉంటుందని, ఈ పదవి మూడు సంవత్సర కాలం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా పనిచేయవలసి ఉంటుందని డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.