అకాల వర్షాల వల్ల కౌలు రైతుల ఆవేదన
ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చేతికి అంది వచ్చిన పంట పొలాలు నీట మునిగి కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గణపురం మండలానికి చెందిన కౌలు రైతు గుర్రం తిరుపతి గౌడ్ అనే రైతు 10 ఎకరాల లో వరి పంట సాగు చేయడం జరిగింది మొన్న కురిసిన అకాల వర్షం కారణంగా వరి పంట మొత్తం నీట మునిగి నష్టం వాటిల్లిందని కౌలు రైతు ఆవేదన వ్యక్తం తెలిపాడు
కౌలు రైతులు పంట పొలాలకు ఎంతో పెట్టుబడింది పెట్టి కష్టపడి పండిస్తున్న పంట చేతికి వచ్చే. సమయానికి అకాల వర్షం వల్ల నష్టాలు జరిగే కౌలు రైతులు పెట్టిన పెట్టుబడి చేతికి అందక అప్పుల పాలు అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం కానీ అధికారులు గానీ కౌలు రైతులను ఆదుకోవాలి అని తెలిపారు