ఆలయ ధర్మకర్త కొండా లక్ష్మణ్ స్వామి మృతి.

Lakshman Swamy

ఆలయ ధర్మకర్త కొండా లక్ష్మణ్ స్వామి మృతి.

#నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన సీతారామస్వామి దేవాలయం ధర్మకర్త గ్రామ అభివృద్ధి కమిటీ ముఖ్య సలహాదారుడు కొండా లక్ష్మణ్ స్వామి గుండెపోటుతో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది ఆలయ ధర్మకర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుని స్వగృహానికి చేరుకొని లక్ష్మణ్ స్వామి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి ఆలయాలు లేని సందర్భంలో తన సొంత స్థలం ఇచ్చి గ్రామస్తుల సహకారంతో రామాలయాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి లక్ష్మణ స్వామి. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం అలాగే గ్రామానికి తీరని లోటు అని అన్నారు పరామర్శలో బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్., మాజీ సర్పంచ్ నాన్న బోయిన రాజారాం యాదవ్, వేల్పుల రవి, గుమ్మడి వేణు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్ తో పాటు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!