అభివృద్ధి చేస్తా ఆదరించండి
* 18వ వార్డు బీజేపీ అభ్యర్థిగా తెలుగు శిరీషశ్రీనివాస్
చేవెళ్ల, నేటిధాత్రి:
చేవెళ్ల మున్సిపల్ 18 వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుగు శిరీష శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చేవెళ్ల తొలి మున్సిపల్ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇచ్చి 18వ వార్డు కౌన్సిలర్ గా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని శిరీష విజ్ఞప్తి చేశారు.
తనను గెలిపిస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వార్డును ఆదర్శంగా అభివృద్ధి చేసి తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. వార్డులో ప్రధాన వీధుల గుండా ప్రజలను కలుస్తూ, ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, కేంద్ర ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
