
Telugu Language Day Celebrated at Parakala Govt College
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగుభాష దినోత్సవం
గిడుగు రామ్మూర్తి భాషసేవలు మరువలేనివి
కళాశాల ప్రిన్సిపాల్ బేతి.సంతోష్ కుమార్
పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో గిడుగు.రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు.అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.బేతి సంతోష్ కుమార్ గిడుగు వేంకట రామ్మార్తి చిత్రపటానికి పూల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామ్మూర్తి పంతులు తెలుగు వ్యావహారిక భాషా కోసం చేసిన సేవలు మరువలేనివని అలాగే సవర భాషను నేర్చుకుని ఆ భాషకు వ్యాకరణం కనిపెట్టి సవరలకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసిన గిడుగు పిడుగులాంటివారని కొనియాడారు.తెలుగు విభాగాధిపతి అశోక్ మోరె మాట్లాడుతూ తెలుగు అజంత భాష అని అనగా అచ్చులతో అంతమయ్చే భాష కాబట్టి సంగీతానికి అనువుగా ఉంటుందని తెలుగుభాషకు, ఇటరీ భీషకు దగ్గరి సంబంధం ఉండే పరిక తెలుగును ” ఈ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అ అంటారని అన్నారు.తెలుగు అధ్యాపకులు రణ ఈశ్వరయ్య ప్రసంగిస్తూ మాతృభాషలో విద్యాబోధన ద్వారా విద్యార్థుల మానసిక వికాసం జరిగి సృజనాత్మకత పెంపొందుతుందని,పరభాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషను మరువకూడదన్నారు.ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి కో ఆర్డినేటర్ డాక్టర్.రామక్రిష్ణ ఆద్యాపకులు డా.ఆడెపు రమేష్,బి.మహేందకరావు, డా.ఎ.శ్రీనావార్రెడ్డి,డా.ఎలిశాల అశోక్,డా.భీంరావు,డా.కె. జగదీష్ బాబు,యం సమ్మయ్య,డా.టి.కాల్పన,డా.జి.పావని,రాజశ్రీ,డా.జి.స్వప్న, డాక్టర్.సంజయ్,సతీష్,సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.