శ్రీ రాచన్న స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలో శ్రీ రాచన్న స్వామి జాతర మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు.గిరిధర్ రెడ్డి శ్రీ రాచన్న స్వామి వారికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారికి ఆలయ సిబ్బంది & కమిటీ సభ్యులు వారికి ఘనంగా సన్మానించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో ఆలయ ఈవో, జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దయానంద్ పాటిల్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,మండలాల నాయకులు మరియు మాజీ వైస్ యం.పి.పి,మాజీ యం.పి.టి.సిలు,మాజీ సర్పంచ్ లు,మాజీ కౌన్సిలర్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు ఆలయ సిబ్బంది&అర్చకులు హాజరయ్యారు