అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం…

Telangana State . Telangana State .

అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం …

పట్టణ వివిధ రాజకీయ పార్టీల నాయకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

అమరవీరుల త్యాగ ఫలితం తోనే తెలంగాణ రాష్ట్రం కల సహకారం అయిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో మొదలెట్టిన తెలంగాణ ఉద్యమం, సకలజనులు సబ్బండవర్ణాల కలయికతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రామకృష్ణాపూర్ పట్టణ వివిధ పార్టీల నాయకులు అన్నారు.

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో పట్టణ ఎస్సై రాజశేఖర్, క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో కమీషనర్ గద్దె రాజు లు జాతీయ జెండా లను ఎగరవేసి, అమరవీరులకు నివాళులు అర్పించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కంభగోని సుదర్శన్ గౌడ్ జెండా ఎగరవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సూపర్ బజార్ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు.

రాజీవ్ చౌక్ లోని రాజీవ్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. 

Telangana State .
Telangana State .

 

 

 

జోన్ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ జండా ఎగరవేసి అమరవీరుల కు నివాళులు అర్పించారు.

రామాలయం చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద వివిధ పార్టీల నాయకులు ఘన నివాళులు అర్పించి అమరవీరులను స్మరించుకున్నారు.

సూపర్ బజార్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి సైతం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాలలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రిలో,సివిల్ కార్యాలయంలో, సిహెచ్పి లో , ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!