భద్రాచలం నేటి ధాత్రి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే బాధ్యత మాది, మా ప్రభుత్వానిది.
భద్రాచలం నియోజకవర్గంలోని – ఎంజేపీటీబీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య పాఠశాలను, తరగతి గదులను, స్టోర్ రూమ్ను, వంటగదిని, వాష్ రూంలను, డ్రైనేజీని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.
పాఠశాల భవనంలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించడానికి కొన్ని మార్పులకు సూచనలు చేయడం జరిగింది. త్వరలో భద్రాచలం నియోజకవర్గం కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మంజూరవ్వబోతుందని తెలియచేయడం జరిగింది.
ఈ సందర్భంగా భోజన విరామ సమయంలో కళాశాల విద్యార్థినిలతో కలిసి ముచ్చటిస్తూ – భోజనం చేయడం జరిగింది
ఈ కార్యక్రమం భద్రాచలం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరవడం జరిగింది.
విద్యార్థులు చన్నీళ్లతో స్నానం చేస్తున్న సమస్యను అధ్యాపకులు వారి దృష్టికి తీసుకురాగానే, త్వరలోనే సోలార్ హీటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలియచేయడం జరిగింది.