గొల్లపల్లి పట్టణ శాఖ అధ్యక్ష, ఉపాధ్యక్షుల నియామకం
గొల్లపల్లి నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవిలయ్య ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నర్సాపురం రవీందర్, గొల్లపల్లి మండల అధ్యక్షులు మద్దెల గోవర్ధన్ లు గొల్లపల్లి పట్టణ శాఖ నూతన కమిటీ వేశారు. గొల్లపల్లికి చెందిన గంగాధర మధుసూదన్ ను తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం పట్టణ శాఖ అధ్యక్షులుగా, అలాగే దాసరపు సదానందం ను ఉపాధ్యక్షులుగా, వేల్పుల రాజేష్ ను ప్రధాన కార్యదర్శిగా, గడ్డం రజనీకాంత్ (జెన్నీ) క్యాషియర్ గా ఉత్తర్వు లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియామకమైన సదానందం, రాజేష్ మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి, మండల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నర్సాపురం రవీందర్, మండల అధ్యక్షులు మద్దెల గోవర్ధన్, ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ చెవుల మద్ది మల్లేష్, రాపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు విజయ్ తదితరులు పాల్గొన్నారు.