తెలంగాణ సబ్సిడీ లోన్స్పై కొత్త కొర్రిలు మానుకోవాలి
నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాలి
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పూరెల్ల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్
రామడుగు నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ లోన్ పథకాల్లో కొత్త కొర్రిలు రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రామడుగు మండల ప్రధాన కార్యదర్శి పూరేల్ల శ్రీకాంత్ గౌడ్ మండల కేంద్రంలో ఒక ప్రకటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా పూరెల్ల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం కింద సబ్సిడీ లోన్ సిబిల్ స్కోర్ కారణం లేకుండా ఇవ్వాలని కరోనా మహమ్మారి సమయంలో అనేకమంది యువత రుణ వాయిదాలు చెల్లించ లేకపోయిన నేపథ్యంలో వారి సిబిల్ స్కోర్లు దెబ్బతిన్నాయని దీంతో ఇప్పుడు వారు ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ లోన్లకు కూడా అనర్హులవుతున్నారు. కరోనా సమయంలో ఉద్యోగాలు పోయి ఆర్థికంగా నష్టపోయి, ఇప్పుడు మళ్లీ స్థిరపడేందుకు ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తే సిబిల్ అడ్డంకిగా మారుతోందని నిరుద్యోగ యువతకి ఆదరణగా ప్రభుత్వం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాకుండా ప్రత్యామ్నాయ ప్రమాణాలను పరిశీలించాలని, ప్రభుత్వ పథకాల ఉద్దేశ్యం ఆర్థికంగా వెనుకబడిన యువతకు సహాయం చేయడమేనని, సిబిల్ అడ్డుగా మారకూడదని పూరెల్ల శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని పత్రిక ముఖముగా కోరుతున్నారు.