
Telangana Language Day Celebrated
స్టేషన్ హైస్కూల్ లో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు
చిన్ననాటి నుండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి
మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి
కేసముద్రం/ నేటి దాత్రి
ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతి ని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం ను జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థుల కు డ్రాయింగ్, వ్యాస రచన, 50 మంది తెలంగాణ కవుల చిత్ర పటాలను ప్రదర్శించి వారి రచనలు విద్యార్థుల చే పరిచయం,చేయడం జరిగింది. ఇంకా క్విజ్, ఉపన్యాసం, పద్యాల పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గతంలో తెలంగాణ యాసను ఈసాడించుకోవడం జరిగింది, ఇలాంటి సందర్భంలో కాళోజి లాంటి మహనీయులు మన తెలంగాణ యాస భాష లను, మన మాండలికాలను కాపాడుకోవాలి అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా నాగొడవ లాంటి రచన లతో ఉత్తేజ పరచడం జరిగింది. అలాగే మనం కూడా ప్రస్తుత సమాజం లో మన భాషా యాస లను గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పారు.
మండల విద్యాధికారి యాదగిరి మాట్లాడుతూ భావి పౌరులు అయినా మీరు చిన్నపటి నుండే బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమం లో తెలుగు ఉపాధ్యాయులు అగుర్తి సురేష్, సంపంగి లక్ష్మికుమారి, చారాల సత్యనారాయణ, ఉపాధ్యాయులు గంగుల శ్రీనివాస్, ముదిగిరి సదయ్య, నర్సింహ రెడ్డి, కుమారస్వామి, కృష్ణవేణి, మధు, యాదగిరి, మదన్మోహన్, శ్రీనివాసులు, చందర్, భద్రాసింగ్, శ్రీవిద్య, శ్రీనివాస్, రాజేందర్, జ్యోతి, శ్రీనివాస్ లు పాల్గొన్నారు