నోరుందని రంకెలేస్తే కొంకులు కంకులైతయ్‌!?

`తెలంగాణ రాజకీయాల మీద తప్పుడు కూతలు కూస్తే పంగలు పగులతయ్‌!

`తెలంగాణ బ్రాండ్‌ దెబ్బ తీయాలని చూస్తే మంగన్లు వస్తై!

`మీడియా ముసుగులో తెలంగాణ అస్తిత్వం మీద కొన్ని ఛానళ్ల దాడి. 

`ఇది తెలంగాణ బిడ్డా… ఉద్యమాల జీవ గడ్డ.

`పోరాటాల పురిటిగడ్డ..పౌరుషానికి అడ్డ.

`తెలంగాణ రాజకీయాల మీద ఏపీ మీడియా బరితెగించి ఫోకస్‌.

`తెలంగాణ అభివృద్ధి చూడలేని ఓర్వలేని తనం.

`ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ జరుగుతున్న సమయంలో మీడియా వికృత రూపం.

`సిట్‌ విచారణ పూర్తి కాలేదు.

`సిట్‌ తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించలేదు.

`ఏపీ మీడియా అత్యుత్సాహం హద్దులు మీరుతోంది.

`మహాన్యూస్‌ కేటీఆర్‌ పై బురద జల్లుతోంది.

`అదే సమయంలో ఏబిఎన్‌ సీఎం. రేవంత్‌ రెడ్డి మీద విషపు రాతలు రాస్తోంది.

`తెలంగాణ సమాజం ఇది గమనించాల్సి వుంది. 

`పదేళ్ల పాటు లేవని కాంగ్రెస్‌కు జవసత్వాలు తెచ్చింది రేవంత్‌ రెడ్డి.

`కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్‌ రెడ్డి.

`అందుకే అధిష్టానం రేవంత్‌ రెడ్డిని సిఎం చేసింది.

`ఆ మాత్రం స్పష్టత, పూర్తి అవగాహన అధిష్టానానికి వుంది.

`కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కాలేదు.

`రేవంత్‌ రెడ్డిని తొలగించాలని చూస్తున్నట్లు ఏబిఎన్‌కు ఎవరు చెప్పారు.

`ముందు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టాలని ఏపీ. మీడియా చూసింది.

`కాంగ్రెస్‌ను పావుగా వాడుకున్నది.

`ఇప్పుడు కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలని కుట్ర చేస్తోంది.

`తెలంగాణ లో పార్టీలు ఈ విషయం అర్థం చేసుకుంటే మంచిది.

`ఏం కొంపలు మునిగిపోయాయని రేవంత్‌ రెడ్డిని దించాలనుకుంటున్నారు.

`ప్రశాంతమైన తెలంగాణలో ఎక్కడా శాంతి భద్రతల సమస్యల లేదు.

`ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి ఇప్పటి వరకు లేదు. 

`అయినా రేవంత్‌ను ఎందుకు అధిష్టానం పక్కకు పెట్టాలనుకుంటుంది.

`తప్పుడు వార్తలతో కాంగ్రెస్‌ పార్టీలో అలజడి సృష్టించాలని ఏపీ. మీడియా ప్రయత్నం చేస్తోంది.

`ఇక కేటీఆర్‌ మీద లేనిపోని అవాస్తవాలు వండి వార్చేస్తోంది. 

`కేటీఆర్‌ సినిమా వాళ్ల దగ్గర నుంచి యాంకర్ల వరకు వదల్లేదని బురద జల్లుతోంది.

`అంటే పరోక్షంగా సినిమా హీరోయిన్లు అంత బలహీనమైన వాళ్లా!

`ఎవరు బెదిరిస్తే వారికి లొంగిపోతారా?

`యాంకర్లంటే ఏపీ. మీడియాకు అంత చులకనా? 

`యాంకర్ల మీద ఇంత దుర్మార్గపు విషం చిమ్ముతారా?

`వారికి వ్యక్తిత్వం, ఆత్మాభిమానం లేదన్నట్లు అర్థం రాదా?

`ఆ చానళ్లలో కూడా యాంకర్లు పని చేస్తున్నారు.

`కేటీఆర్‌ బెదిరిస్తే యాంకర్లు లొంగిపోయారని అనడం నేరం కాదా!

`మహా టివి మీద దాడి ప్రజాస్వామ్యంపై దాడి అంటారా?

`ప్రజా రాజ్యం జెండా పీకేద్దామా? అని వార్త వచ్చినప్పుడు ఏం చేశారో పవన్‌కు గుర్తు లేదా?

`దక్కన్‌ క్రానికల్‌ పేపర్‌ కార్యాలయం మీద పవన్‌ దాడి చేయలేదా!

`ఇటీవల సాక్షి కార్యాలయాల మీద ఏపీలో దాడి జరగలేదా!

`ఏపీలో రాజకీయాలు చేస్తారు. 

`ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా ప్రతినిధులౌతారు.

`సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంటే గాని నిద్రపోలేరు.

`ఏపీ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసుకుంటూ నిత్యం అమరావతి, హైదరాబాద్‌కు చక్కర్లు కొడతారు.

`ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వంచించి, పాలన గాలికొదిలేస్తారు.

`ఇది ఏపీ మీడియాకు కనిపించడం లేదా!

`ఏపీలో ఏం జరిగినా వార్త కాదు.

`తెలంగాణలో జరిగే విచారణలను వార్తలు చేసి విషం చిమ్ముతారా?

`కాళేశ్వరం మీద విషం కక్కుతారా?

`పోలవరం స్పిల్‌ వే కొట్టుకుపోయింది వార్త కాదా?

`కాళేశ్వరం మొదలైనప్పుడు ప్రారంభమైన పోలవరం ఎందుకు పూర్తి కాలేదని ఏపి. మీడియాకు అవసరం లేదా?

`విశాఖలో మంచి నీటి ఎద్దడి కనిపించడం లేదా.

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మీడియాకు కొన్ని హద్దులుంటాయి. ప్రమాణాలుంటాయి. మీడియా అయినంత మాత్రాన రాజ్యాంగంలో ప్రత్యేకమైన ఆర్టికల్స్‌ ఏమీ వుండవు. వ్యక్తి స్వేచ్చ, భావ ప్రకటనా స్వేచ్చ 19(1)ప్రకారమే హక్కులంటాయి. తప్ప మీడియా అనే దానికి ఎలాంటి ప్రత్యేక వెలుసులుబాటు లేదు. ఈ విషయం తెలియని అల్పులు కొందరు మీడియా స్వేచ్ఛ అనేది వుందని భ్రమ పడుతుంటారు. అందులోనూ ఎలక్రానిక్‌ మీడియా అనే దానికి ఎలాంటి గుర్తింపులేదు. సమచార శాఖ ఎలక్రానిక్‌ మీడియాను గుర్తించింది లేదు. న్యూస్‌ చానల్స్‌ అయినా అవి వినోదాత్మక ఛానల్స్‌లో భాగం మాత్రమే. ఆ సంగతి తెలిసి కూడా లేని పోని వార్తలువండి వార్చడమే కాకుండా, రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలలో తొంగి చూస్తామంటే సమాజం ఊరుకోరు. ఆ రాజకీయ పార్టీలు, నాయకులు వదిలిపెట్టరు. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న మీడియా విశృంకల పోకడలో రెండురకాల విషయాలు ఆధారపడి వున్నాయి. తెలంగాణను అస్ధిరపర్చాలన్న కుట్ర కోణం దాగి వుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు, మీడియా సంస్ధలకు సుతారం ఇష్టం లేదు. ఎప్పటికైనా సరే తెలంగాణ విఫల రాష్ట్రం చేయాలన్న కుట్రను ఆనాటి నుంచి చేస్తూనే వున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ సమాజం మొత్తం ఏకం కావడంతో తప్పని పరిస్ధితుల్లో మద్దతు తెలుపకపోయినా, సైలెంటుగా వున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వున్నంత కాలం ఏపి మూలాలున్న మీడియా సంస్దలు రంకెలు వేయలేదు. 2018 ఎన్నికల ముందు వేయాలని ఒకసారి చూశాయి. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ఓడిపోతుందని ప్రచారం చేశాయి. కాని ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఊహించనంత మెజార్టీ సొంతం చేసుకోవడంతో ఎన్నికల సమయంలో కూడా బిఆర్‌ఎస్‌పై వార్తలు రాయడానికి భయపడ్డాయి. కాకపోతే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశాయి. అందులో కూడా కాంగ్రెస్‌ మీద ప్రేమతోనో, లేక సిఎం. రేవంత్‌ రెడ్డికి మద్దతివ్వాలని కాదు. తెలంగాణలో రాజకీయ అస్ధిరత అనేది ఏ దశలోనైనా చూపించడానికి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మేలనుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. దాంతో సీమాంద్ర మీడియా ఆడిరది, ఆట పాడిరది పాట అవుతుందని అంచనా వేసుకున్నాయి. ఇప్పుడు అదే పనిని మొదలు పెట్టాయి. కాంగ్రెస్‌కు అనుకూలంగా వార్తలు రాయపోయినా, సరే బిఆర్‌ఎస్‌పై లేనిపోని వార్తలు రాస్తూ వస్తున్నారు. అంటే సహజంగా ఏ వ్యక్తికైనా తనను మెచ్చుకోకపోయినా, అవతలి వ్యక్తిని తిడితే సంతోషించడం అనేది మానవసహజం. ఇదే సీమాంద్ర మీడియా పట్టుకున్నది. బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ మీద లేనిపోని వార్తలు సృష్టిస్తోంది. విపరీతమైన ధంబ్‌ నెయిల్స్‌తో రకరకాల స్టోరీలు ప్రసారం చేస్తున్నాయి. చర్చలు సాగిస్తున్నాయి. అది మరీ హద్దులు దాటింది. ఓ వైపు టెలిఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌ విచారణ జరుగుతోంది. అందులో ఏం జరుగుతుందో పూస గుచ్చినట్లు, ప్రజలు నమ్మేలా వార్తలు ప్రసారం చేస్తున్నారు. నిజానికి ఓ ఇన్వెస్టిగేషన్‌ జరుగుతున్నప్పుడు దానిపై వార్తలు రాయడం తప్పు కాదు. కాని విచారణలో ఏంజరుగుతుందో ప్రసారం చేయడం చట్టపరంగా తప్పు. నిజంగానే విచారణ పూర్తయి, కేటిఆర్‌ తప్పు చేశాడని తేలితే, ఆ వివరాలు వెలుగులోకి వస్తే వార్తలు వేయడంలో తప్పుండదు. కాని ఆలు లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్లు వార్తలు రాయడానికి ఎవరూ స్వాగతించరు. అందుకే నోరుంది కదా? స్టూడియోలో కూర్చొని రంకెలెస్తే కొంకులు పగిలిపోతాయని బిఆర్‌ఎస్‌ తేల్చి చెప్పింది. తెలంగాణ రాజకీయాల మీద లేనిపోని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే పంగలు పగులుతాయని రుచి చూపించారు. తెలంగాణ బ్రాండ్‌ను దెబ్బతీయాలని చూస్తే తెలంగాణ సమాజమే ఊరుకోదు. మరోసారి తెలంగాణ ఉద్యమ రుచి చూపిస్తారు. అప్పుడు ఈ మాత్రం స్ధానం కూడా లేకుండా చేస్తారు. మీడియా ముసుగులో కొన్ని ఛానళ్లు చేస్తున్న దాడిని తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ అనేది రాజకీయ పార్టీయే కాదు, తెలంగాణ ఉద్యమ పార్టీ. తెలంగాణ సాధించిన పార్టీ. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. ఆ పార్టీ నాయకుడు తెలంగాణ సాధనలో ముందున్నాడు. తెలంగాణ సాధించాడు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను తీర్చిదిద్దాడు. ఈ రోజు స్టూడియోలో రెప్పపాటు కరంటు పోకుండా నడుస్తున్నాయంటే కారణం కేసిఆర్‌. ఇండ్లలో కూడా కరంటు నిరంతరాయం సరఫరా అవుతుందంటే కారణం కేసిఆర్‌. హైదరాబాద్‌ ఇంతలా విస్తరించిందంటే కారణం కేసిఆర్‌. ఈ సంగతి మర్చిపోయి , తెలంగాణ మీద విషం చిమ్మడానికి నాయకుల మీద లేనిపోని బుదర జల్లితే తెలంగాణ సమాజమే సహించదు. తెలంగాణ అభివృద్దిని చూడలేక ఓర్వలేని తనం బాగా పెరిగిపోయింది. ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ సమయంలో ఏపి మీడియా వికృత రూపాన్ని చూపిస్తే, తెలంగాణ సమాజం, బిఆర్‌ఎస్‌ పార్టీ తన అసలైన నిజ స్వరూపం చూపిస్తుంది. ఇప్పటి వరకు సిట్‌ విచారణ పూర్తి కాలేదు. ఇప్పుడే మొదలైంది. ఎంత కాలం సాగుతుందో తెలియని పరిస్దితి. సిట్‌ విచారణ పూర్తి కావాలి. అది ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రభుత్వం వారిపై చర్యలకు ఉపక్రమించాలి. అందుకు ఇంకా చాలా కాలం వుంది. అయినా ఆ సిట్‌ ఎలాంటి నివేదిక ఇస్తుందన్నది కూడా ఎవరికీ తెలియదు. కాని ఏపి మీడియాకు మాత్రం తెలుస్తుందా? ఏపి మీడియా అత్యుత్సాహం హద్దులు దాటింది. అయితే ఇక్కడ తెలంగాణ సమాజం గమనించాల్సింది ఏపి మీడియా ఒక్క కేటిఆర్‌నే టార్గెట్‌ చేయలేదు. అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు ప్రతిపక్ష పార్టీ బిఆర్‌ఎస్‌ అధినేత, కేసిఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ను టార్గెట్‌ చేశారు. ఇది చాల మంది గమనించడం లేదు. ఏక కాలంలో ఏపి మీడియా సంస్ధలు తెలంగాణ రాజకీయాల మీద విషం చిమ్ముతున్నాయి. ఏకంగా సిఎం. రేవంత్‌రెడ్డి మీద ఏబిఎన్‌ విషపు రాతలు రాస్తోంది. పదేళ్లపాటు జవసత్వాలు లేని, కాంగ్రెస్‌ పార్టీని బతికించి, నిలబెట్టి అదికారంలోకి తెచ్చిన నాయకుడు రేవంత్‌రెడ్డి. ఆయన పది కాలాల పాటు పదవిలో వుండాలని కోరుకోవాలి. కాని ఆయనపై డిల్లీలో ఏదో జరుగుతుందోన్న అసత్య ప్రచారం విసృతంగా చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి చేసిన కష్టాన్ని చూసిన తర్వాతే ఆయనను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సిఎంను చేసింది. అ ంతే కాని ఎవరో చెబితేనో, మీడియాలో వచ్చే వార్తల వల్లనోచేయలేదు. ఆ మాత్రం స్పష్టత అధిష్టానానికి వుంది. కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే లుకలుకలు అంటూ వార్తలు రాస్తున్నారు. ఏబిఎన్‌ కూడా రేవంత్‌రెడ్డిని తప్పించాలని కోరుకుంటున్నట్లుంది. ముందు బిఆర్‌ఎస్‌ మీద దెబ్బకొట్టాలని ఏపి మీడియా చూసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ మీద కూడా పగపట్టింది. ఆనాడు కాంగ్రెస్‌ను పావుగా వాడుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తోంది. ఏం కొంపలు మునిగిపోతున్నాయని సిఎం. రేవంత్‌రెడ్డిని తప్పిస్తారు? తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణం వుంది. ఎక్కడా శాంతి బద్రతల సమస్యలేదు. ప్రజల్లో అసంతృప్తిలేదు. ఎక్కడా ప్రజా పోరాటాలు సాగడం లేదు. ఆఖరుకు రైతులు కూడా సంతోషంగా వున్నారు. తప్పుడు వార్తలతో కాంగ్రెస్‌ పార్టీలో అలజడి సృష్టించాలని ఏపి మీడియా చూస్తోంది. అలాగే కేటిఆర్‌ మీద కూడా అవాస్తవాలు వండి వార్చుతోంది. కేటిఆర్‌ మీద తప్పుడు కథనాలు విపరీతంగా ప్రసారం చేస్తున్నాయి. కేటిఆర్‌ సినిమా వాళ్ల దగ్గర నుంచి మీడియా ఛానళ్ల యాంకర్ల వరకు వదిలిపెట్టలేదన్నట్లు అర్దమొచ్చేలా కథనాలు ప్రసారం చేశారు. అంటే సినిమా హీరోయిన్లంటే మహా న్యూస్‌కు అంత చులకనగా కనిపిస్తున్నారా? పరోక్షంగా వారి క్యారెక్టర్‌ను దెబ్బతీస్తున్నారా? సినిమా హీరోయిన్లు అంత బలహీన మైన వారా? వారికి సమాజంలో వున్న గౌరవం, పేరు , ప్రఖ్యాతులను దెబ్బతీస్తారా? ఇదేనా జర్నలిజం అంటే? సినిమా హీరోయిన్లు అంటే ఎవరు బెదిరిస్తే వారికి లొంగిపోతారా? మీడియాలో పనిచేసే యాంకర్లంటే మహా న్యూస్‌కు అంత చిన్న చూపా? వారంటే అంత చులకనా? అంటే పరోక్షంగా మహా న్యూస్‌లో పనిచేసే యాంకర్లను కూడా వేలెత్తి చూపిస్తున్నట్లు కాదా? వాళ్లు ఎంత కష్టపడితే వార్తలు ప్రసారమౌతున్నాయో చూసుకుంటూ కూడా ఇలాంటి ధంబ్‌ నెయిల్స్‌ ఎలా పెడుతున్నారు? వాటిని మళ్లీ మహిళా యాంకర్లతో ఎలా చదవిస్తున్నారు? ఎవరూ అడగరని అహంకారమా? యాంకర్లకు వ్యక్తిత్వం, ఆత్మాభిమానం వుండదని మహా టీవి చెబుతున్నట్లు కాదా? కేటిఆర్‌ బెదిరిస్తే సినిమా హీరోయిన్లు, యాంకర్లు లొంగిపోతారని చెప్పడం మహా న్యూస్‌ చేస్తున్న నేరం కాదా? ఇక మహా న్యూస్‌ మీద బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేస్తే అది ప్రజాస్వామ్యం మీద దాడిగా మారిపోయిందా? మరి ఇటీవల ఏపిలో సాక్షి కార్యాలయాల మీద తెలుగుదేశం శ్రేణులు చేసిన దాడి ప్రజాస్వామ్య విరుద్దం కాదా? ఇలాంటి దాడులు తెలుగుదేశం పార్టీ చేస్తే సంసారమౌతుందా? బిఆర్‌ఎస్‌ చేస్తే మరొకటి అవుతుందా? ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు సమర్ధనీయమా? గతంలో ప్రజారాజ్యం పార్టీపై జెండా పీకేద్దామా? అని వార్త వచ్చినప్పుడు ఏం చేశారు. పవన్‌ కళ్యాణ్‌కు గుర్తులేదా? దక్కన్‌ క్రానికల్‌ కార్యాలయం ద్వంసం పవన్‌కు మర్చిపోయాడా? అయినా తెలంగాణ రాజకీయాల మీద మీడియా మాట్లాడిరదంటే ఒక అర్దం వుంది. కాని చంద్రబాబు నాయకుడు, పవన్‌ కళ్యాణ్‌కు ఏం పని. ఈ మధ్య ఏపిలో సాక్షి కార్యాలయాలపై దాడి జరిగితే తెలంగాణ నుంచి ఏ ఒక్కరైనా స్పందించారా? బిఆర్‌ఎస్‌ ఏ ఒక్క నాయకుడైనా మాట్లాడారా? తెలంగాణ నాయకులు ఎంతో విజ్ఞులు. అందుకే ఆ రాష్ట్ర రాజకీయాలు పట్టించుకోలేదు. ఏపిలోవున్న రెండు పార్టీల ఆలోచనలు వేరు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నారు. ఒకనాడు పవన్‌ కళ్యాన్‌ 2014 ఎన్నికల సమయంలో మహబూబాబాద్‌లో కేసిఆర్‌ మీద చేసిన వ్యాఖ్యలు ఆయన గుర్తుంచుకుంటే పరిస్దితి ఎలా వుండేదో ఆలోచించుకోవాలి. వాటిన్నింటినీ మర్చిపోయి పవన్‌ కళ్యాణ్‌తో సుహృద్భావంగా వున్నారు. గౌరవి ంచారు. ఏకంగా ప్రజా భవన్‌కు పలిపించి కేసిఆర్‌ మర్యాదలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు అయ్యోడివా? నువ్వు అవ్వోడివా? అని పాడిన పాటలే కరక్టు. బిఆర్‌ఎస్‌ కూడా ఇప్పటికైనా తెలుసుకుంటేనే మేలు. ఎందుకంటే పాముకు నిత్యం పాలు పోసి పెంచినా అది సాదు జంతువు కాదు. విషాన్ని చిమ్మక మానదు. కాటేయక మానదు. అదే కొందరి నైజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!