గీతా కార్మికుడిని పరామర్శించిన తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు “గట్టు నరేష్ గౌడ్”

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం, సోమారం గ్రామానికి చెందిన నాళ్ళం యాకాంబ్రం గౌడ్ కుల వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తాటి చెట్టుపై నుండి పడి, తీవ్రగాయాలు అయినాయని తెలిసి, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతడిని పరామర్శించి, డాక్టర్లతో మాట్లాడి, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు నరేష్ గౌడ్. ఈసందర్భంగా గట్టు నరేష్ గౌడ్ మాట్లాడుతూ, పది రోజుల వ్యవధిలో పర్వతగిరి మండలంలో ముగ్గురు గీత కార్మికులు తాటి చెట్టుపై నుండి పడి, ప్రమాదానికి గురి అయ్యారని, ఒక సోమారం గ్రామానికి చెందిన వారే ఇద్దరు కావడం దురదృష్టకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం కల్లు గీతా వృత్తి రక్షణకై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోజు రాష్ట్రంలో పదుల సంఖ్యలో గీతా వృత్తి కార్మికులకు ప్రమాదాలు జరుగుతున్న, ప్రభుత్వం పట్టించుకున్న పాపానికి పోలేదని, ప్రభుత్వంపై గట్టు నరేష్ గౌడ్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రమాదానికి గురి అయిన గీతా కార్మికులకి మెరుగైన వైద్యం కోసం ప్రవేట్ హాస్పిటల్ లో ఉచిత వైద్యం, అందే విధంగా రక్షణ చర్యలు చేపట్టి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే వందల సంఖ్యలో గీతా వృత్తి ప్రమాదాలు జరుగుతున్న, ఏమి తెలియనట్టుగా చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జరిగిన ప్రమాదాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని, రాజీనామా చేయని యెడల తెలంగాణ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రమాదాలకు బాధ్యున్ని చేస్తూ సంబంధిత మంత్రిపై కోర్టుకెళ్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు నాగపురి వెంకటేష్ గౌడ్, రాజేష్ గౌడ్, రాజు గౌడ్, రమేష్ గౌడ్, తదితర గౌడ నాయకులు బాధితుడిని పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!