ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వనిది-సోద రామకృష్ణ

పరకాల నేటిధాత్రి(టౌన్)

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో శనివారం రోజున 64,46,47,48,50,53,60 పోలింగ్ బూత్ కమిటీల సన్నాహాక సమావేశం చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా పరకాల పట్టణ అద్యక్షులు డాక్టర్.మడికిండ శ్రీను మాట్లాడుతూ ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం టిఆర్ఎస్ పార్టీకే ఉందని, మేము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అందని ఇల్లు తెలంగాణ రాష్ర్టంలో,పరకాల నియోజకవర్గంలో చేరని-తీసుకోని కుటుంబం లేదని,రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను తెలంగాణ ప్రజల శ్రేయస్సుకోసం తీసుకొస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలకోసం కెసిఆర్ అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అందించారని,కేసిఆర్ నాయకత్వములో జరిగిన అభివృద్ధి పనులు,ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ప్రతి ఓటర్లకు వివరిస్తూ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం పరకాల పట్టణ దళిత బంధు కన్వీనర్ సోదా రామకృష్ణ మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం ప్రతి ఇంటికీ స్వచ్చమైన నీరును చల్లా ధర్మన్న అందిస్తున్నారని, పరకాల నియోజకవర్గంలో గత పాలకులు ఎవ్వరు చేయని అభివృద్ధిని చల్లా ధర్మారెడ్డి చేసారని అన్నారు.గత పాలకులు ఎమి చేసారో ప్రజలు గమనించాలని కోరారు. పరకాల మునిసిపల్ వైస్ ఛైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పరకాలలో చల్లా ధర్మారెడ్డిదే గెలుపన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు చందుపట్ల రమణారెడ్డి,నిప్పాని సత్యనారాయణ,పావుషేట్టి వెంకన్న,బండి సారంగపాణి, పట్టణ కమిటి సభ్యులు మెరుగు శ్రీశైలం,పట్టణ ఉపాధ్యక్షులు దుంపేటి నాగరాజు,ఎండి.జాఫర్ రిజ్వి,కౌన్సిలర్లు దామెర మొగిలి,ఎకు రాజు,గొర్రె స్రవంతి రాజు,మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్,కో ఆప్షన్ మెంబర్లు ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి, పాడి నవత భగవాన్ రెడ్డి,వార్డు కమిటీల అధ్యక్షులు అల్లే చిరంజీవి,ఎకు రఘుపతి, బొట్ల నరేష్,మోరే రాజేందర్, బండి వెంకటేష్,సుదమల్ల రమేశ్,పట్టణ అధికార ప్రతినిధి ఎండీ మక్సుద్ అలీ,మైనార్టీ సెల్ అధ్యక్షులు,ఎండి బీయా బానీ,పట్టణ ప్రచార కార్యదర్శి బొచ్చు జెమిని,వార్డు కమిటీలు, అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!