
Banjaras
గిరిజన సంస్కృతికి ప్రతిక తీజ్ పండుగ…
బంజారాల జీవన విధానాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని తీజ్ పండుగ తెలియపరుస్తుంది…
కట్టు,బొట్టు,సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న తీజ్ పండుగ…
తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి…
తీజ్ పండుగను గిరిజనుల జాతీయ పండుగ గా గుర్తించి సెలవు ప్రకటించాలి…
అడవి దేవతలకు తొమ్మిదిరోజులు నిష్టతో పూజలు…
పెళ్లి కాని యువతులతో మొలకలు పండుగ నిర్వహణ…
ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఉత్సవాల నిర్వహణ…
తండాల్లో కొనసాగుతున్న తీజ్ వేడుకలు…
నేటి ధాత్రి-గార్ల:-
ప్రతి ప్రాంతానికీ వర్గానికి సంస్కృతి ఉంటుంది.ఆ సంస్క్రుతిని నిలబేట్టె పండుగలూ ఉంటాయి.అలాంటి పండుగే తీజ్ ఉత్సవం.తెలుగు రాష్ట్రాల్లోని గోర్ బంజారాలు పవిత్రంగా జరుపుకునే వేడుక ఇది.వర్షాలు నిండుగా కురవాలనీ,పంటలు దండిగా పండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారు.
తొమ్మిది రోజుల తీజ్ కార్యక్రమాలు…
తొమ్మిది రోజుల కార్యక్రమాలు
మొదటిరోజు ఘంవు గాళేరో,రెండవ రోజు బొరాయేరో, మూడవరోజు బోరడీ తీజ్, ఎనిమిదో రోజు డమోలి,9వ రోజు గణ్గోర్, చివరి రోజు కడావ్ తీజ్ టోడేరో తీజ్ వేరాయేరో కార్యక్రమం కొనసాగుతుంది.
లంబాడీ (గోర్ మాటి) ఆరాధ్యదైవం తీజ్ పండుగ…
గిరిజన తండాలో అవివాహిత ఆడపిల్లలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ.కాలం మారుతున్న లంబాడీలు మాత్రం తమ సంస్కృతిని,సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. తీజ్ పండుగలో తొమ్మిది రోజుల ఆడపిల్లలకు కఠిన నియమాలు ఉంటాయి.ఉప్పు కారం లేని భోజనం తినాలి.అత్యంత పవిత్రంగా ఉండాలి.భక్తితో దేవతలను పూజించాలి.తండా నుంచి బయటకు అడుగు పెట్టకూడదు.మాంసం నిషేధం. బావి నుంచి నీటిని తెచ్చే బిందెను నేల పై పెట్టకుండా నేరుగా పందిరి పై నీరు పోయాల్సిందే. నృత్యాలు చేసినంత సేపు బిందెను నెత్తిపై పెట్టుకుని నిలబడాల్సిందే. యేటా ఆగష్టు రెండో వారం శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుతారు.ఇంత గొప్పగా జరుపుకునే సీత్లా భవాని తీజ్ ను ప్రభుత్వ అధికారిక పండుగలుగా ప్రకటించాలని లంబాడీలు కోరుతున్నారు.గిరిజన తండాలలో అవివాహిత ఆడపిల్లలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ. తీజ్ కాలం మారుతున్న లంబాడీలు మాత్రం తమ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.తీజ్ పండుగలో కఠోర నియమాలు,డప్పుల మోతలు,కేరింతలు, ఆటపాటలు,నృత్యాలు, అన్నాచెల్లెళ్లు,అక్కాతమ్ముళ్ల, అనుబంధాలు బావా మరదళ్ల అల్లరి చేష్టలు ఉంటాయి.తొమ్మిది రోజుల పాటు వేడుకలు జరుగుతాయి.ఈ పండుగ బతుకమ్మను పోలి ఉంటుంది. గోధుమ మొలకలను ఎనిమిది రోజులపాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు.ఉత్సవాలను పెళ్లి కాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వీరికి తండా పెద్దలు,సోదరులు సహకరిస్తారు.వర్షాకాలం ఎర్రని ఆరుద్ర పురుగు వచ్చే సమయానికి పండుగ జరుపుతారు.గోధుమ మొలకలను తీజ్ గా పిలుస్తారు.బతుకమ్మను పూలతో అలంకరించి గోధుమలను నానబెట్టి తీజ్ మొలకలను పూజించడం ఆనవాయితీ.
గ్రామ పెద్దల అనుమతి తోసుకుని ఈ ఉత్సవాలు జరుగుతాయి…
తీజ్ పండుగ మొదట ఎలా ప్రారంభమవుతుందంటే తాండాల్లోని అందరు తాండావాసులు ఆ తండకు చెందిన ముఖ్యమైన నాయకున్ని నాయక్ ” అంటారు. అతని ఆధ్వర్యంలో సమావేశమై పండుగ విశేషాలపై నిర్ణయాలు తీసుకుని “నాయక్” అనుమతితో అంగడికి వెళ్లి వెదురుతో తయారు చేసిన చిన్నచిన్న గుల్లలని తీసుకొని వస్తారు.ఐతే ఒక ఇంటిలో ఎంతమంది పెళ్లికాని ఆడపిల్లలు ఉంటారో అన్ని వెదురు గుల్లలు తీసుకువచ్చి వాటిని అందంగా రంగు, రంగుల నూలు దారాలతో, గవ్వలతో, ముత్యాలతో పూసలతో బాసింగాలు కట్టి పెళ్ళి కూతురులా అందంగా ఆ గుల్లలని ముస్తాబు చేస్తారు.ఈ పండుగను పెళ్లికాని ఆడపిల్లలు శ్రావణపూర్ణిమ రోజు ఉదయం లేచి ఇంటిని, వాకిలిని శుభ్రం చేసి అందంగా ముగ్గులు వేసి, అందంగా ముస్తాబై కొత్తబట్టలు ధరించి “నాయక్ ” ఇంటికి చేరుకోని అక్కడి నుండి గండు చీమలు గుల్లు కట్టిన నల్లని మట్టిని తీసుకురావడానికి అడవికి వెళ్తారు.ఇనుప గుల్లలో ఆ మట్టిని తీసుకు వచ్చి ఆరబెట్టి శ్రావణమాసంలో వచ్చే రాఖీపూర్ణిమ రోజు సాయంత్రం తండ నాయకుని ఇంటి ఆవరణలో అందరు సమావేశమై నాయక్ అనుమతితో అందంగా అలంకరించిన వెదురు గుల్లల్లో నల్లని మట్టిని నింపి అందులో నాయక్ భార్య నాయకణ్ దుకాణం నుండి తెచ్చిన నానబెట్టిన గోదుమలను చల్లడంతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది.తొమ్మిది రోజుల పాటు వరి నాట్లు వేయడం పూర్తి కాగానే తండా పెద్ద నాయక్ అనుమతి తోసుకుని ఆడపిల్లలు పండుగకు సన్నాహాలు చేసుకుంటారు ఇంటింటికీ వెళ్లి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. విరాళాలు సేకరిస్తారు.అంగడికి వెళ్లి గోధుమలు శెనగలు ఇతర సామాగ్రి తెచ్చుకుంటారు.గోధుమలను నానబెట్టడానికి దుస్సేరు తీగలతో బుట్టలను అల్లుతారు.పుట్టమట్టిని తెచ్చి అందులో మేక ఎరువు కలుపుతారు.మెదట తండా నాయక్ చేత ఎరువు కలిపి మట్టిని పోయించి గోధుమలను చల్లిస్తారు.తండాలో పాడి పంటలు పచ్చగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, సీత్లా మేరామా మతాను వేడుకుంటారు.తొమ్మిది రోజులు బుట్టలో నీళ్ళు పోస్తారు.గోధుమలను నానబెట్టాక రేగు ముళ్ళు గుచ్చుతారు.ఈ సమయంలో వరుసకు బావ అయ్యేవారు వాటిని కదిలిస్తారు.అయినా ఆడపిల్లలు సహనంతో ఉంటారు.గోధుమలు మంచిగా మొలకెత్తితే పంటలు బాగా పండుతాయని తండా పెద్దలు భావిస్తారు.చుర్మోను.రొట్టెలను బెల్లంతో కలిపి చేసే ముద్ద మేరామా భవానికి సమర్పిస్తారు. జంతువులను బలి ఇస్తారు. దీన్నే కడావో అంటారు.బలి ఇచ్చిన మేక మాంసాన్ని ప్రతి ఇంటికి పంపిస్తారు.తీజ్ వద్ద ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు.
తీజ్ నిమజ్జన కార్యక్రమం…
కఠిన నియమాలు ఎనిమిదో రోజున మట్టితో చేసిన ఆరాధ్య దేవతల ప్రతి రూపాలను పూజించి వాటికి పెళ్ళి చేస్తారు. తమకు డోక్రీలుగా ఉహించుకొని పెళ్లి అయితే పుట్టిల్లు వదిలి వెళ్లాల్సి వస్తుందని ఏడుస్తారు.సోదరులు ఓదార్చుతారు.తొమ్మిదో రోజున తీజ్ నిమజ్జనానికి బంధుమిత్రులను అహ్వానించి వేడుకలు జరుపుతారు.తండా నాయక్ బుట్టలను ఆడపిల్లలకు అందిస్తారు.బుట్టనెత్తుకున్న ఆడపిల్లలు అన్నదమ్ముల ఆశీర్వాదం తీసుకుంటారు( ఇది రాఖీ పండుగను పోలి ఉంటుంది) తరువాత నిమజ్జనానికి బయలుదేరుతారు.ఇది అద్భుత సన్నివేశం ఈ తొమ్మిది రోజుల అమ్మాయిలకు కఠిన నియమాలు ఉంటాయి.ఉప్పు కారం లేని భోజనం తినాలి అత్యంత పవిత్రంగా ఉండాలి, మాంసం నిషేధం,బావి నుంచి నీటిని పోయాల్సిందే, నృత్యాలు చేసినంత సేపు బిందెను నెత్తిపై పెట్టుకుని నిలబడాల్సిందే.యేటా ఆగష్టు రెండో వారం శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుతారు.ఇంత గొప్పగా జరుపుకునే సీత్లా భవానీ తీజ్ ను ప్రభుత్వ అధికారిక పండుగలుగా ప్రకటించాలని లంబాడీలు కోరుతున్నారు.