ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉచిత శిక్షణా కార్యక్ర మాలు

స్టెప్ సమన్వయకర్త కందగట్ల గోపాల్

శాయంపేట నేటిధాత్రి:

ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎడ్యుకేటర్స్ పేరెంట్స్ (స్టెప్) ఆద్వర్యంలో అక్టోబర్ 4,5,6 మూడు రోజులపాటు ఉపాధ్యాయు లకు, విద్యార్థులకు ఉచిత వ్యక్తిత్వశిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని వరంగల్ విభాగం స్టెప్ సమన్వయకర్త కందకట్లగోపాల్ తెలిపారు. విద్యార్థులలో ఉన్న మానసిక ప్రవర్తనా లోపాలను సరిచేసి, వారిలో ఆత్మ విశ్వాసం నింపి తద్వారా వారిని మంచి పౌరులుగాతీర్చి దిద్దడానికి ప్రతీ ఉపాధ్యాయుడు వ్యక్తిత్వ వికాస మార్గదర్శకులుగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నా మని వీటిని గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం లో గల నెక్కళ్లు గ్రామం లో ఉన్న ధ్యాన మందిరంలో 3రోజుల పాటు నిర్వహిస్తు న్నామని తెలిపారు .ఇందులో పాల్గొనే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేయడంతో పాటు మెటీరియల్ మరియు సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. 3 రోజులకు సరిపడే దుస్తులు, బెడ్ షీట్స్ తీసుకొని రావాలి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా రావచ్చని కోరుతున్నారు .ఈ శిక్షణా కార్యక్రమములో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థులు కందకట్ల గోపాల్ ఫొన్ నంబర్ 9392213311 ఫొన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోగలరని కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!