
Secretary Marapalli Mallesh.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి….
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర యు ఎస్ పిసి ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నకు సిపిఐ ఎం ఎల్ పార్టీ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ జీఓ నo 25 ను సవరించాలి ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి 40 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతికొక టీచర్ ఉండాలి ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ వర్క్ లోడ్ కు అనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలి సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ పునరుద్దించాలి నూతన జిల్లాలకు డివిజన్ మండలాల వారిగా ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి మెడల్ స్కూల్స్ గురుకుల సిబ్బందికి010.. పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి ఉపాధ్యా యులు ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్స్ తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం . ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి మండల కార్యదర్శి బుర్రి కుమార్ స్వామి రాజు పాల్గొన్నారు