టిడిపి నూతన కమిటీ ఎన్నిక
పట్టణ అధ్యక్షునిగా చిరురాల రామన్న
పరకాల నేటిధాత్రి:
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు,అరవింద్ కుమార్ గౌడ్,తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నన్నూరి నర్సిరెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.పరకాల పట్టణ కమిటీ అధ్యక్షులుగా చిదురాల రామన్న,ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి శంకర్,ప్రధాన కార్యదర్శిగా బోయిని రాజశేఖర్,క్రిస్టఫర్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మహారాజ్,బేగం,రవీందర్,స్వామి,మంజుల లక్ష్మీలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంటు అడా కమిటీ కన్వీనర్ అర్షనపల్లి విద్యాసాగర్ రావు,రాష్ట్ర పరిశీలకులు ముంజ వెంకట రాజ్యం గౌడ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజు నాయక్,అడా కమిటీ సభ్యులు కందుకూరి నరేష్, లు పాల్గొన్నారు.