తవక్కల్ విద్యార్థులకు సెమ్స్ ఒలంపియాడ్.

National ranks National ranks

తవక్కల్ విద్యార్థులకు సెమ్స్ ఒలంపియాడ్ జాతీయ ర్యాంకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

తవక్కల్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ప్రతీ సంవత్సరం ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందని విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ అన్నారు. గత విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో నిర్వహించిన సెమ్స్ ఒలంపియాడ్ టాలెంట్ టెస్ట్ లో పలువురు విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వచ్చాయని ఆయన అన్నారు. మందమర్రిలోని ఫోర్త్ క్లాస్ తన్విశ్రీ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్, రామకృష్ణాపూర్ లోని తొమ్మిదవ తరగతి అబూ హురైరా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్, నాల్గవ తరగతి విధిషా రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్, ఐదవ తరగతి సాయి సృజన్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ లు సాధించారని అబ్దుల్ అజీజ్ తెలిపారు. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మొదటి అవార్డ్ గ్రహీత అనూప్ కుమార్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు, గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం నగదు పురస్కారాలతో విద్యార్థులను సన్మానించారు.విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!