షైన్ హైస్కూల్ లో వ్యాసరచన పోటీలు
భూపాలపల్లి నేటిధాత్రి
టాటా బిల్డింగ్ ఇండియా టిసిఎస్ వారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని షైన్ హైస్కూల్ లో “ఆత్మనిర్చర భారత్” అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ‘మేము సైతం’ దేశ అభివృద్ధిపై సూచనలు, సలహలు ప్రభుత్వాలకు ఇవ్వగలమని సూచించారు. కార్యక్రమ అనంతరం పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో టిసిఎస్ పర్యవేక్షక అధికారి రాజు, పాఠశాల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, కరస్పాండెంట్ భాన్దుచందర్, ప్రిన్సిపాల్ స్రవంతి, ఉపాధ్యాయుడు రాజేష్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు పిల్లలకు ఇంతమంచి కార్యక్రమాలు, పోటీలు జాతీయస్థాయిలో నిర్వహిస్తు నందుకు షైన్ పాఠశాల యాజమాన్యాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులు అభినంధిచారు.