
Tata AIA Insurance Service Point Launched in Kesamudram
కేసముద్రంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ ప్రారంభం
ఆరోగ్య బీమా తీసుకోండి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందండి
తక్కువ ప్రీమియంతో… ఒకే పాలసీ తో కుటుంబ మొత్తానికి కవరేజ్ లభిస్తుంది
టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ కే లక్ష్మణ్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ భవనం పైన గల మొదటి అంతస్తులో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆఫీస్ గణంగా ప్రారంభోత్సవం జరిగింది.
దీనికి ముఖ్య అతిధులుగా టాటా వరంగల్ బ్రాంచ్ మేనేజర్ కె. లక్ష్మణ్ సి బి ఏ జి . వీరేశం , కేసముద్రం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ,రావుల మురళి,అంబటి మహేందర్ రెడ్డి మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శి చందా గోపి,బాలు నాయక్,సుధాకర్, జాఫర్, తుంపిల్ల వెంకన్న, వీరన్న, ఉపేందర్, టాటా ఎస్ బి ఏ, సత్యం , నగేష్ ,కొండల్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్వవ అనంతరం టాటా లైఫ్ ఇన్స్యూరెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించే మేనేజర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి జీవిత భీమా అనేది తప్పని సరిగా కల్పించాలనే సంకల్పం తో బుధవారం టాటా ఇన్సూరెన్స్ ఆఫీస్ ప్రారంభించటం జరిగినది. అలాగే సీనియర్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానర్ డాక్టర్ మోహన్ నాయక్, వనిత మాట్లాడుతూ కేసముద్రం మండల ప్రజలు, పట్టణ వాస్తవ్యులు అందరూ కూడా ఈ సర్వీసు పాయింట్ ను ఉపయోగించూకోగలరని
తెలియజేశారు.