
Fertilizer Shops Inspected by Task Force in Zharasangam
ఎరువులు దుకాణాలలో టాస్క్ ఫోర్స్ టీం అధికారులు తనిఖీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో వివిధ ఎరువులు దుకాణాలలో టాస్క్ ఫోర్స్ టీం సబ్ ఇన్స్పెక్టర్ పాటిల్ క్రాంతి కుమార్ మరియు మండల వ్యవసాయ అధికారి వెంకటేశం యూరియా నిల్వల గురించి సంయుక్తంగా తనిఖీ చేయడం జరిగింది ,
యూరియా ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు అమ్మవలెను, ఎరువుల నిల్వ మరియు ధరల వివరాలను స్టాక్ బోర్డు మీద రోజు వారిగా పొందుపర్చాలని సూచించారు.
అధిక ధరలకు అమ్మిన యెడల సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..