
*ఎమ్మెల్సీ అంజిరెడ్డికి స్వాగతం పలికిన తాండూర్ మండల బిజెపి నాయకులు*
తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :
గత మూడు రోజులుగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం,జీవో నంబర్ 49 శాశ్వతంగా రద్దు చేయాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారికి సంఘీభావం తెలిపేందుకు విచ్చేస్తున్న గౌరవ ఎమ్మెల్సీ శ్రీ అంజి రెడ్డి గారిని ఈరోజు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ఐబి వద్ద బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్,మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ,జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి,జిల్లా కార్యదర్శి గోవర్ధన్,జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి,అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్,జిల్లా కార్యవర్గ సభ్యులు కేశెట్టి విజయ్,జిల్లా ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి,మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్,మండల ఉపాధ్యక్షులు రేవెల్లి శ్రీనివాస్, మండల కోశాధికారి రాచర్ల సురేష్ జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్,సీనియర్ నాయకులు అజ్మీర శ్రీనివాస్,దుర్గ చరణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి అరికెల శంకర్ తదితరులు పాల్గొన్నారు.