గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఏ అనూష
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో డాక్టర్ ఏ అనూష ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అప్పుడే పుట్టిన పాప నుంచి ఐదేళ్ల లోపు పిల్లల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.
ఇందులో భాగంగా మార్చి 3న ఆదివారం పల్స్ పోలియో చుక్కల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వైద్యశాఖ అధికారులు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పోలియో వాక్సిన్లు అందుబాటులో ఉంచారు.
విధిగా పోలియో చుక్కలు వేయించాలి
ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు విధిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలి. ఎవరికి వారు తమ పిల్లలను సమీపంలోని కేంద్రాలకు తీసుకెళ్లి వేయించుకోవాలి. జిల్లాలోని పసిపిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.