అమర్ నాథ్ రెడ్డి పై చర్యలు తీసుకుని, నా భూమి నాకు ఇప్పించండి…
తిరుపతి నేటిధాత్రి :
తిరుపతి అర్బన్ మండలం మంగళం రెవెన్యూ దాఖలు సర్వేనెంబర్ 78/2 ,78 /టు బి వన్ లో ఉన్న మా తాతగారు అయినటువంటి
ఎరుకులకృష్ణయ్య పొలం నందు బాగ పరిష్కారం లో భాగంగా నా భర్త అయినటువంటి శంకరయ్య, మా బావగారు సురేంద్ర పేరు మీద పత్రాలు ఉన్నాయని, దానిపైన బ్యాంకులో లోను కూడా తీసుకోవడం జరిగిందని అయితే అమర్ నాథ్ రెడ్డి, కిరణ్ లు తనని మోసం చేశారని.తనకు న్యాయం చేయాలని బాధితురాలు పావని గురువారం మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిరణ్ అనే వ్యక్తి అమర్ నాథ్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి తన వద్ద ఉన్న పొలం కు సంబంధించిన పత్రాలతో 2024వ సంవత్సరం 6 వ నెలలో నా దగ్గర సంతకాలు పెట్టించుకుని.. డెవలప్మెంట్ అగ్రిమెంట్ చెసుకోవడం జరిగిందని, అయితే ఆ తరువాత ఇంతవరకు నాకు ఎటువంటి అగ్రిమెంట్ ప్రకారం న్యాయం జరగలేదని,తన పొలం దగ్గరికి వెళితే, కులం పేరుతో దూషించి..
తన పైన దౌర్జన్యానికి దిగుతున్నారని, జరిగిన సంఘటనపై తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో అమర్నాథ్ రెడ్డి, కిరణ్, లపై కేసు నమోదు చేస్తారని
ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన రెవెన్యూ అధికారులు పోలీసు వారు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు.