“నేటిధాత్రి” ఐనవోలు.
ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ఎండీ. విలాయాత్ అలీ(25) ఇటీవల ప్రకటించిన టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాల్లో 489.5 మార్క్స్ తో రాష్ట్రస్థాయిలో 86వ ర్యాంక్ జోనల్ స్థాయిలో BC-E కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించారు. విలాయాత్ అలీకి ఈ రోజున ఐనవోలు తహసీల్దార్ K. విక్రమ్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది శాలువాతో సన్మానించి మొమెంటో అందజేసినారు. మరియు పూల మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినారు.
విలాయాత్ అలీ మాట్లాడుతూ నాకు వచ్చిన ర్యాంక్ ప్రకారం డిప్యూటీ కలెక్టర్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దిగువ మధ్యతరగతి కుటుం బానికి చెందిన నేను నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.
గ్రూప్-1 లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంక్ సాధించినట్టు తెలిపాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి గ్రూపు -1 కి సన్నద్ధం అయ్యను అని తెలిపినారు
ఇట్టి సన్మానం కార్యక్రమంలో తహసీల్దార్ K. విక్రమ్ కుమార్, నాయబ్ తహసీల్దార్ K. అనిల్ కుమార్, మండలం గిర్థవర్ శ్రీమతి రేగొండ రాణి, అదనపు గిర్థవర్ మరుపట్ల మల్లయ్య, ASO, మండల సర్వే యర్, కార్యాలయం సిబ్బంది మరియు పున్నెల్ గ్రామస్తులు పాల్గొన్నారు.