డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం…..
డ్రగ్స్ బారి నుండి బావిభారత పౌరులను రక్షిద్దాం….
ఈగల్ టీం డిఎస్పి ఉపేందర్….
నేటిధాత్రి
కమలాపూర్ (హనుమకొండ) బావి భారత పౌరుల జీవితాలను నాశనం చేస్తూ,సమాజానికి పెనుభూతంగా తయారైన డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని ఈగల్ టీం డిఎస్పి ఉపేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలోనీ కమ్యూనిటీ హాల్లో విద్యార్థులు,గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు,వైద్య సిబ్బంది,మండల అధికారులతో నిర్వహించిన సమావేశంలో విద్యార్థులకు డ్రగ్స్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు యువత డ్రగ్స్ బారినపడి తమ విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారని,భవిష్యత్తును కోల్పోతున్నారని, దానికి దూరంగా ఉండాలని
పిలుపునిచ్చారు.ఆర్థికంగా,శారీరకంగా,మానసికంగా క్రుంగి పలువురు తమ జీవితాలన్ మధ్యలోనే బుగ్గి పాలు చేసుకుంటున్నారని,మరి కొందర్ ఆ మత్తులో నేరాలు,ఘోరాలు చేస్తూ సమాజానికి చీడ పురుగులుగా తయారై సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్త పరిచారు.డ్రగ్స్ వాడటం వల్ల కలిగే పలు అనర్థాలను వివరించారు.పిల్లలను డ్రగ్స్ కు దూరంగా ఉండేటట్లు వారిపై దృష్టి సారించాలని తల్లిదండ్రులను,పాఠశాల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.అనంతరం పాఠశాల విద్యార్థి విద్యార్థులచే డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేసి డ్రగ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.డ్రగ్ రహిత గ్రామంగా మార్చేందుకు అందరము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ నవీన్,కమలాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పబ్బు సతీష్ తో పాటు వార్డు సభ్యులు, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ వైద్యులు,సిబ్బంది, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మరియు వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు, పాల్గొన్నారు.
