నేడు రక్తదాన శిబిరం..

నేడు రక్తదాన శిబిరం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, జనవరి 11: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ నెల 12న స్థానిక పద్మశాలి భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పద్మశాలి యువజన సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. సోమవారం ఉదయం 8.30 నుండి 1.00 వరకు రక్తదాన శిబిరం కొనసాగుతుందని, 60 సంవత్సరాలలోపు యువతీ యువకులు ఎవరైనా ఈ శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేయవచ్చని పేర్కొన్నారు. రక్తం దానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదాతగా నిలుస్తారని శిబిరంలో రక్తదానం చేసినవారికి ధ్రువపత్రం కూడా జారీ చేయబడుతుందని వివరించింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు రావాలని పిలుపునిచ్చింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version