గెలుపే లక్ష్యంగా ముందుకు
7వ వార్డులో అభ్యర్థి సునిల్ ఎన్నికల ప్రచారం
పరకాల,నేటిధాత్రి
మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం వేయడమే లక్ష్యంగా తన గెలుపుకోసం 7వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పావుశెట్టి సునీల్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి చేయి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని,వార్డును అభివృద్ధి బాటలో నడిపే లక్ష్యంతోనే మీ ముందుకు వచ్చానని తెలిపారు.మీరు సహకరించి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
