ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి చేస్తా 22వ వార్డు అభ్యర్థి మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో, మీ విలువైన ఓటును 22వ వార్డు అభ్యర్థి మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి, చోటు కల్పించాలని. అభివృద్ధికి బాటలు వేసి వార్డు ప్రజల రుణం తీర్చుకుంటారని పట్టణంలోని, 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ కోసం ఆదివారం సాయంత్రం జహీరాబాద్ సీనియర్ నాయకులు షేక్ ఫరీద్ బీఆర్ఎస్ నాయకులు. ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని, కాలువ నిర్మాణాలు, రహదారుల ద్వారా సమస్యలు తీర్చిందని గుర్తు చేశారు. భవిష్యత్తులోను, కోట్లాది రూపాయలు వార్డుల వారిగా వెచ్చించి అభివృద్ధి పనులు చేసేందుకు, మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ సిద్ధంగా ఉన్నారని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఇంటింటి ప్రచారానికి మంచి ఆదరణ వస్తుంది. ఎక్కడికి వెళ్లినా మహిళా ఓటర్లు సానుకూలంగా స్పందిస్తున్నారని వెల్లడించారు.
