ఒకవైపు రక్షకభటుడు, మరొకవైపు రచయిత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-20-5.wav?_=1

ఒకవైపు రక్షకభటుడు, మరొకవైపు రచయిత
కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణానికి చెందిన కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్ ఒకవైపు రక్షక భటుడిగా,మరొకవైపు రచయితగా ఎదుగుతూ అనేకమైన అంశాలపై సాహిత్యంలో పెన్నును,గన్నుగా చేస్తూ రానిస్తున్నటువంటి సాయి మహేష్ సమాజంలో జరిగే అంశాలను తన లోతుల వైపు చూస్తూ గన్నును పెన్నుగా మారుస్తూ సమాజ శ్రేయస్సుకు వివిధ అంశాలతో కూడిన కవిత్వాన్ని క్రూడీకరించి విశ్లేషించి అనేక అంశాలను కవితలుగా మార్చి సమాజాన్ని తట్టు లేపుతున్నటువంటి ముడారి సాయి మహేష్ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సభ్యులు గా మరియు అనేక అవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి ముడారి సాయి మహేష్. అంతేకాకుండా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవా పథకం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ చేతులమీదుగా,,జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మరియు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే చేతుల మీదుగా అందుకోవడం విశేషం. అలాగే జిల్లా కవులు రచయితలు, రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, బురదేవానందం,అంకారపు రవి ,గుండెల్ని వంశీ కృష్ణ, మొదలైన సాహితీ మిత్రులు అభినందించారు.

బెల్లంపల్లిలో 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T151830.696-1.wav?_=2

బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రోజున 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి.

జాతీయ గీతలాపన అనంతరం స్వీట్లు పంచి వేడుకలను ఘనంగా జరిపారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలో భవిత డిగ్రీ కాలేజ్ ఆవరణలో, కాలటెక్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు.ఏఎంసి చౌరస్తా వద్ద స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రివర్యులు కాక గడ్డం వెంకటస్వామి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు
ఎమ్మెల్యే మాట్లాడుతూ
అందరూ మహనీయులు త్యాగాలు ఫలితమే భారత దేశ స్వతంత్రం అని అన్నారు వారి సేవలను గుర్తు చేసుకోవాలని కోరారు
ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తి కోసం
పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ
దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలనాయకురాలు,ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T145640.373.wav?_=3

 

ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండల కేంద్రంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మండల తహసిల్దార్ కార్యాలయంలో పోలీసులు గౌరవ వందనం చేయగా తహసిల్దార్ రాణి జాతీయ పతాకావిష్కరణ చేశారు,నడికూడ జిపి యందు ఎంపీడీవో గజ్జెల విమల జాతీయ జెండాను ఆవిష్కరించారు,మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ చేశారు,మండల రైతు వేదిక ప్రాంగణంలో వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు, జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కే. హనుమంతరావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది,పోలీసులు,పాఠశాల ఉపాధ్యాయులు,ప్రజా ప్రతినిధులు,అంగన్వాడీ టీచర్స్,ఆశా వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.

సిద్ధాపూర్ ఏఈఓకి ఉత్తమ పురస్కారం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T143809.428.wav?_=4

 

సిద్ధాపూర్ ఏఈఓకి ఉత్తమ పురస్కారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలోని సిద్ధాపూర్ క్లస్టర్ ఏ ఈ ఓ సుకుమార్ కి ఉత్తమ సేవ అవార్డు లభించింది , జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ ప్రవీణ్యా ఎస్పీ పారితోష్ పంకజ్ టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ చేతుల మీదుగా సుకుమార్ అవార్డు అందుకున్నారు,ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ 8 ఏళ్లుగా రైతులకు విశిష్ట సేవలు అందించిన ఉద్యోగానికి గుర్తింపు వచ్చిందన్నారు, అవార్డు రావడం వల్ల క్లస్టర్ రైతులు మరియు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య వేడుకలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T143014.351-1.wav?_=5

 

ఘనంగా ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జాతీయ జెండా ఎగురవేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ,పాల్గొన్న నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.
నియోజకవర్గ ప్రజలకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం వచ్చి భారతీయులపై పెత్తనం చెలాయించారు.దేశ సంపదను కొల్లగొట్టడమే కాకుండా ప్రజల మాన ప్రాణాలను బలి తీసుకోవడంతో ఎందరో వీరులు తమ ప్రాణలను పణంగా పెట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించారన్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది దేశ నాయకులు తమ ప్రాణాలను అర్పించి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారన్నారు.గాంధీ,సుభాష్ చంద్రబోస్,భగత్ సింగ్,నెహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్,అల్లూరి సీతారామరాజు వంటి వీరుల త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని దేశం కోసం సేవ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి మున్సిపల్ చైర్మన్ లు అల్లాడి నర్సింలు , తంజిమ్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,
మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్ ,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు , అధ్యక్షులు , మున్సిపల్ వార్డ్ అధ్యక్షులు ,ఉద్యమకారులు ,బి ఆర్ ఎస్వీ నాయకులు ,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…

బెల్లంపల్లిలో సిపిఐ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T142142.125.wav?_=6

 

భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

 

ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి 79వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగినది వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు దేశ స్వాతంత్రానికై సమరయోధులై పోరాటం కొనసాగించారని స్వాతంత్రోద్యమంతో సంబంధంలేని మతోన్మాద బిజెపి ఆర్ఎస్ఎస్ లు స్వాతంత్రోద్యం కోసం దేశభక్తి కోసం మాట్లాడడం హాస్యాస్పదమని నిజమైన దేశభక్తి అంటే పేదల నిర్మూలన ఆదివాసీలు గిరిజనుల హక్కుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అని గిరిజన హక్కుల కోసం పోరాడే నక్సలైట్లను హతమార్చడం కాదని సమస్యల పరిష్కరించినప్పుడే ఉద్యమాలకు తావుండదని సమస్యలు ఉన్నంతకాలం ఎర్ర జెండా పోరాటాలు ఉంటాయని వారన్నారు, రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ మాట్లాడుతూ 79వ గణతంత్ర స్వాతంత్ర వేడుకలను పట్టణ కార్యాలయంలో నిర్వహించడం సంతోషదాయకమని ఓటు హక్కులను దుర్వినియోగపరుస్తూ కేంద్ర ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని ఇలాంటి చర్యలు మానుకోవాలని వారన్నారు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ కార్మిక హక్కులను కాల రాయడంలో బిజెపి ని ఎవరు బీట్ చేయలేరని కార్మికులంతా ఒక్కటై కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని వారన్నారు, ఈ కార్యక్రమంలో
బి కే ఎం యు జాతీయ సమితి సభ్యులు అక్క పెళ్లి బాబు, మండల కార్యదర్శి బొంతుల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, ఎస్ సి డబ్ల్యూ యు బ్రాంచ్ సహాయ కార్యదర్శి డి తిరుపతి గౌడ్, పట్టణ కోశాధికారి మంతెన రమేష్, కో ఆప్షన్ సభ్యులు మూల శంకర్ గౌడ్, పట్టణ కార్యవర్గ సభ్యులు, రత్నం రాజo, బియ్యాల ఉపేందర్, బొంకూర్ రామచందర్, బండారి శంకర్, నాయకులు గుండ ప్రశాంత్, బియ్యాల భవాని, బూర్ల సమ్మయ్య, ఉప్పుల శంకర్, కట్ల పోచం పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో BRS నాయకుల ఆగడాలకు చట్టపరమైన చర్యలు కోరారు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T131641.925.wav?_=7

 

చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని వీధి రౌడీ లా ప్రవర్తించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ లో సెట్విన్ కార్యాలయంలో ప్రభుత్వపరమైన కార్యక్రమం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తమకు విలువనివ్వడం లేదని కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్న ఫ్లెక్సీ ని చింపి వేసినారు వాస్తవానికి వారికి ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వారి పరువుకు భంగం కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ప్రశాంత వాతావరణంలో ఉన్న రాష్ట్రాన్ని కావాలని రాజకీయ పార్టీ గొడవలను సృష్టించాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముసుగులో ఉన్న గుండాలు వీరు చేసిన ఆగడాల వీడియో క్లిప్పులను జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇవ్వడం జరిగినది వెంటనే వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది కార్యక్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కండెం నర్సింలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గేల్లి రాములు యాదవ్ జహీరాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజామియా జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మొహమ్మద్ జాంగిర్ రాజశేఖర్ మోతి రామ్ రాథోడ్ పి.రాములు నేత మహమ్మద్ యూనుస్ జహీరాబాద్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ మోయుజోద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఇనాయత్ అల్లి మహమ్మద్ అక్బర్ మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మహమ్మద్ గౌస్ కాశీనాథ్ సురేష్ స్వామి నసురుల్లా ఖాన్ మొహమ్మద్ జమీల్ కురేషి మహమ్మద్ ఖదీర్ ఖురేషిఇస్మాయిల్ నైస్ టైలర్ సీనియర్ నాయకులు పద్మారావు మొహమ్మద్ ఇస్మాయిల్ పటేల్ మొహమ్మద్ మసీదున్ పేర్ల నాగేష్ గార్లు వినతి పత్రం ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినారు.

ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T130100.266.wav?_=8

ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

శ్రీరాంపూర్,నేటి ధాత్రి :

 

 

 

 

79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.అధ్యక్షులు చెల్ల విక్రమ్ జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు స్వీట్స్ పంచిపెట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల బ్రతుకులు మారలేదని అన్నారు.ఇప్పటికైనా పాలకులు ఆలోచించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గోలేటి శివ ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

రాంపురం పాఠశాలకు సౌండ్ సిస్టం బహుకరణ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T125048.371.wav?_=9

 

9000 రూ తో సౌండ్ సిస్టం బహుకరణ

మరిపెడ నేటిధాత్రి

 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ తాను పనిచేస్తున్న పాఠశాల పిల్లల కోసం వారి యొక్క నేస్తం మిత్రులు, వాకర్స్ మిత్రులు ఇంకా కొంతమంది బాల్య మిత్రుల నుండి సేకరించిన రూపాయలు 9000 రూలతో ఆహుజ కంపెనీ సౌండ్ సిస్టంను స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాంపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శశిదర్ చేతుల మీదుగా పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కనకం గణేష్, శ్రీధర్, కిన్నెర శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

పౌర సంక్షేమ సమితి స్వాతంత్ర్య వేడుకలు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T123401.367.wav?_=10

 

పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ సభ్యుల ఉత్సాహం మధ్యన అధ్యక్షుడు బియాంకర్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం చాలా అత్యున్నత దేశమని స్వతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పౌర సంక్షేమ సమితి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ ఇంకా అభివృద్ధి చెందాలని దానికి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. వివిధ విభాగాలలో విద్య వైద్యం మహిళా అభివృద్ధికి కృషి జరపవలసి ఉన్నదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో
బియ్యంకార్ శ్రీనివాస్,అధ్యక్షుడు వేముల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చిప్ప దేవదాసు, కోశాధికారి మరియు సభ్యులు వేముల పోశెట్టి,శివశంకర్,కోడం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల రచయితల సంఘం స్వాతంత్ర్య వేడుకలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T122437.459.wav?_=11

 

సిరిసిల్ల జిల్లా కవులు,రచయితల సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలాగొండ రవి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యo వచ్చి 79 సంవత్సరాలు అయిన సందర్భంగా జిల్లా కవులకు మరియు రచయితలకు శుభాకాంక్షలు తెలపడం జరిగినది అంతేకాకుండా. మాజీ సిరిసిల్ల జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కవులు,రచయితలు,
కళాకారులు దేశ సర్వతో ముఖ అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగాలని అద్వితీయమైనటువంటి దేశ ప్రగతికి కలాలను గళాలుగా వినిపించాలని తెలిపారు. అలాగే సీ.సా.స అధ్యక్షులు జనపాల శంకరయ్య సిరిసిల్ల జిల్లాలోని యువ రచయితలు ముందుకు రావాలని సమాజ శ్రేయస్సుకు తమ కలాలను ఎక్కు పెట్టాలని కోరారు. జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షులు వెంగళ లక్ష్మణ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాటను పాడారు. అలాగే ఈ కార్యక్రమంలో సీ.సా.స గౌరవ అధ్యక్షులు కోడం నారాయణ, మరియు చిటికెన కిరణ్ కుమార్,జిల్లా రచయితల సంఘం యువజన కార్యదర్శి అంకారపు రవి, దూడం గణేష్, గుండెల్లి వంశీ, కోడం సురేష్, తదితర కవులు,రచయితలు పాల్గొన్నారు.

బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

హైదరాబాద్, నేటిధాత్రి :
బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్ నెం. 12 పెద్దమ్మ గుడి కూల్చివేతపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ విచారణ సందర్భంగా పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని అధికారులకు హైకోర్టు ఆదేశించింది. పెద్దమ్మ తల్లి విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈరోజు నెల 18కు వాయిదా వేసింది.

కొన్ని రోజుల క్రితం అధికారులు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇక్కడి స్థానికులు, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశాయి. దీనిలో భాగంగానే ఇటీవల కుంకుమార్చాన పూజకు పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ముందే అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్తగా పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరగా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. గతంలో ఈ అంశంపై బండి సంజయ్ సైతం స్పందించారు. తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్‌లోని

గ్రీన్ స్టార్ హాస్పిటల్ ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు.

గ్రీన్ స్టార్ హాస్పిటల్ ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు.

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ తొలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి,రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మాజీ తన్నీరు హరీష్ రావు నర్సంపేట పట్టణంలో
నెక్కొండ రోడ్డులో నూతనంగా నిర్మించిన గ్రీన్ స్టార్ హాస్పిటల్ ను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ప్రాంతంలో కిడ్నీ,గుండె,బ్రెయిన్ తదితర అత్యాధునిక పరికరాలతో సర్జరీలు,వైద్య సదుపాయం సేవలు చేయనున్నట్లు తెలిపారు.ఆసుపత్రికి ఆరోగ్య శ్రీ పథకం వచ్చే వరకు తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ రోగికి ఉచిత ఓ.పి సేవలు అదుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు.

Green Star Hospital

ర్యామినార్ ఆపరేషన్ దియేటర్ ఏర్పాటు ద్వారా అడ్వాన్స్డ్ శస్త్ర చికిత్సలు నర్సంపేటలో మొదటిసారి వచ్చాయని డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.ఎన్నారై,ఆసుపత్రి డైరెక్టర్ శానబోయిన రాజ్ కుమార్ మాట్లాడుతూ నర్సంపేట పరిదిలో ప్రజలకు తక్కువ ఖర్చులతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో తెచ్చమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సుంకరి సంతోష్ రెడ్డి,స్వప్న సుదర్శన్ రెడ్డి, గోనె యువరాజు,డాక్టర్ శ్రీకృష్ణుడు, డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి,డాక్టర్ ఓం ప్రకాష్,డాక్టర్ రాహుల్,డాక్టర్ విద్య,డాక్టర్ కిరణ్ రెడ్డి,రాష్ట్ర మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్,వై.సతీష్ రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు,ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ,పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ,నియోజకవర్గ యూత్ కన్వీనర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, పిఎసిఎస్ చైర్మన్ లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు,ప్రజాసంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

 

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేయడమే ఝాన్సీ యశస్విని రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులను ఝాన్సీ యశస్విని రెడ్డిలు గుర్తిస్తారని అన్నారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రచారం చేయాలని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎలా గెలిపించారో రాబోయే ఎన్నికల్లో వారు కష్టపడి కార్యకర్తలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కోసమే నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవలందించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఝాన్సీ యశస్విని రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ జెండాకు అండగా ఉన్నారని, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకుంటారని అన్నారు. పాలకుర్తిలో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన వ్యక్తులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ కోసం ఎంతమంది బలైన కాంగ్రెస్ పార్టీ గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశాడని అన్నారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, ఎస్టి సేల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్, నాయకులు అలువాల సోమయ్య, బిజ్జాల అనిల్, గోపి నాయక్, సురేందర్ నాయక్, పరశురాములు, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-42.wav?_=12

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నేషనల్ స్కాలర్ షిప్ స్కీమ్ క్రింద వీడియో కార్మికుల పిల్లలకి అందించే ఉపకార వేతనాల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులు, లైమ్ స్టోన్ & డోలో మైట్ ఖనిజాల కార్మికులు, మైకా మైనింగ్ కార్మికులు, ఐరన్ ఓర్ , క్రోమ్ ఓర్ మైనింగ్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా పరిధిలో బీడీ కార్మికుల పిల్లలందరికీ ఉపకార వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 6 నెలల పాటు బీడీ కార్మికులుగా పని చేసిన వారు, వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని అన్నారు.
నేషనల్ స్కాలర్ షిప్ క్రింద 1 నుంచి 4వ తరగతి చదివే పిల్లలకు వెయ్యి రూపాయలు, 5 నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు 1500, 9 నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు 2 వేల రూపాయలు, ఇంటర్ పిల్లలకు 3 వేల రూపాయలు, డిగ్రీ, పిజి డిప్లమా కోర్సుల చదివే పిల్లలకు 6 వేల రూపాయలు, ఐటిఐ పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 8 వేల రూపాయలు, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చేసే పిల్లలకు 25 వేల రూపాయల ఉపకార వేతనం అందుతుందని అన్నారు.

Collector Sandeep Kumar Jha

 

1 నుంచి 10వ తరగతీ వరకు చదివే విద్యార్థులు ఆగస్టు 31 లోపు,ఇంటర్ పై చదువు చదివి విద్యార్థులు అక్టోబర్ 31 లోపు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలందరూ ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తులు ఆగస్టు 31 లోపు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్హత గల బీడీ కార్మికుల పిల్లలందరూ scholarships.gov.in , జాతీయ స్కాలర్షిప్ కోర్ట్ నందు దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఉప సంక్షేమ కమిషనర్ సాగర్ ప్రధాన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్లు కేంద్ర సంక్షేమ ఆసుపత్రి డా.మహేందేర్, డా.మధుకర్, డా.వెంకటేష్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్ జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దీన్ అదనాపు డిఆర్డిఏ శ్రీనివాస్ ఎంపీడీవోలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభ పిలుపు….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-41.wav?_=13

సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయండి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు లంకదాసరి అశోక్

పరకాల నేటిధాత్రి

 

భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు లంకదాసరి అశోక్ అన్నారు.ఈసందర్బంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్నందు కార్మికులతో కలిసి పోస్టర్ లను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆగస్టు 19,21,22న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని గాజుల రామారం మహారాజు గార్డెన్లో ఈ మహాసభలు జరగనున్నాయని తెలిపారు.భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆర్భవించి దేశ సంపూర్ణ స్వతంత్ర కోసం తిరుగుబాటు చేసిన మొదటి రాజకీయపార్టీగా చరిత్ర సృష్టించిందన్నారు.మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుండి 1000 మంది ప్రతినిధులు పాల్గొని నాలుగు రోజులు ప్రజా సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాటం కార్యక్రమాలను నిర్ణయిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిపిఐ కార్యవర్గ సభ్యులు జక్కు రాజ్ గౌడ్,నకిరేత ఓదెలు,సిపిఐ మండల కార్యదర్శి ఇల్లందుల రాములు,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు లంకదాసరి అశోక్,రైతు నిరంజన్,కుమ్మరి సదనందం తదితరులు పాల్గొన్నారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T144552.380.wav?_=14

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన

◆:- శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 8 మంది లబ్ధిదారులకు చెక్కులను గాను ₹2,25,000 విలువ గల చెక్కులను క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అందజేయడం జరిగింది.

లబ్ధిదారుల వివరాలు:-

చిన్న హైదరాబాద్ కి చెందిన శారు బాయి మేఘవత్ ₹.21,000 గడి వీదికి చెందిన రైనగారి రాజ రత్నం ₹.12,000 పాండు రంగా స్ట్రీట్ కి చెందిన అమీనా సుల్తానా ₹.12,000 రంజోల్ కి చెందిన మోషప్ప ₹.60,000 & బ్యాగారి స్వప్న ₹.30,000 రచ్చన్నపేట్ కి చెందిన తర్లపల్లి ధనలక్మి ₹.39,000 & కమలాకర్ ₹.18,000 రాం నగర్ కి చెందిన దశరథ్ ₹.33,000
ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ చైర్మన్ తంజీమ్ ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,సత్యం, బరూర్ దత్తాత్రి,గణేష్,చంద్రయ్య ,దీపక్ ,అశోక్ రెడ్డి ,
తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,బిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు

టాప్ 100 ప్రభావవంతుల జాబితాలో శ్రీధర్ బాబు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-39-1.wav?_=15

మంత్రి శ్రీధర్ బాబు కి అరుదైన గౌరవం దక్కడం సంతోషకరం

ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

ముత్తారం :- నేటి ధాత్రి

 

తెలంగాణ రోడ్ మాడల్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అహర్నిశలు నిద్రాహారాలు మాని రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నటువంటి ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి ఇండియా 100 మోస్ట్ ఇన్ పూ యూనియల్ పీపుల్ ఏఐ జాబితాలో చోటు చేసుకోవడం సంతోషకరం ఎంతో గర్వకారణం అని ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు మంథని నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు కేవలం రెండు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేస్తారని ఆశిస్తూ మా నాయకున్నీ అభివృద్ధి విషయంలో విమర్శిస్తున్న గులాబీ నాయకులకు ఇది ఒక చెంపపెట్టు అని అన్నారు

మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో ఐదేండ్ల జైలుశిక్ష,

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T140151.084.wav?_=16

 

మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో ఐదేండ్ల జైలుశిక్ష,

జహీరాబాద్,నేటిధాత్రి:

 

మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితునికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా స్పెషల్ పోక్సో జడ్జి జయంతి విధించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,ఎస్ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కథనం ప్రకారం సంగారెడి జిల్లా జహీరాబాద్ మండలం మధులై తండాకు చెందిన రాథోడ్ సంజీవ్ అదే తండాకు చేసిన మైనర్ బాలిక ఇంటివద్ద ఒంటరిగా ఉండగా బాలికపై కన్నేసిన రాథోడ్ సంజీవ్ 2020 జులై 7 న ఇంట్లోకి తీసుకెళ్ళాడు.అరుస్తే చంపుతా అని బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడగా వెంటనే బాలిక అరుపులకు చుట్టుపక్కల వారు వస్తున్నారని గ్రహించి పారిపోయాడు.తల్లిదండ్రుల ఫిర్యాదుతో నాటి ఎస్సై కె.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

నిందితుని శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.ఎస్ ఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం. నేరం సంఖ్య: 51/2020- సెక్షన్ 354,ఎ 448,506,, ఐ పి సీ సెక్షన్ 7 %తీ/ష% బి ఆఫ్ పోక్సో యాక్ట్ 2012, చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్. వివరాలలోనికి వెళ్లితే: చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో హిర్యాధి కూతురు వయస్సు 14 సంవత్సరాలు తేదీ 07.07.2020 నాడు మద్యాహ్నం సమయంలో తమ ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలిక పై, అదే తండ కు చెందినా నిందితుడు రాథోడ్ సంజీవ్ అక్రమంగా బాలిక ఇంటిలోకి పోయి అసభ్యంగా ప్రవర్తించి, ఆమె చేయి పట్టుకుని బలవంతంగా తనతో లైంగిక కోరిక తీర్చమని బలవంత పెట్టగ, మైనర్ బాలిక భయపడి అల్లరి చేయగా నిందితుడు ఆమెను భయపెట్టి ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి పారిపొయినాడు, అట్టి వ్యక్తిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ లో దరఖాస్తు చేయగా అప్పటి యస్.హెచ్.ఒ కె గణేష్ ఎస్. ఐ కేసు నమోదు చేసి, ఇన్వెస్టిగేషన్ అనంతరం న్యాయ స్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేయగా, కేసు పూర్వపరాలను విన్న స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి జయంతి నిందితుడు రాథోడ్ సంజీవ్ కు 5-సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ: 10000/-జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుని వివరాలు: రాథోడ్ సంజీవ్ తండ్రి భీమ్ సింగ్, వయస్సు: 30 సంవత్సరాలు, వృతి: కూలిపని, కులం: ఎస్టీ (లంబాడ), నివాసం మధులై తండా, మండలం జహీరాబాద్ జిల్లా సంగారెడి. నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్ రెడ్డి, ఇన్వెస్టిగేషన్ అధికారికె గణేష్ ఎస్. ఐ, ప్రస్తుత ఎస్. ఐ. రాజేందర్ రెడ్డి, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ కృష్ణ, కోర్ట్ లైజనింగ్ అధికారి హెడ్. కానిస్టేబుల్ శంకర్, కె. సత్యనారాయణ ఎస్ఐఐ. లను ఎస్పీ అభినందించారు.

లీడర్లు అటు..క్యాడర్‌ ఇటు!

`తెలంగాణలో విచిత్రమైన రాజకీయ వాతావరణం.

`గతంలో నాయకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు కదిలేవారు.

`ఇప్పుడు నాయకులు మాత్రమే కొత్త దారి వెతుక్కుంటున్నారు.

`బీఆర్‌ఎస్‌ నుంచి నాయకులు కారు దిగుతున్నారు.

`ఇతర పార్టీల నుంచి నాయకులు కారెక్కుతున్నారు.

`కారు దిగుతున్న నాయకులతో మేం రామంటున్నారు.

`అధికారంలో వున్న కాంగ్రెస్‌ వైపు కార్యకర్తలు ఎందుకు చూడడం లేదు!

`కాంగ్రెస్‌ లో కొత్త వారిని కలుపుకుపోరన్న భయమా!

`ఇప్పటికే రెండేళ్ళు గడిచింది.. పార్టీ మారితే ఒరిగేముందన్న భావనా?

`బీఆర్‌ఎస్‌ లో కూడా కార్యకర్తలు అసంతృప్తిగానే వున్నారు.

`అయినా కారు దిగి జారుకోవడానికి సిద్ధంగా లేరు!

`ఇతర కండువాలు కప్పుకోవడానికి సిద్ధంగా లేదు.

`గువ్వల బాలరాజు మీటింగ్‌ తో కొంత తేట లెల్లమైంది.

`మేం రామని తెగేసి చెప్పినట్లైంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అటు లీడర్‌..ఇటు క్యాడర్‌! తెలంగాణలో విచిత్రమైన రాజకీయ వాతావరణం. పార్టీలు మారుతున్న నాయకులతో క్యాడర్‌ రావడం లేదు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా క్యాడర్‌ కదలేదు. ఏ ఎమ్మెల్యేతో పట్టు పని పది మంది వెళ్లలేదు. వెళ్లినా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో పొసగడం లేదు. తమతో ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు వస్తారని, రావాలని కూడా ఎమ్మెల్యేలు అనుకోలేదు. అందుకే కాంగ్రెస్‌లో చేరిన ఏ ఎమ్మెల్యే కూడా దర్జాగా కండువా కప్పుకోలేదు. గతంలో ఈ పరిస్దితి భిన్నంగా వుంది. కాంగ్రెస్‌ నుంచి గాని, తెలుగుదేశం నుంచి గాని బిఆర్‌ఎస్‌లో నాయకులు చేరిన క్రమంలో పెద్ద పెద్ద ర్యాలీలు. వందల కార్లు కాన్వాయిలు. గులాబీలు. జెండాలో అబ్బో అదో పెద్ద సెటప్‌తో వెళ్లేవారు. జిల్లాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులతో చేరి, కండువాలు కప్పుకున్నారు. కండువాలు కప్పే నాయకులు కూడా ఇంకా వున్నారా? అని ఎదురుచూసిన పరిస్దితి కనిపించేది. ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ పార్టీలో నాయకులు చాలానే చేరారు. కాని వారి వెంట క్యాడర్‌ పెద్దగా కదిలినట్లు లేదు. వందల మంది చేత వచ్చి కాంగ్రెస్‌లో కలిసిన నేతలు లేరు. బిఆర్‌ఎస్‌ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరి, కండువా కప్పుకొని, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌ వెంట కూడా జనం వెళ్లలేదు. క్యాడర్‌ ఆయనతో కదలేదు. ఆయన అదృష్టం పాత పరిచయాలు ఆయనకు దానంకు పనికి వస్తున్నాయి. వ్యతిరేకతకు తావు లేకుండా చేస్తున్నాయి. కాని మిగతా ఎమ్మెల్యేలందరికి మాత్రం విచిత్రమైన వాతావరణమే వుంది. ఇందులో కడియం శ్రీహరి లాంటి నాయకుడు గతంలో తెలుగుదేశంలో వున్నంత కాలం బలమైన క్యాడర్‌ను మెంటైన్‌ చేశారు. తర్వాత పదేళ్లకాలం పాటు బిఆర్‌ఎస్‌లో కూడా బాగానే అధికారం చెలాయించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన జిల్లాకు, నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడిగా మిగిలిపోయారు. ఆఖరుకు ఏ పార్టీలో వుండాలో ఆపార్టీలోనే వున్నానంటూ ముక్తాయించాల్సిన పరిస్ధితి తెచ్చుకున్నారు. కాకపోతే తన రాజకీయ చాణక్యంతో, చైతన్యంతో మాత్రం తన కూతురు కావ్యను ఎంపిని చేశారు. ఇది ఎంతైనా గొప్ప విషయం. రాజకీయాల్లో నైతికత అనే పదం ఈరోజుల్లో వాడడమే శుద్ద దండగ. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో వుండి, నైతికత గురించి మాట్లాడడం అంటేనే గొంగడిలో కూర్చొని అన్నం తిన్నట్లే లెక్క. పార్టీలు మారినా, తన రాజకీయ ప్రస్తానాన్ని దిగ్విజయంగా కొనసాగించిన నాయకులలో కడియంశ్రీహరి ఎంతైనా ప్రత్యేకమే. అందుకే ప్రత్యర్ధి రాజకీయాలు చేసినా, ఒకే పార్టీలో కలిసి రాజకీయాలు చేసినా ఆయన స్దానం ఎప్పుడూ నిలబెట్టుకున్నారు. అధికారం చెలాయించారు. ఇతరుల అదృష్టాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అలాంటి నాయకుడు బహుశా దేశంలో కూడా లేకపోవచ్చు. తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు తనకు ఎదురులేకుండాపాలించారు. బిఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్ధి అదృష్టం లాగేసుకున్నారు. 2018 తర్వాత మంత్రి కాకపోయినా, సరే తన పాత్రలోకి ఎవరూ రాకుండానే చూసుకున్నారు. వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో తన దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రాకుండాచూసుకున్నారు. ఇంత పెద్ద నాయకుడైనా సరే ఇప్పుడు క్యాడర్‌ ను వెతుక్కొవాల్సిన పరిస్ధితి వచ్చింది. రాజకీయాలలో వున్న వారు ఎప్పుడు ఏ పార్టీలో వుంటారో..వుండాలో అన్న దానిపై ఎవరి స్ధిర నిర్ణయం లేదు. నిలకడ అసలే లేదు. గాలి వాటం రాజకీయాలు. ఎందుకంటే గతంలో తన జీవితమంతా గులాబీతోనే అని అనేక సార్లు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పేవారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా వేరే రక్తం మనలో పారదు అని కూడా చెప్పారు. కాని అధికారం పోయింది. ఆయన ఓడిపోయారు. బిఆర్‌ఎస్‌లో తనను అనుమానంగా చూస్తున్నారు. మరో వైపు లెక్క చేయడం లేదు. మహబూబ్‌ నగర్‌ బిఆర్‌ఎస్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పెత్తనం ఎక్కువైపోయింది. పార్టీ కూడా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. తనను లెక్క చేయకుండా పార్టీ కార్యక్రమాలు చేపడుతోంది. ఇలాగే వుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కూడా వచ్చే అవకాశం వుంటుందో లేదో అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే మహబూబ్‌ నగర్‌ రాజకీయాలను ఇప్పుడున్న పరిస్దితుల్లో ఒంటి చేత్తో లాగించుకొస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సామాజిక వర్గం, గువ్వల బాలరాజు సామాజిక వర్గం ఒకటే. అంతే కాకుండా అది రిజర్వుస్ధానం. రాజకీయ సమీకరణాలలో భాగంగా చూసుకున్నా, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ లాంటి వారిని జనరల్‌ సీట్లో పోటీ చేయించే అవకాశం వుండదు. రిజర్వు స్ధానంలో బలమైన నాయకులను పెట్టిన పార్టీలే గెలుస్తుంటాయి. కడియం రాజకీయం కూడా అలాగే సాగింది. ఆయన స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఆది నుంచి అక్కడినుంచే పోటీ చేస్తూ వస్తున్నారు. గెలుస్తున్నారు. 2014లో పార్లమెంటుకు ఎన్నికైనా సరే వరంగల్‌ ఎస్సీ రిజర్వుడు నుంచే గెలిచారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కూడా తన సొంత జిల్లా నుంచే పోటీచేయాలని చూస్తున్నారు. గతంలో ఆయన ఆదిలాబాద్‌ నుంచి పోటీ చేసి పొరపాటు చేశారు. ఇది పాత రోజులు కాదు. గతంలో నాయకులకు పార్టీలు సీట్లు ఇచ్చినా గెలిచేవారు. అలా చరిత్రలో చాలా మంది వున్నారు. ఇప్పటికీ వున్నారు. మల్లు భట్టి విక్రమార్క అసలు జిల్లా పాలమూరు. కాని ఆయన మధిరను ఎంచుకొని వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కాని ఇప్పుడు కొత్త నాయకత్వానికి ప్రజలనుంచి ఆ సహకారం అందేలా వుండేలా లేదు. ఉమ్మడి జిల్లా వరకు సరే,గాని జిల్లాలు దాటి వెళ్లి గెలవడం అంటే సాద్యమయ్యే పని కాదు. నాయకులు కొత్త దారితోపాటు సరికొత్త పంధాలో వెళ్లాలనుకుంటున్నారు. తాజాగా కారు దిగి, కమలం గూటికి చేరిన గువ్వల బాలరాజుతో పెద్దగా నాయకులు వెళ్లలేదు. దాంతో చేరిక సభ కార్యక్రమంలో గువ్వల బాలరాజుతో బిజేపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు వంద మందికూడా రాలేదని సభా సాక్షిగానే నవ్వుతూనే ఎద్దేవా చేశారు. పైగా వంద మంది జాయిన్‌ అయినప్పుడు అసలైన సభ్యత్వం ఇస్తామనే అర్దం వచ్చేలా చిన్న చెనుకు వదిలారు. కాని అది ఒక నాయకుడికి ఇబ్బందికరమే. ఇదిలా వుంటే బిఆర్‌ఎస్‌ నుంచి పెద్ద నాయకులు కారు దిగిపోతున్నారు. అదే సమయంలో జిల్లాలలో నాయకులతో సంబంధం లేకుండా పెద్దఎత్తున ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. అలా మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలలో ఇటీవల చాలా మంది చేరారు. సహజంగా ఒక నాయకుడు ఎటు వైపు వెళ్తే క్యాడర్‌ అటు వైపు వెళ్లడమే చూశాం. కాని కారు దిగుతున్న నేతలతో క్యాడర్‌ మేం రామని తెగేసి చెబుతున్నారు. మీరు వెళ్తే వెళ్లండి..మమ్మల్ని రమ్మకనండి అని ముఖం మీదే చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరడానికి కార్యకర్తలు ఒకింత భయపడుతున్నారు. కాంగ్రెస్‌లో కొత్తవారిని కలుపుకుపోయే వాతారణం కనిపించడం లేదు. పార్టీ మారినా పనులు వస్తాయన్న నమ్మకం లేదు. పదవులు వస్తాయన్న ఆలోచన వారిలో అసలే లేదు. ఎందుకంటే పదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీకి అండగా వుంటూ, సేవలు చేసిన నాయకులు, కార్యకర్తలను కాదని కొత్త వారికి పెద్ద పీట వస్తుందన్న విశ్వాసం కలగడం లేదు. పైగా చేరిన ఎమ్మెల్యేల పరిస్దితే అలా వుంటే, చేరితే మా పరిస్దితి అంత కన్నా భిన్నంగా వుంటుందా? అన్న ఆలోచనలో బిఆర్‌ఎస్‌ క్యాడర్‌ గులాబీ జెండాను వదలడం లేదు. పైగా కాంగ్రెస్‌, బిజేపిల నుంచి వస్తున్న వారిని వద్దని వారించడం లేదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు చేరే నాయకులు ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడాల్సిందే. కొంత కాలం గడిస్తే అందరూ కలిసిపోతారు. పోటీ పడి పనులు చేస్తారు. పార్టీకి మరింత బలమౌతారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిఆర్‌ఎస్‌ క్యాడర్‌ కూడా నిరుత్సాహం, అసంతృప్తిగానే వున్నారు. కాని కారు దిగడానికి, జారుకోవడానికి సిద్దంగా లేరు. కాంగ్రెస్‌లో పొసగలేరు. బిజేపిలో చేరినా గుర్తింపు, ప్రజల్లో ఆదరణ వుంటుందన్న నమ్మకం అసలే లేదు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఒక్క బిఆర్‌ఎస్‌ క్యాడరే మరో కండువా కప్పుకోవడానికి సిద్దంగా లేరు. ఇది మాత్రం నిజం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version