చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T135254.537.wav?_=1

 

చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు.

42 శాతం బిసి రిజర్వేషన్లను అమలు చేయాలి

రాష్ట్రవ్యాప్త బిసి బంద్ లో పాల్గొన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు

దుగ్గొండి,నేటిధాత్రి:*

ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోలేని అధికారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టగా ఆ రిజర్వేషన్ పట్ల సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్ ఆరోపించారు. బీసీ బందు కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామం ప్రధాన రహదారిపై ముదిరాజ్ మహాసభ దుగ్గొండి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మొగిలి మాట్లాడుతూ విద్య ఉద్యోగాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లు మంచిదే కానీ.. అది అమలు కాకపోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల అమలు కోసం వివిధ బిసి కుల సంఘాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ బీసీ వర్గాలకు ఇలాంటి రిజర్వేషన్ల ప్రకారం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుండి కేంద్రంలో ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు బిసి రిజర్వేషన్ల పట్ల ఆలోచించాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి కోరారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్,దుగ్గొండి మండలం అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, సార రాములు ముదిరాజ్, బీసీ జాక్ కన్వీనర్ బండారి ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ నేదురి రాజేందర్ ముదిరాజ్, వరంగంటి తిరుపతి, నీరటి మురళి, ఒరంగంటి కుమారస్వామి, గొర్రె శీను, దండు రాజు, మేక అనిల్, జెట్టబోయిన రాజు, తెప్ప శంకర్, పొన్నం వంశీ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T132744.714.wav?_=2

 

టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో, 42% బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్న బీసీల మరియు తెలంగాణ ద్రోహి అయిన మాధవరెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి పందాలు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలకు పైబడిన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. బీసీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి నామమాత్రంగా జీవో ని రిలీజ్ చేసి మళ్లీ వాళ్ల వర్గానికి సంబంధించిన వ్యక్తి హైకోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గాని రేవంత్ రెడ్డి కి గాని ఎంత చతుర శుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండగ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆదిల్, మెహిన్ పటేల్, మహమ్మద్ ఆసీస్, షోహెద్, మహమ్మద్ ఒకే, ఇక్రమ్, మహమ్మద్ మోసిన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ముజ్జు, మహమ్మద్ కుతుబుద్ధిన్, మహమ్మద్ రిజ్వాన్, విజయ లక్ష్మీ, బిస్మిల్లా, అంజమ్మ, స్వీటీ, అంజన్న, కళావతి, రజిత. తదితరులు పాల్గొన్నారు

కదలని ఆర్టీసీ బస్సు చక్రాలు….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T125554.238.wav?_=3

 

కదలని ఆర్టీసీ బస్సు చక్రాలు

బీసీ బంద్ లో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

బీసీ రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం నేపథ్యంలో నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు చక్రాలు కదల్లేదు. ఉద్యోగులు, కార్మికులతో బంద్ లో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ఉదయం 3 గంటల నుండి ఆర్టీసీ కార్మికులు బంద్ లో పాల్గొని విజయవంతం క్టారు.
దీంతో ఆర్టీసీ బస్సుల చక్రాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.నర్సంపేట డిపో బీసీ సంఘం అద్యక్షులు కందికొండ మోహన్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం నర్సంపేట నర్సంపేట ఆర్టీసీ డిపో ఉద్యోగులు, కార్మికులందరు మద్దతిచ్చామన్నారు. జిల్ల వర్కింగ్ ప్రజిడేంట్ వేములు రవి ,నాయకులు బి. రమేష్ ఎన్.ప్రవీణ్, మాదవ్ రేడ్య, కిరణ్ కుమార్ గౌడ్ ,సాంబయ్య మహేందర్, యాదయ్య, అనిల్, రాజు,శ్రీను,రవి, బాస్కర్, కిషన్, గోవర్దన్, కె యస్ రావు, ప్రబాకర్, డిపి లీల, శ్రీలత, రమణ, సరిత, శ్రీలత తదితర కార్మికులు స్వచ్చందంగా పాల్గొన్నారు.

డెక్కన్ హోటల్ ప్రారంభించిన మాజీ చైర్మన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T123041.640.wav?_=4

 

డెక్కన్ హోటల్ ప్రారంభించిన మాజీ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండల పరిధిలోని కవేలి గ్రామ శివారులో గల నూతన డెక్కన్ హోటల్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ తన్విర్ హాజరై రిబ్బన్ కతరించి హోటల్ ను ప్రారంభించారు. మాజీ చైర్మన్ మాట్లాడుతూ తక్కువ ధరకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించుకోవాలని కోరారు హోటల్ యాజమాన్యం మాజీ చైర్మన్ గారికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కే ప్రసాద్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మహమ్మద్ వాసిమ్, మీర్ ముజఫర్ అలీ, మహమ్మద్ హామీద్ తదితరులు పాల్గొన్నారు

ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T121752.081.wav?_=5

 

ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం

నేటిధాత్రి, ఏనుమాముల

 

ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం తీవ్రరూపం దాల్చింది. తమ స్థలానికి గోడ కట్టగా, దానిని కొంతమంది అన్యాయంగా కూల్చివేశారని భూ యజమాని చంద్రకళ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఏనుమాముల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, అధికారులు పట్టించుకోకుండా, దౌర్జన్యం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. తోట చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్ 189/బి మణికంఠ కాలనీ రోడ్డు 4లో తాము 2008 వ సంవత్సరంలో శ్రీనివాస్ వద్ద కొనుగోలు చేశామని, ఇట్టి జాగపై వేరే వ్యక్తులతో తగాదా ఏర్పడటం వలన 2011వ సంవత్సరంలో కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు.. కోర్టు తీర్పు 2018 లో తమకు అనుకూలంగా వచ్చిందని, వెంటనే చుట్టూ ప్రహరీ గోడ కట్టుకున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళు జాగా మీధకు రాగా, అప్పుడు ఉన్న సిఐ రాఘవేంద్రరావు ఇరువురి సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఆ భూమి తమదేనని నిర్ధారించినట్లు చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుతం కొందరు భూ ఆక్రమణదారులు, ఓడిపోయిన వారి వద్ద నుండి అగ్రిమెంట్ పెట్టుకొని పది రోజుల క్రితం మా గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు అని అన్నారు. ఈ నెల 7వ తేదీన గోడను కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలని ఏనుమాముల పోలీసు స్టేషన్ లో పిటిషన్ ఇచ్చిన కూడా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాదితులు ఈ వివాదంపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

“బీసీరిజర్వేషన్”..”బిచ్చం కాదు”.. “బీసీల హక్కు”…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T115054.857.wav?_=6

 

“బీసీరిజర్వేషన్”..”బిచ్చం కాదు”.. “బీసీల హక్కు”.

సగర సంగం రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి “కానిగంటి శ్రీనివాస్”.

“నేటిధాత్రి”, హుజూరాబాద్.

 

ఈరోజు రాష్ట్రవ్యాప్త “బీసీ బంద్” లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల్ సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో హుజరాబాద్ లో “బీసీ బంద్” లో తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కాని గంటి శ్రీనివాస్.

 

హుజురాబాద్ అధ్యక్షులు యంజాల వాసు. చింత చంద్రయ్య. రాచమల్ల రఘు. దొరికిన చంద్రమౌళి. కొల్లూరి మధు. భాస్కర్. అనిశెట్టి శివ. సతీష్. కొల్లూరి అనిల్. అనిశెట్టి పరమేశ్వర్ సదరు బంధువులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ హుజురాబాద్ లో ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ పోరాటం

బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఐక్య పోరాటం

ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అన్నారు.బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చే వరకు ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ నెల 18న జరగనున్న బీసీజాక్ రాష్ట్ర బంద్‌కు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని రాష్ట్రంలో బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.42శాతం రిజర్వేషన్ల పరిరక్షణ అనేది కేవలం బీసీల సమస్య కాదని ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన పోరాటమని రాజ్యాంగ పరిరక్షణ కోసం,సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రతి వర్గం ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని,రిజర్వేషన్లను కాపాడుకోవడానికి చట్టపరమైన,న్యాయపరమైన వ్యూహంతో పాటు సమాజ ఐక్యత అత్యంత అవసరమని అన్నారు.ప్రభుత్వం బీసీ వర్గాల రిజర్వేషన్ల విషయంలో సరైన న్యాయపరమైన వ్యూహం సిద్ధం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్టికల్ 243ఏ ప్రకారం సరైన జనాభా లెక్కలు,సామాజిక ఆర్థిక అధ్యయనం ఆధారంగా చట్టబద్ధంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని పేర్కొన్నారు.బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు సామాజిక న్యాయానికి విరుద్ధమని
ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడం మనందరి బాధ్యత అని అన్నారు.

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం…

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం

జైబీసీ జైజై బీసీ

బీసీల ఐక్యత వర్ధిల్లాలి

శాయంపేట నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈనెల 18న శనివారం రోజున రాష్ట్ర (జిల్లా) బంద్ ను విజయవంతం చేయాలని బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి బందును పరిపూర్ణంగా సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ ,గ్రామ కమిటీ, మండల యువజన, సంఘం, మహిళా సంఘం అందరూ పాల్గొని విజయవంతం చేసి బీసీల లందరూ సత్తాచాటాలి.

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు చంద్రగిరి శంకర్…

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు చంద్రగిరి శంకర్

ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కు ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక విమలక్క ,రైతు కూలీ సంఘం (ఆర్ సి ఎస్), ఏఐఎఫ్టియు లు
సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా
ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ…
గడిచిన డెబ్బై ఎనిమిదేండ్ల భారత దేశ స్వాతంత్రంలో శోషిత జనసమూహానికి ఏమీ న్యాయం జరకపోగా ఇంకా పీడితులుగా మిగిలిపోయారనీ,కేంద్రంలోని భాజపా సర్కారు మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటూనే వస్తుందనీ,పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య అంతరాలను సృష్టిస్తూనే ఉన్నారనీ,దేశంలో భాజపా సర్కారు ఇప్పటికీ కుల గణన జరపకుండా న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్లను బీసీ,ఎస్ సి,ఎస్ స్టీ, మైనార్టీలకు అందకుండా చేస్తున్నదనీ,భాజపా సర్కారు కూలాల మధ్య చిచ్చుపెట్టడానికి ఈ డబ్లూ ఎస్ రిజర్వేషన్ అమలు చేసి బీసీలకు అన్యాయం చేసిందనీ,
ఏ పార్లమెంటరీ రాజకీయ పార్టీలైన గడిచిన డెబ్బై ఏళ్లుగా ఎన్నికల తంతులో ఇచ్చిన బూటకపు హామీలు ప్రజలని మభ్యపెట్టడానికేనని,అయితే తెలంగాణ రాష్ట్రంలో 2023 లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ లకు ఇచ్చిన హామీలో భాగంగా 42శాతం రిజర్వేషన్ లను ప్రవేశపెట్టిందనీ,దీని కోసం జీఓ 9 తీసుకొచ్చిందనీ,కేంద్రానికి ఆర్డినెన్సు కూడా పంపిందనీ,భాజపా సర్కారు ఫాసిస్టు పాలనలో బీసీలను అణచడం కోసం బీసీ ఆర్డినెన్సును అడ్డుకుందనీ,
తక్షణమే బీసీ ల 42 శాతం బిల్లును షెడ్యూల్డ్ 9 లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని, ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేస్తుందనీ,ఈ నెల 18 న జరిగే బంద్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చంద్రగిరి శంకర్ తెలిపారు.

బీసీ బందుకు మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి

బీసీ బందును విజయవంతం చేయాలి రవి పటేల్

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

టి ఆర్పి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలో టి ఆర్పి పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ
తెలంగాణలో ఉన్న 65% మంది బీసీ ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యాంగబద్ధంగా మనం హక్కులు సాధించుకోవాలంటే ప్రజా పోరాటాలే ప్రామాణికంగా ఉంటాయి కనుక స్వాతంత్రోద్యమం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు బీసీ ఉద్యమం ఇందులో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులు విద్యాసంస్థలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అందరు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గండు కర్ణాకర్ సామర చంద్రశేఖర్ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు

సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోళ్లలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆరోపించారు.పత్తి రైతుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని పండించి పత్తికి కనీసం మద్దతు ధర పలకపోవడంపోవడంతో రైతు నష్టపోతున్నారని వెంటనే సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.క్వింటాల్ 10. వేల రూచొప్పున ధర అమలు చేయాలని కోరారు.పత్తి వ్యాపారస్తులు ధరలు తగ్గించి రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పత్తి దిగుబడులు చాలా తగ్గాయని వరంగల్ మార్కెట్లో 7000 ధర నిర్ణయించి తేమ పేరుతో పేరుతో 6000 కూడా కొనడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రైతులు పత్తి విత్తనాలు ఎరువులు,పురుగు మందులు వ్యవసాయ కూలీ ధరలు అన్ని పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని తట్టుకొని మార్కెట్కు పత్తి తీసుకుంటే తీసుకుని వస్తే రైతులకు సరైన ధర లభించడం లేదని రైతులకు అండగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం 7700 ధర ప్రకటించినప్పటికీ వ్యాపారస్తులు అమలు చేయడంలేదని ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాసరెడ్డి,కోడం రమేష్, కొంగర నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు…

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు

కేంద్రంపై ఒత్తిడి చేద్దాం
రిజర్వేషన్లు సాధించుకుందాం
కదలిరండి బీసీ బిడ్డలారా

కేసముద్రం/ నేటి దాత్రి

 

వాపక్ష నేతల యం పాపరావు,చొప్పరి శేఖర్,ఆవుల కట్టయ్య,శివారపు శ్రీధర్, పిలుపునిచ్చారు.
శుక్రవారం సి పి ఎం మండల కార్యాలయం లో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఎం సిపిఐయు ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు మాట్లాడుతూ రేపటి బందులో బీసీ బిడ్డలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు, కేంద్ర బిజెపి పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు సాధించినామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు మోడీ వద్దకు వెళ్లే ధైర్యం లేక బీసీలను మోసం చేస్తున్నారన్నారు, రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం చేసి పంపిన ఆర్టికల్ 9 లో పెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలన్నారు.రేపు జరిగే బందులో బీసీ బిడ్డలంతా ముక్తకంఠంతో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కేసముద్రం మండల కేంద్రంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
జిల్లావ్యాప్తంగా వామపక్ష పార్టీలు బీసీ సంఘాలను కలుపుకొని రేపటి బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ల గుడిశాల వెంకన్న, చాగంటి కిషన్,నేతలు తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగబోయే 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయ బీసీ టీచర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బీసీ టీచర్స్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగయ్య జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ శేషు,డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ రాధిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మల్లేష్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మద్దతు తెలిపిన జహీరాబాద్ బిసి జేఏసీ….

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మద్దతు తెలిపిన జహీరాబాద్ బిసి జేఏసీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ : భవాని మందిర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు స్వచ్ఛంద బంద్ కు బీసీ బంధువులు మరియు అన్ని పార్టీల బీసీ కార్యకర్తలు తమ తమ మద్దతు తెలుపాలని మనం బీసీలు అందరం ఏకతాటికి రావాలని మనకు జరిగినా అన్యాయాన్ని ఈ బంద్ ధార తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జహీరాబాద్ బీసీ జేఏసీ నెంబర్లు కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాలు మరియు బిఆర్ఎస్ పార్టీ బీసీ సోదరులు మరియు బిజెపి పార్టీ బీసీ సోదరులు జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జహీరాబాద్ నియోజకవర్గం అన్ని మండలాల నుండి బీసీ బందులు. ఈరోజు అతిధి హోటల్లో బీసీ తాలుక జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం కావడం జరిగింది
రేపు జరగబోయే బంద్ కు తమ తమ మద్దతు తెలుపుతున్నామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ ,, కోహిర్ మండల్ మాజీ జెడ్పిటిసి , నర్సింలు,, కొండాపురం నరసింహులు, విశ్వనాథ్ యాదవ్ బిజెపి, తట్టు నారాయణ , బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు వెంకటేశం బిఆర్ఎస్ జర సంఘం మండల్ మొహమ్మద్ఇమ్రాన్, బీసీ మైనార్టీ, సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు, శంకర్ సాగర్ బి సి,,. జగన్ బిజెపి,మాదినం శివప్రసాద్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదిపర్లు పాల్గొనడం జరిగింది

నల్లజెండాలతో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T144137.950.wav?_=7

 

*నల్లజెండాలతో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన **
*సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడిని ఖండిస్తున్నాం

*ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ

*మహాదేవపూర్ అక్టోబర్ 17 నేటి ధాత్రి **

 

మహదేవపూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టుపై ప్రధాన న్యాయమూర్తి సిజెఐ గవాయి పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని దాడి వెనుక ఉండి ప్రోత్సహించిన వారిని తక్షణమే అరెస్టు చేసి చట్టబద్ధంగా శిక్షించాలని అదే కాకుండా ప్రధానంగా దళితులపై దాడులను ఖండిస్తున్నామని ఇలాంటి దాడులు సమాజంలో తప్పుడు సంకేతాలకు దారితీస్తాయని ఇప్పటికైనా అధికారులు దళితులపై దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ అన్నారు ఈ కార్యక్రమంలో వి ఎస్ పి ఎస్ మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కోయ్యల భాస్కర్ . టౌన్ ప్రెసిడెంట్ చింతకుంట్ల సదానందం .టౌన్ ఉపాధ్యక్షులు కొలుగురి శ్రీకాంత్ .టౌన్ ప్రధాన కార్యదర్శి లింగాల సుశాంత్. బ్రాహ్మణపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కాల్వ రాజ సమ్మయ్య .పలుగుల గ్రామ శాఖ అధ్యక్షులు లేతకరి శంకర్ .ఉపాధ్యక్షులు మంద సురేష్ .ఎమ్మార్పీఎస్ నాయకులు చింతకుంట రాము .బెల్లంపల్లి జాషువా. సీనియర్ నాయకులు వేమునూరు జక్కయ్య తదితరులు పాల్గొన్నారు

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T142924.753.wav?_=8

 

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ రిజర్వేషన్లకు ప్రధాన అవరోధం బీజేపీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకునే రాజకీయ పార్టీని అందరూ గుర్తించాలని సీపీఐ(ఎం) భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు. ఈ రిజర్వేషన్లకు ప్రధాన అవరోధం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ జరగాలన్నారు. బీజేపీ ఉన్న వేదికల్లో తాము పాల్గనేది లేదని స్పష్టం చేశారు. తాము స్వతంత్రంగా ఉద్యమాలను చేపడతామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అఖిలపక్షం సహకారంతో ఢల్లీి కేంద్రంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు , పోలేం రాజేందర్, గుర్రం దేవేందర్, ఆకుదారి రమేష్, గడప శేఖర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు..

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు

టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు.

 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు. ఈ మేరకు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ మధుర నగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి పిర్యాదు మేరకు 336(4), 353(1)(C) BNS సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఅర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్‌లో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఫేక్ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నాల ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేసి కేటుగాళ్లు ప్రచారం చేశారు. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేశారు. ఈ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాలూకా వీరశైవ లింగాయత్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్…

తాలూకా వీరశైవ లింగాయత్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,నియోజకవర్గం వీర శైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక బసవేశ్వర ఫంక్షన్ హాల్ లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్ష కార్యవర్గం, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణా కౌలాస్, కార్యదర్శి పద్మజ, స్థానిక లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో జిల్లా నుండి అధ్యక్షులు ఇప్పేపల్లి నరసింహు లు, ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధి కారి పోలీస్ సంతోష్ పటేల్, యువజన ప్రధాన కార్యదర్శి రామోజీ నవీన్, స్థానిక లింగాయత్ సమాజ్ అధ్యక్షులు రాజశేఖర్ శెట్కర్, ప్రధాన కార్యదర్శి ఆర్ సుభాష్ సమక్షంలో జరిగిన ఎన్నికలలో జహీరాబాద్ నియోజకవర్గం మండలాల వారీగా కూడా ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గ వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోహీర్ మండలం నుండి బిల్లాపాటి విజయకుమార్, మండల అధ్యక్షునిగా ఎన్నుకోగా మొగడంపల్లి మండల అధ్యక్షులుగా ఎం రా%శీ% శెట్టి, ప్రధాన కార్యదర్శిగా ఎల్ విజయ్ కుమార్ ఝరా సంగం మండల అధ్యక్షునిగా పట్లోళ్ల రవి పటేల్, ప్రధాన కార్యదర్శిగా పొట్లోళ్ల పరమేశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన కార్యవర్గానికి అధ్యక్షులు త్వరలో ప్రకటిస్తారని సమావేశం ప్రకటించింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆగూర్ శివరాజ్ మాట్లాడుతూ తనమీద ఉన్న నమ్మకంతో జిల్లా, స్థానిక అధ్యక్ష కార్యవర్గానికి, మండల సభ్యులందరికీ తన ధన్యవాదాలు తెలిపారు.

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షులుగా పొదిల సురేష్

#నెక్కొండ, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నెక్కొండ మండల కేంద్రంలోని చంద్రుగొండ, బంజరపల్లి, మూడు తండా, గొల్లపల్లి, వాగ్య నాయక్ తండ, లకు సంబంధించి ఆటో యూనియన్ ఏర్పరచుకొని 30 సంవత్సరాలుగా అవుతున్న తరుణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఆటో యూనియన్ ఎన్నికలను నెక్కొండ నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలలో చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ ని, కార్యదర్శిగా చిలువేరు కొమ్మాలను, కోశాధికారి జితేందర్ , కమిటీ మెంబర్ గా కాజా పాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడు పొదిల సురేష్ తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా నెక్కొండ నవత యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

తంగళ్ళపల్లిలో గర్భిణీ స్త్రీలకు పోషక ఆహార అవగాహన

పోషక ఆహారాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

Vaibhavalaxmi Shopping Mall

తంగళ్ళపల్లి మండలంలో. పోషణ మాసం కార్యక్రమం పురస్కరించుకొని. సరైన పోషణ ఆహారంతో. ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా. తీర్చిదిద్దాలని నినాదంతో.C.D.P.O. ఉమారాణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు 0….6. పిల్ల తల్లులకు. పోషణ ఆహారంపై. అవగాహన చేస్తూ. ఉమారాణి మాట్లాడుతూ ఆరోగ్యం మనది కొనుక్కునేది కాదు అని. సంపాదించుకునేదని. ఆరోగ్యం అనేది అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారమని. పోషకరమైన ఆహారాలు తీసుకున్నప్పుడు. ఆరోగ్యం బాగుంటుందని. అంగన్వాడి కేంద్రం నుంచి వచ్చే. ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని. అలాగే ఫ్రీ స్కూల్ లోకి అంగన్వాడి కేంద్రాలకు పిల్లలను పంపించాలని. ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను. అందిస్తారని. వీటిని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో.C.D.P.O. ఉమారాణి. సూపర్వైజర్ అంజలి. అంగన్వాడీ టీచర్స్.B. సత్యవతి. P. శోభ.R. లతా. G. పుష్పలత.N. పద్మ.S. శారదా. గర్భిణీలు స్త్రీలు బాలింతలు.పిల్లలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version