విద్యుత్ కార్మికుల సమస్య ను వెంటనే పరిష్కరించాలి…

విద్యుత్ కార్మికుల సమస్య ను వెంటనే పరిష్కరించాలి

పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్. బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్

హన్మకొండ :నేటిధాత్రి

తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ ) ఆధ్వర్యంలో గత 6 రోజులుగా కొనసాగుతున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మెకు బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ పూర్తి మద్దతూ తెలియజేస్తున్నరు.
కాంట్రాక్టు విద్యుత్ కార్మికుల సమస్యలు. నాటి బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ కాంట్రాక్టు కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నాయి. ప్రమాదకరమైన విధులు నిర్వర్తిస్తున్నా వారికి ఉద్యోగ భద్రత లేదు. ఎలాంటి హామీలు లేవు. ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు పాదయాత్ర సమయంలో అధికారంలోకి వస్తే విద్యుత్ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తామని మీడియా సాక్షిగా హామీ ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించి తుంగలో తొక్కుతున్నారు. సచివాలయల ముందు విగ్రహాలు, ఫుట్‌బాల్ టోర్నీల పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాణాలను పణంగా పెట్టి 24 గంటలు ప్రజలకు సేవ చేస్తున్న విద్యుత్ కార్మికులకు మాత్రం న్యాయం చేయడం లేదు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడం, సమాన పనికి సమాన వేతనం, ప్రమాద బీమా, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం, కార్మిక చట్టాలు అమలు చేయడం.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కార్మికుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటుంటే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేమే చేశాం అని గొప్పలు చెప్పుకుంటూ కార్మికులను మోసం చేస్తోంది.
కావున, విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి డిమాండ్ చేస్తోంది. కార్మికుల పోరాటానికి బిజెపి అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాం.

విద్యుత్ ఆర్టిజన్, ఆన్‌మ్యాన్ కార్మికుల ధర్నా…

విద్యుత్ ఆర్టిజన్, ఆన్‌మ్యాన్ కార్మికుల ధర్నా

విద్యుత్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్టిజన్, ఆన్‌మ్యాన్ కార్మికుల ధర్నా కార్యక్రమం ఉధృతంగా కొనసాగింది ఈ కార్యక్రమం టీవీఏఈ జేఏసీ చైర్మన్ నాగుల తిరుపతిరెడ్డి, కన్వీనర్ తిప్పరపు రాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు డివిజన్ల నుండి సుమారు 80 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ కన్వీనర్ యల్లా సురేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా యల్లా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ సంస్థలో ఒకే విధమైన సర్వీస్ రూల్స్ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టిజన్ కార్మికులకు ఒక విధంగా, ఓ ఎండమ్ ఉద్యోగులకు ఏపీఎస్పీ సర్వీసెస్ ఇస్తున్నారు ఆన్‌మ్యాన్ కార్మికులకు ఆర్టిజన్ గా గుర్తించాలని ఒకే సంస్థలో ఒకే విధంగా సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ విద్యుత్ సంస్థల్లో రెండు సర్వీస్ రూల్స్ విధానం కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్హతల ఆధారంగా అందరు ఆర్టిజన్ కార్మికులను ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ ప్రకారం కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఉన్న రెండు విద్యుత్ డిస్కమ్‌లలో ఎస్పీడీసీఎల్‌లో ఆన్‌మ్యాన్ కార్మికులను ఇప్పటికే ఆర్టిజన్‌గా గుర్తించగా, ఎన్పీడీసీఎల్‌లో గుర్తించకపోవడం అన్యాయమని తెలిపారు. ఎస్పీడీసీఎల్ తరహాలోనే ఎన్పీడీసీఎల్‌లో కూడా ఆన్‌మ్యాన్ కార్మికులను ఆర్థికంగా గుర్తించాలని ప్రభుత్వం, యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఎప్పుడైనా సమ్మెకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
జిల్లా చైర్మన్ నాగుల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు. విద్యార్హతల ఆధారంగా ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ తక్షణమే కన్వర్షన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.
జిల్లా కన్వీనర్ తిప్పరపు రాజు మాట్లాడుతూ, ఎన్పీడీసీఎల్ పరిధిలో సుమారు 1600 మంది ఆన్‌మ్యాన్ కార్మికులు అన్యాయ పరిస్థితుల్లో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీడీసీఎల్‌లో అమలు చేస్తున్న విధానాన్ని అనుసరించి, ఎన్పీడీసీఎల్‌లో కూడా ఆన్‌మ్యాన్ కార్మికులను ఆర్టిజన్‌గా గుర్తించాలని కోరారు. అదేవిధంగా మీటర్ రీడర్స్, పీస్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే, రెండో తేదీన సర్కిల్ ఆఫీస్ వద్ద ధర్నాతో పాటు వంట-వార్పు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఏడో తేదీన ఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించి, ఎనిమిదో తేదీ నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు కఠిన హెచ్చరిక జారీ చేశారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని నాయకులు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో ఆర్టిజన్, ఆన్‌మ్యాన్ కార్మికులు భారీగా పాల్గొన్నారు.

రీజినల్ అధ్యక్షుడిగా లింగంపల్లి రాజేశ్వరరావు…

రీజినల్ అధ్యక్షుడిగా లింగంపల్లి రాజేశ్వరరావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం- హెచ్ 58 రీజినల్ కమిటీ నూతన కార్యవర్గాన్ని యూనియన్ వ్యవస్థాపకులు, గౌరవ అధ్యక్షులు కోడూరి ప్రకాష్ జెన్ కో అధ్యక్షులు ఎలకంటి రగోత్తం గార్ల ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటుచేసి ఎన్నుకోవడం జరిగింది.
2026-2027 సంవత్సరానికి క్రింద పేర్కొన్న విధంగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాబితా
రిజినల్ అధ్యక్షుడి
లింగంపెల్లి రాజేశ్వర్ రావు
కార్యనిర్వహక అధ్యక్షులు
మామిండ్ల నాగరాజు
ప్రాంతీయ కార్యదర్శి
సూర నరేందర్ ఉపాధ్యక్షులు
అదనపు కార్యదర్శి
సహాయ కార్యదర్శులు
జాయింట్ సెక్రటరీలు
ఆర్గనైజింగ్ సెక్రటరీలు
ప్రచార కార్యదర్శులు
రిజినల్ కోశాధికారి
నడిపెల్లి మాధవరావు
కార్యవర్గ సభ్యులు
లు ఎన్నికయ్యారు
ఈ కార్యక్రమంలో జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టపాక కిరణ్ ఉపాధ్యక్షులు బుర్ర కుమారస్వామి, జెన్ కో వర్కింగ్ ప్రెసిడెంట్ కె. కాంతయ్య, సహాయ కార్యదర్శి . శ్రీనివాస్ తోట మల్లిక్, లక్కం విజేందర్, తాల్ల శ్రీను తీగల తిరుపతి రావు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం నూతనంగా ఎన్నికైన రీజనల్ బాడీ సభ్యులను ఇంచార్జి చీఫ్ ఇంజనీర్ కి అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లకు, విజిలెన్స్ అండ్ ఫాక్టరీ మేనేజర్ లకు పరిచయం చేయడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version