ఆనంద్ కుమార్ తల్లోజు ఆచారికి క్షమాపణ చెప్పాలి.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-11T170554.426.wav?_=1

ఆనంద్ కుమార్ తల్లోజు ఆచారికి క్షమాపణ చెప్పాలి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 ఆధ్వర్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆఫీసు కల్వకుర్తిలో ప్రెస్ మీట్ నిర్వహించారు ముందుగా కార్యక్రమంలో మొగలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ…ఈనెల ఆరో తారీఖున కల్వకుర్తి పట్టణంలో జరిగిన బిజెపి ధర్నా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ మాజీ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీల హామీని ప్రజల సాక్షిగా నిలదీయడంతో రాబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందని భయాందోళనలకు గురై కంగుతిన్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ కుమార్ 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా ఒకే అజెండాతో పని చేస్తున్న,ఉద్యమనేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పోరాటాల సూర్యుడు, తల్లోజు ఆచారిని ఆరుసార్లు ఓడిపోయావని బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేసి లోన్లు తేలేదని కించపరుస్తూ తిట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం…ఆచారి ఆరుసార్లు ఓడిపోయాడని అంటున్న నువ్వు ఒక్కసారి వెనుక తిరిగి నీ వీపు నువ్వు చూసుకో…
మొదటిసారి కాటన్ మిల్ ఎలక్షన్లలో చిత్తరంజన్ దాసు గారి కాళ్లు పట్టుకొని గెలిచావు గుర్తులేదా…?ఇప్పటికీ 9 సార్లు ఓడిపోయిన నువ్వు నీ చరిత్ర ఏందో నువ్వు తెలుసుకో…
కౌన్సిలర్ గా ఓటమి…
ఎంపీటీసీ గా ఓటమి…
సర్పంచ్ గా ఓటమి…
కాటన్ మిల్లు ఓటమి…
100 నుంచి 1000 ఓట్ల ఎలక్షన్లలో ఓడిపోయిన నువ్వు ఆచారి గారిని అనే అంత గొప్పోడివా…?
మొదటి ఎలక్షన్లలో 8500 ఓట్లు
రెండవ ఎలక్షన్లలో 52 వేల ఓట్లు
మూడవ ఎలక్షన్లలో 29 వేల ఓట్లు
నాల్గవ ఎలక్షన్లలో 42 వేల ఓట్లు
ఐదవ ఎలక్షన్లలో 60 వేల ఓట్లు
ఆరోసారి ఎలక్షన్లలో 70 వేల ఓట్లు కల్వకుర్తి ప్రజల చేత మన్నన పొంది కల్వకుర్తి ప్రజల ప్రేమాభిమానాలు ఆస్తులుగా సంపాదించిన
తల్లోజు ఆచారీని కించపరుస్తావా…?బిజెపి నుండి కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ నుండి టిడిపిలోకి టిడిపి నుండి స్వతంత్ర అభ్యర్థి వైపు అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ వైపు ఇప్పుడు టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వైపు ఇప్పుడు చెప్పండి ఇంకా ఏ పార్టీ మిగిలింది మీకు..?6సార్లు పార్టీలు మారిన నీచరిత్రను తిరిగేస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది కాదా…?
నునుగు మీసాల వయసు నుంచి 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా
ఒకే అజెండా ఒకే పార్టీలో పనిచేస్తూ ఎన్ని గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినా కలలో కూడా పార్టీ మారే ఆలోచన చేయకుండా నిరంతరం కల్వకుర్తి ప్రజల గురించి తప్పా తన వ్యక్తిగత జీవితం కూడా మరచి కల్వకుర్తి ప్రజల కోసం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు తల్లోజు ఆచారిని అవమానిస్తావా…?
తల్లోజు ఆచారి బీసీ కమిషన్ ద్వారా ఏం న్యాయం చేశాడని ప్రశ్నించిన ఆనంద్ కుమార్ అసలు బీసీ కమిషన్ అంటే ఏంటో తెలుసా…? ఒక ఉన్నత విద్యావంతుడిని అని చెప్పుకుంటావు కదా..?
బీసీ కమిషన్ కు నిధులు ఉండవన్న సంగతి నీకు తెలియదా…?
బీసీ కమిషన్ అనేది కేవలం బీసీలకు న్యాయం చేయడానికి మాత్రమే ఏర్పడ్డ ఒక రాజ్యాంగ వ్యవస్థాని నీకు తెలియదా…?
ఆచారి గారు బీసీ కమిషన్ మెంబర్ అయిన తర్వాతనే ఈ దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, లా యూనివర్సిటీలో, ఎంబీబీఎస్ సీట్ల విషయంలో బీసీలకు 27% రిజర్వేషన్లు, అమలుపరిచారన్న సంగతి నీకు తెలియదా…?
బీసీ కమిషన్ ద్వారా దక్షిణ భారతదేశంలో ఎంతోమంది బీసీ ఉద్యోగులకు బీసీ ప్రజలకు న్యాయం చేశాడన్న సంగతి మరిచిపోయావా…?మాట్లాడితే బీసీ బిడ్డ అని చెప్పుకుంటావు కదా కల్వకుర్తి పట్టణంలో గత 30 ఏళ్ళ నీ రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరికి న్యాయం చేసావో..?ఏ ఒక్క బీసీని ఉద్ధరించావో చూపిస్తావా…?
ఒక్క బీసీ నైనా రాజకీయ నాయకుడిగా ఎదగనిచ్చావా…?ఖబర్దార్ ఆనంద్ కుమార్ నీ తప్పు తెలుసుకుని తల్లోజు ఆచారి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను…. అన్నారు.
తదనంతరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుర్రాల రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..పదవుల కోసం పార్టీలు మారే మీరు అలుపెరుగని పోరాటయోధులైన తల్లోజు ఆచారి గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదం…మొన్న ఆరో తారీకు జరిగిన ర్యాలీలో 100 మంది పాల్గొన్నారు.అనడం నీఅవివేకం ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది అర్హులైన లబ్ధిదారులను కించపరచడం మీఅహంకారానికి నిదర్శనం…మీకాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ 2000 పెంచను 4000 చేస్తాం అనలేదా…?వికలాంగుల పింఛన్ 4000 రూపాయలను 6000 రూ” చేస్తాం అనలేదా..?
ప్రతి మహిళకు నెల నెల
2500/-రూ ” ఇస్తాం అనలేదా..?
ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తాం అనలేదా..?
ప్రతి రైతుకు రెండులక్షల రూ రుణమాఫీ హామీ మీరు ఇచ్చింది కాదా..?ఎకరాకు ప్రతి సంవత్సరం 15000/- రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వలేదా…?మీరు ఇచ్చిన 6గ్యారంటీల దొంగ హామీల మీద మాట్లాడితే ఆచారిని తిడతారా..?
ఈ ప్రాంతంలో ఆచారి గారి ప్రజా ఉద్యమాలు గుర్తులేదా..?KLI.. కోసం ఆమనగల్ నుంచి కల్వకుర్తి మీదుగా ఎడ్లబండ్లతో పాలమూరు కలెక్టర్ ముట్టడి మరిచినావా…KLI.. పూర్తి కోసం సీఎం ఇల్లు ముట్టడి కోసం రైతులతో చలో హైదరాబాద్ పేరుతో ప్రభుత్వంతో చేసిన యుద్ధం గుర్తులేదా..?రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్తు కోసం 4రోజుల దీక్ష గుర్తులేదా…?
RDO.. కార్యాలయం కోసం ఏడు రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి సాధించింది మరిచిపోయావా..?కొట్ర నుండి కల్వకుర్తి మీదుగా తిరుపతి వరకు 1000 కోట్ల రోడ్డును మోడీ గారితో మాట్లాడి పట్టుబట్టి తీసుకొచ్చింది మర్చిపోయావా..?ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ జడ్చర్లకు తరలిస్తే అప్పటి ప్రభుత్వంతో యుద్ధం చేసి కల్వకుర్తికి తెచ్చింది గుర్తులేదా..? కల్వకుర్తి ప్రాంతంలో ఏది సాధించాలన్న ఉద్యమాలకు ఊపిరి పోసి తన ప్రాణాలను అడ్డుపెట్టి మరి సాధించే ఏకైక నాయకుడు తల్లోజు ఆచారి అని తెలుసు కదా..?కల్వకుర్తిలో 20 సీట్లు గెలుస్తామని గొప్పలు మాట్లాడిన నీవు గత ఎన్నికల్లో కౌన్సిలర్ ఎందుకు ఓడినావు..?కల్వకుర్తి పట్టణంలో గత ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ సాధించిన బిజెపి పార్టీ ఎదుగుదలను భరించలేకనే కుట్రతో మాట్లాడుతున్నావని మాకు అర్థమవుతుంది…2014-2016-2023 ఆచారికి కల్వకుర్తి పట్టణం లీడు వచ్చింది నిజం కాదా…?
నిజాలని గుర్తుంచుకొని మాట్లాడితే మీకే మంచిది ప్రశాంతమైన కల్వకుర్తిలో ఉద్దేశ పూర్వకంగా చిచ్చులు పెట్టాలని చూసే మీ
కుటిల రాజకీయం ఇకపై చెల్లదు మీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తల్లోజు ఆచారి కి క్షమాపణ చెప్పాలనిడిమాండ్ చేసారు…ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ సీనియర్ నాయకులు, సూర్య కృష్ణ గౌడ్,నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నరేడ్ల శేఖర్ రెడ్డి, బోడ నరసింహ, పాలకూర్ల రవి గౌడ్, సురేందర్ గౌడ్, గుండోజు గంగాధర్, నాప శివ,కొల్లూరు శ్రీధర్,తగుళ్ల వెంకటేష్ యాదవ్, లక్ష్మీ నరసింహ, సాయి,తోడేటి అరవింద్ రెడ్డి, వాకిటి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ పై బిజెపి చేసిన అనుచిత వాక్యాలు సరికాదు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23.wav?_=2

కేటీఆర్ పై బిజెపి చేసిన అనుచిత వాక్యాలు సరికాదు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ భవన్ లో
Ktr పై జిల్లా బీజేపీ నాయకులు చేసిన వాక్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన BRS సిరిసిల్ల పట్టణ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్…. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ రెండు కలసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. అధికారం లో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ని నీలాదీయడం మానేసి ప్రతి పక్షం లో ఉన్న KTR ని విమర్శించడం వారి విజ్ఞత కే వదిలి వేస్తున్నాం. Ktr సిరిసిల్ల నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రతి గ్రామం లో మేము చూపిస్తాం మీ నాయకుడు మంత్రి హోదా లో ఉన్న బండి సంజయ్ ఏమి చేసారో కనీసo ప్రతి మండలం లో అయినా చూపెట్టే దమ్ము మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం.బండి సంజయ్ తనకు తాను పెద్ద నాయకుడు అనే భ్రమలో ఉన్నాడు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే వ్యక్తి బండి సంజయ్ కాదు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే శక్తి కూడా కాదు అటువంటి నాయకుడి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ KTR లేదు అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఇంకెన్ని రోజులు దేవుడి పేరు చెప్పి ప్రజలను రెచ్చగొడతారు గల్లీ లో మాట్లాడడం కాదు ప్రజా సమస్యేలపై పార్లమెంట్ లో మాట్లాడాలని మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు పాస్ అని తప్పించుకొని పోకుండా పోరాటం చేయాలనీ బండి సంజయ్ కోరుతున్నాను. ktr సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి కి ఏంతగానో కృషి చేసారు మళ్ళీ అధికారం లో కి వచ్చాక మరింత ముందుకు తీసుకెళ్లే దమ్ము ktr కి ఉంది బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా కేంద్రం లో కేంద్ర పరిది లో ఉన్న ఒక ఫ్లై ఓవర్ దాదాపు 8 సంవత్సరము లుగా పనులు పూర్తి గాక అసంపూర్తి గా ఉండి అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది అది కూడా పూర్తి చేయని అసమర్ధత కలిగిన Mp మనకు ఉండటం మన దౌర్భాగ్యం కేంద్ర పరిది లో ప్రజలకు అవసరంమైన ఎన్నో అభివృద్ధి పనులు ఉంటాయి వాటిని తీసుకు రాకుండ మీ కుటుంబం వచ్చి గుడి లో ప్రమాణం చేస్తే మా కుటుంబం వచ్చి ప్రమాణం చేస్తుంది ఇవ్వా ఒక కాబినెట్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలు..అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం లో జిల్లా నాయకులు మెట్ట రాజు,కత్తెర వరుణ్ కుమార్, BRSV పట్టణ అధ్యక్షులు షేక్ సికిందర్, వడ్లురి సాయి, సూర్య, జోయేల్, వడ్లురి వేణు, ఆరుట్ల శరన్ పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆవిర్భావ లు.

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆవిర్భావ లు.

..తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. యూత్ ఆవిర్భావ. పండుగలను. యూత్ కాంగ్రెస్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో 65.వ. వేడుకలను. ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా. మాట్లాడుతూ. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు. జిల్లా ఇన్చార్జి తూముకుంట అంకక్ష రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ మరియు సీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1965.లో. ఇందిరాగాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. 1960వ. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని. ఇందిరా గాంధీ మరణం తర్వాత. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి. భారతదేశంలోని. యువత యువకులకు 18 సంవత్సరాల దాటిన తర్వాత ఓటు హక్కు కల్పించిన ఏకైక వ్యక్తిగా. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని. ఆయన హయాంలోనే. దేశానికి ఐటీ రంగాన్ని తీసుకువచ్చి. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి భారతదేశాన్ని ముందంజలో ఉంచాలని ఆయన. ఆశయమని. దానికి అనుగుణంగా కాంగ్రెస్ యూత్ పార్టీ పనిచేస్తుందని. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. రాష్ట్ర అధ్యక్షులు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ప్రవీణ్ తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి.మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో.నియోజకవర్గ ఇన్చార్జి యూత్ చుక్క శేఖర్. ఏం సి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. ముందటి తిరుపతి. బండి పరశురాములు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T152502.610.wav?_=3

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

జీవో 76 ప్రకారం ఇండ్ల పట్టాలను పక్కన పెట్టిన ప్రభుత్వం…

హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన గాలికి వదిలేసిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయం చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. మందమర్రి పట్టణంలో జయశంకర్ ఏడడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తరలి వెళుతున్నామని అందులో భాగంగానే రామకృష్ణాపూర్ పట్టణం నుండి ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చడంలేదని దుయ్యబట్టారు. సింగరేణి ప్రాంతంలో జీవో నెంబర్ 76 ప్రకారం వీళ్ళ పట్టాలు గత మా ప్రభుత్వంలో అందించడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు అందించడంలో విఫలమయ్యిందని అన్నారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లను కులుస్తుందని ధ్వజమెత్తారు.

Congress government

20 నెలల పరిపాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

మద్దూరు మండలం పిట్టల గూడెం సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి:

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T124755.909.wav?_=4

మద్దూరు మండలం పిట్టల గూడెం సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి:

బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్

మద్దూరు నేటి ధాత్రి

జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం లో ధర్మారం గ్రామం పిట్టల గూడెం లో బీజేపీ మండల అధ్యక్షులు ఉదయ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారం గ్రామ పిట్టల గూడెం లో కనీస వసతులు లేవని, ఉండడానికి ఇల్లు లేక గుడిసెల్లో జీవనం సాగిస్తుంటే పాము కాటుకు గురి కానీ కుంటుంబం అంటూ లేదు అని బాధపడ్డారు అలాగే మురుగు నీరు రోడ్లమీద ప్రవహిస్తుంటే ఈ కాలనీ వాసులు రోగాల పాలు అవుతున్నారని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మరుగు దొడ్లు మంజూరు చేపిస్తే ఈ కాలనీ వాసులకు ఇవ్వలేని దుస్థితి నెలకొనడం బాధాకరం అని వాపోయారు స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి, కాంగ్రెస్ ఇక్కడి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కంటికి కనబడడం లేదా అని మండిపడ్డారు. పిట్టల గూడెం ప్రజల సమస్యలను పరిష్కరించాలని లేని యెడల వారి వారికీ అండగా బీజేపీ పోరాడుతుందని హెచ్చరించారు.అదేవిదంగా పిట్టల గూడెం రోడ్డు అద్వానంగా తయారై నిత్యం ప్రమాదలకు గురై నానా అవస్థలు పడుతున్నారని వెంటనే తారు రోడ్ ను వేయాలని డిమాండ్ చేశారు.అనంతరం పిట్టల గూడెం వాసులతో కలిసి వారి గుడిసెలో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు కూరెళ్ల కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బియ్య రమేష్, నరదాసు సందీప్, బండి శ్రీహరి,వినయ్, సిరిమల్లె సురేష్, ఏలూరి శివ, రవి, బొల్లు రాజు, ప్రశాంత్, సాయి కిరణ్, సాయి బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-1.wav?_=5

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది

బిఆర్ఎస్ సేన రాష్ట్ర అధ్యక్షులు
వెంగని మనోహర్

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ సేన రాష్ట్ర అధ్యక్షులు వెంగని మనోహర్ మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పాదయాత్రలో కులగణన 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే, కానీ నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన అనే పేరుతో బీసీ బిడ్డలను మోసం చేస్తూ గద్దెన ఎక్కి కూర్చొని నేడు బీసీలకు విద్యా, వైద్యం, ఉపాధి కల్పనలో వెనుక అడుగు వేసేలా చూస్తుందని అంతేకాకుండా ఏదో ఒక బీసీ కుల గణన అని రాష్ట్రవ్యాప్తంగా చిన్న సర్వే చేపట్టి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రెండు ఒక్కటై బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో శీలం స్వామి, నందగిరి భాస్కర్ గౌడ్,
మెరుగు తిరుపతి, నెమలికొండ భాస్కర్, కురుమని ప్రశాంత్, బొట్టుకు అజయ్,పీట్ల విన్న బాబు, అమర కొండ కృష్ణ, తదితర బిఆర్ఎస్ నాయకులు, పలు కార్యకర్తలు పాల్గొన్నారు.

బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయే.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T155906.015.wav?_=6

 

బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయే.

బీసీలకు రిజర్వేషన్ లు ఇవ్వాల్సిందే.

రిజర్వేషన్ పెంపునకు పోరాటం చేస్తాం.

ఎమ్మెల్యేలు.. జనంపల్లి అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి.

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల జనంపల్లి అనిరుద్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో.. చేపట్టిన పోరు బాట మహాధర్నాలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా..

 

 

బడుగు బలహీన వర్గాల ప్రజల స్థితిగతులను స్వయంగా ఆయన గమనించారని, వారికి విద్య , ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాకుండా చట్టసభల్లో సైతం రిజర్వేషన్లు అవసరమని ఆయన భావించారని అందుకే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మెనిఫెస్టో లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామి ఇచ్చామని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి వారికి రాజ్యాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కుల గణన చేయించి, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, వారితో చర్చించి, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి, బీసీలకు రిజర్వేషన్ ఆవశ్యకత పైన చర్చించి , అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించి, కేంద్రానికి పంపించామని‌ , కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని, వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలన్నా, వారు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించాలన్నా రిజర్వేషన్లు అవసరమని ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం.

తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు అది

కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్ట్

పిసి గోష్ రిపోర్ట్ తప్పులతడక

కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి ,డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ ఫైర్

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడ మండల కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో నవీన్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి,డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని సమాజంలో బదనాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, అది కాళేశ్వరం కమీషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ కమిషన్ గా పని చేస్తుందన్నారు, పీసీ ఘోష్ కాంగ్రెస్ కార్యకర్తలాగ పనిచేసి కాంగ్రెస్ లీడర్లు మాట్లాడిన విషయాలనే రిపోర్టులో పొందు పరిచాడు అన్నారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో కట్టిన తెలంగాణ ప్రజల వరప్రదాయని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, లక్ష ఎకరాలకు తాగు,సాగునీరు ఇచ్చె ప్రాజెక్టు ను ఎండ బెట్టే కుట్రకు తెర లేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు,తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వర్షాలు లేక పంటలు ఎండుతుంటే కనీసం రైతులకు సాగు నీరు ఇవ్వాలన్న సోయి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ముఖ్యంగా రైతులను ఆగం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి రైతుల గొస తగులుతుందన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న దురదృష్టపు పాలన అన్నారు,కేసీఆర్ ను తెలంగాణ సమాజంలో తక్కువ చేయాలని తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ముద్రను చెరిపేయాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు ,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల రైతులు రెండు కార్లు పంటలు పండి రైతులు సంతోషం వ్యక్తం చేసే వారు అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కాళేశ్వరం ద్వారా వచ్చే నీటిని రాకుండా చేసి రైతులను ఆగం చేస్తుందన్నారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీల ను ఎప్పుడు అమలు చేస్తారన్నారు,ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అన్నారు,రైతులకు 100శాతం ఋణ మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేతులెత్తేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు,
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలో కి వచ్చి బీసీలను మభ్య పెట్టే విధంగా డిల్లీ లో ధర్నా లు అంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు,మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చిన దిక్కులేదు గాని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడట ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వo, వికలాంగులు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి వికలాంగులను మోసం చేసింది అన్నారు,బిఆర్ఎస్ కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మూల్యం తప్పదు అన్నారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం వస్తుందని రైతులు,నిరుద్యోగ విద్యార్థులు, మహిళలు అందరు ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా రైతులు ఈ ప్రభుత్వం పోయి కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న,గాదె అశోక్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తేజావత్ రవీందర్,కాలు నాయక్,కొమ్ము చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి కొమ్ము నరేష్,బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రేఖ వెంకటేశ్వర్లు, వెంకన్న,సీనియర్ నాయకులు బాలాజీ నాయక్,గండి మహేష్ గౌడ్,గంధసిరి కృష్ణ,దుస్స నరసయ్య, అజ్మీర రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-12.wav?_=7

బిజెపి తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో కేంద్రంలో మహా సంపర్క అభియాన్ లో భాగంగా ఇంటింటికి బిజెపి ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు నవీన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి
ముందుగా కోటగుళ్లు లోని భవాని సహిత గన పేశ్వరాలయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కార్యక్రమం ప్రారంభించింది ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి డోర్ స్టిక్కర్ వేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ప్రతి ఇంటికీ పోలింగ్ బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమం గ్రామ స్థాయిలో బీజేపీ బలాన్ని పెంపొందించేందుకు తీసుకున్న ఒక కార్యాచరణ. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, బీజేపీ పాలన విశేషాలను తెలియజేయడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరుగుతోంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. మోడీ గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఎన్నో ప్రజానుకూల పథకాలను ప్రవేశపెట్టారు ఉజ్వలా యోజన గ్యాస్ కనెక్షన్ల ద్వారా లక్షలాది మహిళలు వంటగదిలో పొగలు లేకుండా జీవించగలుగుతున్నారు.
ఆయుష్మాన్ భారత్ రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే జాతీయ ఆరోగ్య పథకం ద్వారా పేదలకు భారీ ఊరట.
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చారు.
హర ఘర్ నలే జల్ ప్రతి ఇంటికి శుద్ధ నీటి కనెక్షన్ కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం.
సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సూత్రంతో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తున్నారు.
పిఎం కిసాన్ రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 నేరుగా ఖాతాల్లో జమ చేయబడుతోంది.
ఇంటర్నెట్ కనెక్షన్, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా వేగంగా కొనసాగుతోంది.ఇవన్నీ కాంగ్రెస్ పాలనలో అననివార్యంగా ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ తీసుకున్న సమర్థవంతమైన నిర్ణయాలు. కాంగ్రెస్ గారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తే, మోదీ గ్యారంటీతో మేలు చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, అభివృద్ధి లోపం, హామీల విఫలం వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. గ్రామాల్లో అమలు చేయని హామీలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ వంటివి ఇవన్నీ తుపాకి లాంటి వాగ్దానాలు అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కుల, వర్గ రాజకీయాలు ప్రోత్సహించి, సామరస్యాన్ని దెబ్బతీశారు. కుటుంబ పాలనపై ఆధారపడి యువత, సామాన్య కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి బూత్ స్థాయిలో బీజేపీ శక్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి వెళ్లి నిజాలు చెప్పాలి, కాంగ్రెస్ మోసాలను బహిరంగపర్చాలి, బీజేపీ అభివృద్ధిని చూపించాలి. బీజేపీ అనేది కేవలం నినాదం కాదు ప్రజల నమ్మకానికి ప్రతీక. మోడీ పాలనను గుర్తించి, ప్రజల ఆశయాలను నెరవేర్చే పార్టీగా బీజేపీని నిలబెట్టే బాధ్యత ప్రతి కార్యకర్తదే అని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిదర్ రెడ్డి రాష్ట్ర నాయకులు దుప్పటి భద్రయ్య బీజేవైఎం రాష్ట్ర కళాశాల విభాగం కన్వీనర్ మంద మహేష్ మండల సీనియర్ నాయకులు సోమ దామోదర్ పున్నమి చందర్ మల్లన్న రాణి మేకల సమ్మయ్యగుండా సంపత్ మండల ఉపాధ్యక్షులుమాదాసు మొగిలి కుక్కముడి రమేష్ బూత్ అధ్యక్షులు పెండ్యాల శ్రీకాంత్ భూక్య హరిలాల్ దూడపాక సతీష్ రేపాక సంతోష్ దేవనూరు భార్గవ్

కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ కార్యకర్తలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T165118.813.wav?_=8

కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు.

వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు, 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్, సోషల్ మీడియా ఇంచార్జి మైనార్టీ నాయకుడు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో, ఉర్సు ప్రాంతానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త ఎం.డి ఫకీర్ తండ్రి ఇటీవల మరణించగా, వారి ఇంట్టికి వెళ్లి పరామర్శించి, 50కేజీల బియ్యం అందచేశారు. ఈ కార్యక్రమంలో మంద సతీష్, ఎస్. లింగమూర్తి, పోలేపాక భాస్కర్, అశోక్ గౌడ్, బజ్జురి రవి, బొల్లం సంజీవ, ఎం.డి అఫ్రీన్, కోట యాదగిరి, లక్క సురేందర్, ఎండి షారఫాద్దీన్, మైదం బాలు, గొర్రె చేరాలు, కార్ శ్రీపాల్, వి నరేష్, ఎండి ఆహేమద్ ఖాన్, ఎండి అజర్, మైదం వంశీ, మైదం బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version