సింగరేణి కార్మికులకు 40% లాభాల వాటా ఇవ్వాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-56.wav?_=1

సింగరేణి కార్మికులకు
లాభాల వాటా 40% వెంటనే ఇవ్వాలి

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి కంపెనీ. చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ను సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మెమొరండం ఇచ్చిన
శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం అరుణోదయ గౌరవ అధ్యక్షురాలు. విమలక్క
ఏఐఎఫ్ టియు రాష్ట్ర కార్యదర్శి.
ఎం. పోచ మల్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
24-25-సంవత్సరపు. సింగరేణి కార్మికులు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా చెమటను రక్తంగా మార్చి. సింగరేణి సంస్థను కాపాడుకోవాలని. ఈ దేశానికి వెలుగులు ఇవ్వాలని. 8 గంటలు.
పనిచేస్తూ అధిక ఉత్పత్తి సాధించిన. యజమాన్యం ఇప్పటివరకు. సాధించిన ఉత్పత్తి వేయాని ప్రకటించకపోవడం.
యజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ. ఇప్పటికైనా. సాధించిన
ఉత్పత్తిని ప్రకటిస్తూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. వచ్చినా ఉత్పత్తి ఆదాయం నుండి. 40%
ఎదురుచూస్తున్న సింగరేణి కార్మికులకు ఇప్పించాలని.
ఉత్పత్తిలో భాగస్వామ్యమైన
కాంట్రాక్ట్ కార్మికులకు
గత సంవత్సరము. ప్రభుత్వము
లాభాల వాటగా. 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది
24-25-సంవత్సరం. కూడా.
10.000 రూపాయలు. ఇవ్వాలని
గత విఆర్ఎస్ ఉద్యోగాలు కొనసాగించాలని. పాత పద్ధతిని అమలు చేయాలని.
మారుపేర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని
సొంతింటి కల అమలు చేయాలని
ఓసిపిలను రద్దుచేసి భూగర్భ గనులను నిర్మించాలని.
నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి
44 కార్మిక చట్టాలను అమలు చేయాలని .
ఫెరాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని.
వేలం పాట లేకుండా సింగరేణి సంస్థను సింగరేణికే ఇవ్వాలని
తదితర కార్మిక సమస్యల పైన మెమోరండం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం. ప్రధాన కార్యదర్శి. వెల్తురు సదానందం. నాయకులు. విజయ్. ఐఎఫ్టియు నాయకులు. చంద్రగిరి శంకర్ స్త్రీ విముక్తి. నాయకురాలు. లావణ్య.
డిస్మిస్ సంఘాల నాయకురాలు.
రాజేశ్వరి. లక్ష్మి. రాజేశ్వరి. రాజు తదితరులు పాల్గొనడం జరిగింది

రామప్ప, లక్నవరంను అభివృద్ది చేస్తాం…

రామప్ప, లక్నవరంను అభివృద్ది చేస్తాం

#ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి.

#పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ.

రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

 

రామప్ప, లక్నవరంను అభివృద్ది చేస్తూ, రాష్ట్రంలోనే ములుగు ప్రాంతాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు మండలం ఇంచెర్ల గ్రామములో 37 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎకో ఎత్నిక్ విలేజ్, డెవలప్మెంట్ వర్క్స్ ఫౌండేషన్ స్టోన్ ను రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,
అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నానని, వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. యూనిస్తో గుర్తింపు పొందిన రామప్ప, లక్నవరం, మేడారం సమ్మక్క సారలమ్మ, బోగత జలపాతం, బ్లాక్ బెర్రీ, దట్టమైన అటవీ ప్రాంతాలలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇప్పటికే పలు రకాల పనులను పూర్తి చేయడం జరిగిందని, మిగతా పనులను త్వరతగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ రహదారికి సమీపంలో చేతివృత్తుల వారు వారి వృత్తి పనులను చేసుకొని అమ్మ కానికి వీలుగా 37 కోట్ల రూపాయలతో పర్యాటక స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడంతో పాటు హ్యాపీ థియేటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రామప్పలో 13 కోట్ల రూపాయలతో ఐర్లాండ్ పనులను చేపట్టడం జరుగుతుందని, ములుగు జిల్లాలో పర్యటక హబ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అన్నారు. లక్నవరంలో మరో రెండు ఐలాండ్ పనులను చేపట్టడమే కాకుండా పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అదనపు నిధులను తీసుకురావడం జరిగిందని అన్నారు. సంవత్సరం జనవరి మాసంలో జరగనున్న మేడారం మహా జాతరను పురస్కరించుకొని మేడారం ప్రాంతంలో భక్తుల సౌకర్యం కోసం శ్వాశత పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను కేటాయించిందని, వాటికి సంబంధించిన పనులను త్వరలోనే చేపట్టడం జరుగుతుందని అన్నారు.
మేడారం జాతరలోని జంపన్న వాగు పై భక్తులకు అనుకూలంగా ఐదు కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు.
రాష్ట్రంలోనే ములుగు ప్రాంతాన్ని అభివృద్ధిలో పర్యాటక ప్రాంతంగా కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి సీతక్క ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రం నుండి నిధులు తీసుకురావడమే కాకుండా కేంద్రం నుండి నిధులను తీసుకువచ్చి కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజులలో ములుగు జిల్లాలు పూర్తిస్థాయిలో పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారి శివాజీ, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరులో పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-27-6.wav?_=2

తొర్రూరులో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

తొర్రూరుడివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు పట్టణ కేంద్రంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బహుజన యుద్ధ వీరుడు, విప్లవకారుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మోకు దెబ్బ జిల్లా కార్యదర్శి మేరుగు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, “బహుజనులంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికార సాధన కోసం కలిసికట్టుగా కృషి చేయాలి. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకం కావాలి” అని పిలుపునిచ్చారు.

Sardar Sarvai Papannagoud’s

వేడుకల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్ట కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నిర్వహించిన భూమిపూజ సందర్భంగా వారి చిత్రపటాలకు గౌడ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌడ సంఘాల నాయకులు మాట్లాడుతూ, “సర్దార్ పాపన్న విగ్రహ ప్రతిష్ట కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు” తెలిపారు.
కార్యక్రమంలో గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్, తొర్రూరు గోపా డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్ జీఎస్పీఎస్ అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్ గౌడ్ కె ఎస్ పి ఎస్ గౌరవ అధ్యక్షులు చామకూరి ఐలయ్య గౌడ్ అధ్యక్షులు నాగపురి అశోక్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కుంభం మహేష్ కుమార్ గౌడ్ ఎస్ఎస్పిజి అధ్యక్షులు చీకటి అశోక్ గౌడ్ కంట మహేశ్వర సంఘంలో గౌరవాధ్యక్షులు చీకటి రమేష్ గౌడ్ అధ్యక్షులు నిమ్మల శేఖర్ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గౌడ్ గౌడ యువజన సంఘం అధ్యక్షులు బొమ్మెర వినోద్ గౌడ్ కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, టౌన్ యువజన అధ్యక్షుడు బొమ్మ గాని మనోజ్ గౌడ్, చీకటి వీరన్న గౌడ్ తొర్రూరు పట్టణంలోని నాలుగు సంఘాల గౌరవ సభ్యులు ప్రజా
ప్రతినిధులు, స్థానిక నాయకులు, యువత, మహిళలు, మరియు పెద్ద సంఖ్యలో బహుజన ప్రజలు పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేశారు.

కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసిన పీ నరసింహారెడ్డి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-8.wav?_=3

కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసిన పీ నరసింహారెడ్డి,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం శకాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి. నరసింహారెడ్డి పాల్గొన్నారు.అట్టి సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానానికి లోబడి నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. బలహీన వర్గాలకు ఏ స్కీమ్ వచ్చిన దానికి బేస్ రేషన్ కార్డు అవసరం ఉంటుందని ఇందిరమ్మ ఇండ్లు గాని గృహానికి ఉచిత కరెంటు గాని రాజీవ్ యువ శక్తి గాని సబ్సిడీ గ్యాస్ గాని ప్రతి ఒక్క దానికి అర్హులు తెల్ల రేషన్ కార్డు దారులే అని అన్నారు. గత ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా బీదలకు ఇవ్వలేదన్నారు. రేషన్ కార్డుదారులందరికీ ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం అందిస్తుందన్నారు.
గత ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చిన దొడ్డు బియ్యం తినేవారు కాదని అమ్ముకునేవారని అలా రీసైకిల్ అయి అదే బియ్యం మళ్లీమళ్లీ వచ్చి పోయేదని కానీ ఇప్పుడు సన్న బియ్యం ప్రతి ఒక్క లబ్ధిదారుడు దాన్ని తింటున్నారని అన్నారు.
ప్రజలకు అవసరమయ్యే బియ్యాన్ని పండించేందుకు రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నందున రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారన్నారు.మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం 200 యూనిట్ల వరకు పేదలకు కరెంట్ రైతులకు రుణమాఫీ అదేవిధంగా సంవత్సరానికి ఎకరాకు 12 వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇస్తుందన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటును ఇచ్చిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు బీదవాళ్ల ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇస్తుందన్నారు.ఇంకా మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇట్టి కాలంలో పూర్తి చేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.కార్యక్రమంలో మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ సి డి సి డైరెక్టర్ జి మల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ ఇమాం పటేల్ మాజీ ఎంపిటిసి ఎస్ నరసింహులు మాజీ సర్పంచ్ ప్రతినిధి చెన్నారెడ్డి పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ నాయకులు చేస్మోదిన్
ఆరిఫుద్దీన్ షేక్ అలీ కుర్షిడ్ బయ్ నారాయణ గౌడ్ సైఫుద్దీన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-55.wav?_=4

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ నివాసంలో ఆదివారం సాయంత్రం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 11 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా యన్.గిరిధర్ రెడ్డి ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారికీ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గార్లకు చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగా రెడ్డి,సిడిసి చైర్మన్ ముబీన్,మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,మాజీ యం.పి.పిలు గుండారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్, మాజీ సోసైటి చైర్మన్ ధనసిరి.మల్లికార్జున్ రెడ్డి,మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మాజీ జెడ్పీటీసీలు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు,మాజీ సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,లబ్దిదారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం.

 

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం..

మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడుదాం : పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయితీ వద్ద మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ హాజరై సిబ్బంది తో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నాషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ ఎం బి ఎ)ను అమలు చేస్తోందని అన్నారు. ఈ అవగాహన ప్రచారం యొక్క 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పోత్కపల్లి లో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా , సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు మరియు ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో సామూహిక ప్రతిజ్ఞను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా సరఫరా సాగుచేసిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి, షీట్స్ ఓపెన్ చేసి పీడియాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి మన ఐక్య నిబద్ధతకు శక్తివంతమైన చిహ్నంగా ఉపయోగపడుతుంది అన్నారు.ఎస్సై పోలీస్ సిబ్బందితో కలిసి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

రెండోసారి పొడగించిన పిఎసిఎస్ చైర్మన్ పదవి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-5.wav?_=5

రెండోసారి పొడగించిన పిఎసిఎస్ చైర్మన్ పదవి,
– మరో ఆరు నెలలు పొడగింపు.
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

 

– నేటి ధాత్రి, మొగుళ్ళపల్లి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సహకార సంఘాలతో పాటు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గాలను మరో ఆరు నెలల పాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, రెండోసారి మొగుళ్ళపల్లి పి ఎస్ సి ఎస్ చైర్మన్ గా సంపెల్లి నరసింగరావు వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్ తో పాటు 11 మంది డైరెక్టర్లు మరో ఆరు నెలల పాటు కొనసాగనున్నారు. గతంలో 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించగా. ఐదు సంవత్సరాల కాలం పాటు పాలకవర్గం కొనసాగింది. పదవీకాలం ముగియడంతో మరో ఆరు నెలల పాటు పాలకవర్గాన్ని కొనసాగింపు చేసింది ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సొసైటీ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాజాగా ప్రభుత్వం రెండవసారి పాత పాలకవర్గాన్నే కొనసాగించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది,

ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు 2 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ ప్రాంతంలో గల చెరువును డి.సి.పి. ఎ.భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు,ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలోని కాజ్ వేలు,వాగులు, నదుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీస్,రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నామని,లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను వరద పరిస్థితుల దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వరదలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కునేందుకు 90 మంది సభ్యులతో 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, జిల్లా అధికారులతో సిద్ధంగా ఉన్నామని,ప్రజల రక్షణకు కావలసిన పరికరాలు అందుబాటులో ఉంచడం జరిగిందని,పోలీసు అధికారులకు శిక్షణ అందించడం జరిగిందని,గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రభుత్వ సూచన మేరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని,జిల్లాలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించడం జరిగిందని ఉన్నారు.జిల్లాలో ప్రాణ నష్టం,పశు నష్టం,ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజల రక్షణకు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి 24-25-సంవత్సరపు…

సింగరేణి 24-25-సంవత్సరపు
లాభాల వాటా వెంటనే ఇవ్వాలని.

ఏఐ ఎఫ్ టియు నాయకుడు చంద్రగిరి. శంకర్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

సింగరేణి కార్మికులు.24.25 సంవత్సరం లాభాల వాటా 40 శాతం ఇవ్వాలని ఏఐఎఫ్టీయూ నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా చెమటను రక్తంగా మార్చి. సింగరేణి సంస్థను కాపాడుకుంటున్నా ఈ దేశానికి వెలుగులు ఇవ్వాలని. 8 గంటలు.
పనిచేస్తూ అధిక ఉత్పత్తి సాధించిన. సింగరేణి యజమాన్యం ఇప్పటివరకు. సాధించిన ఉత్పత్తి వేయాని ప్రకటించకపోవడం. విడ్డూరంగా ఉంది
యజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ. ఇప్పటికైనా. సాధించిన
ఉత్పత్తిని ప్రకటిస్తూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. వచ్చినా ఉత్పత్తి ఆదాయం నుండి. 40%
ఎదురుచూస్తున్న సింగరేణి కార్మికులకు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాం
ఉత్పత్తిలో భాగస్వామ్యమైన
కాంట్రాక్ట్ కార్మికులకు
గత సంవత్సరము. ప్రభుత్వము
లాభాల వాటగా. 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది
24-25-సంవత్సరం. కూడా.
10.000 రూపాయలు. ఇవ్వాలని ఏఐ ఎఫ్ టియు నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు

వివాహ వేడుకకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

వివాహ వేడుకకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేటలోని రామకృష్ణ జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాచర్ల రమేష్ గౌడ్ మరదలు రాజుపేట గ్రామం కీ.శే.కోతి స్వామి-అరుణ గౌడ్ దంపతుల కూతురు రచన -అబిలాష్ గౌడ్ ల వివాహం సత్యం ఫంక్షన్ హల్ లో బుధవారం జరిగింది.ఈ వివాహ వేడుకకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వాదూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ డివిజన్ అధ్యక్షులు, మల్లంపల్లి గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి కందుల శ్రీనివాస్ గౌడ్, రాజుపేట గౌడ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి సురేష్ గౌడ్,కోతి వెంకటేశ్వర్లు గౌడ్,నర్సంపేట గౌడ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ కక్కెర్ల అశోక్ గౌడ్, మల్లంపల్లి గౌడ సంఘం మాజీ అధ్యక్షులు కక్కేర్ల రాజు గౌడ్,కక్కేర్ల రాజు గౌడ్, మాజీ కోశాధికారి కక్కేర్ల కుమారస్వామి గౌడ్, కక్కేర్ల రాములు గౌడ్ తదితరులు హాజరైనారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

తంగళ్ళపల్లి. నేటి దాత్రి..

ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత. అని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగల. రాజు. మాట్లాడుతూ. సారంపల్లి గ్రామంలో. వంగరి సుమలత. భర్త శ్రీనివాస్. వారికి 32,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును.

గ్రామ శాఖ అధ్యక్షుడు. గుగ్గిల రాములు గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ చెక్కులు రావడానికి కృషిచేసిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మానవ హక్కుల విభాగం జిల్లా ఉపాధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్. కోలా గంగారాం. కూనవేణి. వినోద్. గుగ్గిల అభిషేక్. సాయిరాం. మహేష్. సంజయ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఇందిర ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభూ పూజ…

ఇందిర ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభూ పూజ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఇందిర మహిళలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఆశయం దిశగా. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన. అందిస్తూ. అర్హులకు . లబ్ధిదారులకు.అండగా ఉండి ప్రభుత్వం. ఇందిరమ్మ. ఇండ్లు మంజూరైన. మహిళలకు. భూమి పూజ చేయడం జరిగిందని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్.పూజా కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన పేద ప్రజలకు. అనేక సంక్షేమ పథకాలు. అందిస్తూ వారికి అండగా ఉంటున్నారని ఇందిరమ్మ ఇల్లా నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని. లబ్ధిదారులు. అందరూ . వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నామని అలాగే. ఆరోగ్యారంటీలే. కాకుండా. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల. అవకాశం కల్పిస్తూ. పేదవారి . కాంగ్రెస్ పెద్దలు. అధికారులకు పెద్దలకు ఎంతో కృషి చేస్తున్నారని వారందరికీ పేరుపేరునా లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు.తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ తో పాటు. వ్యవసాయ.మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు. నేరెళ్ల నర్సింగ్ గౌడ్. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. లింగాల భూపతి. సత్తు శ్రీనివాస్ రెడ్డి. మునిగిల రాజు. గుగ్గిల భరత్ గౌడ్. గ్రామ శాఖ అధ్యక్షులు కోలా శంకర్. ఆనందం. ఎల్లయ్య. శ్రీను. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బీసీ రిజర్వేషన్లపై ఎందుకీ గలభా?

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-19-2.wav?_=6

బీసీ రిజర్వేషన్లపై ఎందుకీ గలభా?
-వేముల మహేందర్ గౌడ్
-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

ఆగస్టు 7 భారత సమాజంలో తరతరాలుగా విద్యకు, భూమికి దూరంచేసి వెనుక వేయబడ్డ వర్గానికి స్వతంత్ర భారతదేశంలో సుమారు 50 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు కల్పించబడ్డ రోజు..సామాజిక న్యాయం కోసం 40 సంవత్సరాలు వెనకబడ్డ వర్గాల పోరాటానికి గుర్తింపు లభించిన రోజు..లోక్‌సభలో మాజీ ప్రధాని విపి సింగ్ ఇతర వెనకబడ్డవర్గాల కోసం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ప్రకటన జారీ చేసిన రోజు..నేడు దేశవ్యాప్త బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి నాంది పలికిన రోజు..బీసీల 42 శాతం రిజర్వేషన్ల అంశం..ప్రస్తుతం హైదరాబాద్ ఇంద్రపార్క్ నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు చేరింది. తెలంగాణనే కాదు యావత్ భారతదేశం బీసీల 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయా, కావా? అనే ప్రశ్నతో వెయ్యి కండ్లతో ఎదురు చూస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు లేని పరిమితి బీసీ రిజర్వేషన్లకు ఎందుకు? 2019 జనవరి నెలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం, రెండు సభలలో ఆమోదించడం, (Passage both houses) రాష్ట్రపతి సంతకం చేయడం, గెజిట్‌లో ప్రచురించడం, అమలు కావడం చకచకా జరిగిపోయాయి. కానీ బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ..తెలంగాణ రాష్ట్రం రెండు బిల్లులు పంపి ఆరు నెలలు గడుస్తున్నా..నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకు? స్థానిక సంస్థలలో బీసీల 42% రిజర్వేషన్లు అమలు చేయాలని 2018 చట్టంలో సెక్షన్ 285ఎ కి సవరణ చేసి గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపిస్తే..మళ్లీ ఆర్డినెన్స్ ఢిల్లీకి (రాష్ట్రపతి సలహా కోసం) చేరింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు లేని అగ్నిపరీక్ష బీసీల 42 శాతం రిజర్వేషన్లకు ఎందుకు? అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు లేని 50 శాతం పరిమితి నిబంధన బీసీ రిజర్వేషన్లకు ఎందుకు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్ధించింది, బీసీ 42 శాతం రిజర్వేషన్లను సమర్థించదా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు. జనహిత్ అభియాన్ వర్సెస్ ఇండియా కేసులో 2022 నవంబర్ 7న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు 3:2 మెజార్టీ ద్వారా సమర్థించింది. ముఖ్యంగా ఈ కేసులో సుప్రీం కోర్టు స్పష్టపరిచిన అంశాల్లో ఆర్టికల్ 15(4), 16(4) కింద రిజర్వేషన్లు అసాధారణ పరిస్థితులలో తప్ప 50 శాతం మించకూడదు అనే తీర్పు సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతులకు (ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలు వంటివి) వర్తిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను విడిగా పరిగణిస్తారు. ఈడబ్ల్యూఎస్ (10 శాతం) ఇప్పటికే ఎస్‌సీ, ఎస్‌టీ లేదా ఓబీసీ రిజర్వేషన్ల పరిధిలోకి రాని వారికి, ఎందుకంటే ఇది అదనంగా కల్పిస్తున్న రిజర్వేషన్లు. 103వ రాజ్యాంగ సవరణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఆర్టికల్స్ 15(6), 16(6)లను రాజ్యాంగానికి చేర్చింది. కాబట్టి ఆమోదిస్తున్నాం. ఇది రాజ్యాంగంలో భాగం కాబట్టి, సుప్రీంకోర్టు గతంలో న్యాయపరంగా రూపొందించిన 50 శాతం నియమాన్ని అధిగమిస్తుందని తీర్పు ఇచ్చింది. తమిళనాడు వెనుకబడిన తరగతులు, ఎస్‌సీ, ఎస్‌టీల చట్టం, 1993ను ఆమోదించింది. ఇది 69 శాతం రిజర్వేషన్లను కల్పిస్తుంది. న్యాయ సమీక్ష నుండి రక్షించడానికి రాజ్యాంగంలోని 9షెడ్యూల్‌లో ఈ చట్టం చేర్చబడింది. 2018లో మహారాష్ట్ర ఎస్‌ఇబీసీ (సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు) వర్గం కింద మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇది మొత్తం రిజర్వేషన్లను 70 శాతంకి పెంచింది. మే 2021లో సుప్రీంకోర్టు 50 శాతం పరిమితిని ఉల్లంఘించడానికి ఎటువంటి అసాధారణ పరిస్థితులు లేవని దానిని కొట్టివేసింది. రాజస్థాన్ గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్లు, ఇతర ఓబీసీలకు 21 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించింది, దీనితో మొత్తం రిజర్వేషన్లు 70 శాతం కంటే ఎక్కువయ్యాయి. రాజస్థాన్ హైకోరు, సుప్రీం కోర్టు 50 శాతం పరిమితిని ఉల్లంఘించాయి. అసాధారణ పరిస్థితులను సమర్థించడానికి తగినంత డేటా లేదని ఈ చట్టాన్ని కొట్టివేసాయి. బీహార్ ప్రభుత్వం నవంబర్ 2023లో బీహార్ కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లను 75 శాతంకి పెంచుతూ చట్టాన్ని ఆమోదించింది. పాట్నా హైకోర్టు అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప రిజర్వేషన్ 50 శాతం మించకూడదని, కుల సర్వే డేటాలో అసాధారణ పరిస్థితులు నిరూపించబడలేవని, అదనపు రిజర్వేషన్లను సమర్థించడానికి తగినంత బలమైన సామాజిక, -ఆర్థిక సూచికలు దీనికి లేవని కొట్టివేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, కృష్ణమూర్తి కేసులో ఇచ్చిన త్రిబుల్ టెస్ట్ తీర్పును, వివిధ రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులను ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు ( బీసీలు) 42 శాతం
రిజర్వేషన్లను అమలు చేయడానికి నవంబర్-, డిసెంబర్ 2024లో తెలంగాణ సామాజిక,- ఆర్థిక, కుల సర్వే (ఎస్‌ఇఇఇపిసి)ని నిర్వహించింది, ఇది 96.9% గృహాలను కవర్ చేసింది. జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారని తేల్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా డేటాను విశ్లేషించడానికి, రిజర్వేషన్ సంస్కరణలను సిఫార్సు చేయడానికి బీసీ కమిషన్ ను ఏర్పరచింది. మార్చి 2025లో, తెలంగాణ శాసనసభ విద్యా, ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతంకి పెంచడం (29 శాతం నుండి), పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలకు 42 శాతం కోటాను పెంచడం కోసం (18 శాతం ఎస్‌సీ, 10 శాతం ఎస్‌టీ కోటాలతో పాటు మొత్తం 70 శాతంకి తీసుకురావడం) రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్లమెంట్ అనుమతి కోసం ఢిల్లీకి పంపింది. జూలై 2025లో తెలంగాణ మంత్రివర్గం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285ఎని సవరించడానికి ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఆమోదం తెలిపింది. గవర్నర్ ఈ ఆర్డినెన్స్‌ను 1 ఆగస్టు 2025న రాష్ట్రపతికి పంపారు. ప్రస్తుతం ఏం చేయాలి. బీసీల 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే తప్పనిసరిగా రాజ్యాంగా సవరణ అవసరం. 50 శాతం పరిమితిని అధిగమించాలంటే అసాధారణ పరిస్థితుల్లో అధిగమించవచ్చు. 50 శాతం పరిమితి అనేది న్యాయపరమైన మినహాయింపే కానీ రాజ్యాంగపరమైన మినహాయింపు కాదు. కాబట్టి 56.36 శాతం ఉన్న బీసీలకు తగినంత ప్రాతినిధ్యం లేదని డెడికేట్ కమిషన్ ద్వారా రిపోర్టును సమర్పిస్తూ సమగ్ర సర్వే, శాస్త్రీయ డేటాను ముందు ఉంచే ప్రయత్నం చేయాలి. తమిళనాడు మాదిరిగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి కోర్టుల నుంచి మినహాయింపు పొందవచ్చు. (తొమ్మిదవ షెడ్యూల్లోని చట్టాలను న్యాయ సమీక్ష చేయవచ్చు). రాజ్యాంగ సవరణ కోసమే తెలంగాణ సమాజం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంది. ఇంత జరుగుతున్నా బీసీ రిజర్వేషన్లకు మోక్షం లభించడం లేదంటే యావత్ భారతదేశం, తెలంగాణ సమాజం దానికి కారకులు ఎవరో నిర్ణయించుకోవాలి.

జాతీయ చేనేత దినోత్సవం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T124230.169.wav?_=7

జాతీయ చేనేత దినోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

(ఆంగ్లం: National Handloom Day) ఆగస్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటుచేయడం జరిగింది.

ప్రారంభం

2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 2012-14 సంవత్సరాల్లో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన 72మందికి అవార్డులు (వీరిలో 16 మందికి సంత్ కబీర్ పురస్కారాలు) ప్రదానం జరిగింది.

చరిత్ర

భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. భారత స్వాతంత్ర్యోద్యమంలో చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాపోలు ఆనంద భాస్కర్ 2005లో చేనేత దినోత్సవానికి సంబంధించిన పరిశోధన చేసి చారిత్రిక ఆనవాళ్లను శోధించాడు, చేనేత దినోత్సవానికి సరైన తేదీ కోసం అధ్యయనం చేశాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చింది. మొదటిసారిగా 1905లో బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతోపాటూ దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అలా విదేశి వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా చేయాలని ఆనంద భాస్కర్ ప్రతిపాదించాడు. ఈ దినోత్సవానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని తడ్క యాదగిరి, ఎర్రమాద వెంకన్న నేతతోపాటు మరికొందరిని ప్రోత్సహించాడు.

National Handloom Day

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006వ సంవత్సరం నుండి స్థానిక చేనేత సంఘ నాయకులతో కలిసి వివిధ కార్యక్రమాలను నిర్వహించిన ఆనంద భాస్కర్, ఆగస్టు 7వ తేదీకి ఉన్న చారిత్రిక ప్రాధాన్యతను అందరికి తెలియజేసి, 2006 నుండి చేనేత దినోత్సవ కార్యక్రమం క్రమంతప్పకుండా జరిగే విధంగా రూపకల్పన చేశాడు.

అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి శ్రీ శంకర్ సింగ్ వాఘేలా, ఎల్.కె.అద్వానీ లతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆనంద భాస్కర్ ప్రయత్నాన్ని అభినందిస్తూ సందేశాలు పంపారు. 2008, ఆగస్టు 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డి పాల్గొన్నాడు.

2012, ఏప్రిల్ 2న ఆనంద భాస్కర్ కు రాజ్యసభ సభ్యునిగా అవకాశం రావడంతో చేనేత దినోత్సవ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 2012, ఏప్రిల్ 6న రవీంద్రభారతిలో ఎర్రమాద వెంకన్న నేత సారథ్యంలో చేనేత దినోత్సవ చరిత్ర, ఆవశ్యకతను వివరిస్తూ స్వదేశీయం సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి అప్పటి రాజ్యసభ సభ్యులు రాపోల్ ఆనంద భాస్కర్, చిరంజీవి ముఖ్య అతిధులుగా హజరయ్యారు. ఆ తరువాత చేనేత దినోత్సవానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన అన్ని జాతీయ కార్యక్రమాలకు ఆనంద భాస్కర్ నాయకత్వం వహించాడు. వివిధ రాష్ట్రాలలోని జాతీయ నాయకులను కలిసి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కల్పించాడు.

2012, ఆగస్టు 7న ఆనంద భాస్కర్ ఆద్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా చేనేత దినోత్సవం జరుపబడింది. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులను, రాజకీయ దిగ్గజాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఎర్రకోట నుండి రాజ్ ఘాట్ వరకు చేనేత వాక్ నిర్వహించి జాతీయ స్థాయిలో ఈ దినోత్సవంపై ఆసక్తిని కలిగించాడు. 2014లో అదే రాజ్ ఘాట్ లో చేనేత దినోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రధానితో చర్చించి చేనేత దినోత్సవాన్ని అధికారికం చేస్తామని మాటిచ్చాడు.

2014 నుండి 2015 వరకు ప్రభుత్వాధికారులపై ఒత్తిడి పెంచిన ఆనంద భాస్కర్, 2015 మార్చి 3న రాజ్యసభలో ఆగస్టు 7ని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించాడు. అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి, అందులో రాపోలు ఆనంద భాస్కర్ ని సభ్యునిగా చేర్చి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరింది. చేనేత దినోత్సవానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, రికార్డులు, పూర్వ చరిత్ర, సంబంధిత చేనేత జౌళిశాఖామంత్రి అప్పటి కేంద్ర వస్త్ర, జౌళి శాఖామంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ కి అందించాడు. ఆనంద భాస్కర్ సమర్పించిన పత్రాలు రికార్డులను పరిశీలించిన శాఖ అధికారులు, తమ నివేదికను ప్రధానమంత్రికి సమర్పించారు.
ఆనంద భాస్కర్ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రాంత ప్రభుత్వాల అంగీకారంతో 2015, జూలై 29న భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారిక గెజిట్ విడుదల చేసింది. 2015, ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో అధికారికంగా ప్రారంభించారు. ఈ అధికారిక జాతీయ పండుగకు కేంద్ర మంత్రులు, తమిళనాడు రాష్ట్ర మంత్రులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చేనేత కళాకారులు పాల్గొన్నారు. ఆనాటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నాయి.

మ్యూజియం నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశాడు. అనంతరం మన్నెగూడలోని బీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొని రాష్ట్రంలోని చేనేత కార్మికులు కొత్త తరహా మగ్గాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించడంకోసం రూపొందించబడిన తెలంగాణ చేనేత మగ్గం పథకాన్ని ప్రారంభించాడు. నేతన్న బీమా పథకం వయో పరిమతిని 59 నుండి 75 వయస్సుకు పెంచుతున్నట్లు, చేనేత మిత్ర పథకం ద్వారా అందించే 50 శాతం సబ్సిడీకీ బదులుగా మగ్గానికి నెలకు రూ.3వేలు అందజేయనున్నట్లు, కార్మికులు దహన సంస్కారాల కోసం అందించే ఆర్థక సహాయాన్ని రూ.12,500 నుండి రూ.25వేలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25వేల వరకు వైద్య సేవలు అందించనున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా చేనేత మిత్ర, పావలావడ్డీ, నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ లబ్ధిదారులకు చెక్కులనూ, 36మంది చేనేత కార్మికులు, వృత్తి నిపుణులకు కొండా లక్ష్మణ్‌బాపూజీ అవార్డులను అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ రమణ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చింతా ప్రభాకర్, పవర్ లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌ గూడూరి ప్రవీణ్ లతోపాటు పలు చేనేత సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇతర వివరాలు

✓ చేనేతరంగంలో విశిష్ట కృషిచేసిన చేనేత కార్మికులను గౌరవిస్తూ 2012నుంచి ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్‌ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు.
✓ 2018లో యాదాద్రి – భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారులు కుట్టులేని జాతీయ జెండాను రూపొందించారు. 24 ఆకులతో కూడిన అశోక చక్రం సహా జాతీయ పతాకమంతా ఎలాంటి కుట్టులేకుండా మగ్గంపై తయారుచేశారు.

సింగరేణి విజిలెన్స్ పెండింగ్ లో ఉన్న మారు పేర్ల సమస్య పరిష్కరించారు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8.wav?_=8

సింగరేణి విజిలెన్స్ పెండింగ్ లో ఉన్న మారు పేర్ల సమస్య పరిష్కరించారు

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి విజిలెన్స్ పెండింగ్ లో ఉన్న మారు పేర్ల సమస్య పరిష్కరించారు
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ వెంటనే పరిష్కరించాలని. ఏఐఎఫ్ టియు
రాష్ట్ర . నాయకులు చంద్రగిరి శంకర్ .డిమాండ్ చేయడం జరిగింది.
సింగరేణి సంస్థల్లో గత కొన్ని దశాబ్దాల నుండి మారుపేర్ల మీద పని చేస్తున్న వేలాది మందికి తమ
పేర్లను మార్చుకునే అవకాశం కల్పించడంలో సింగరేణి యజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్నోసార్లు మారు పేర్ల సమస్యను యజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ దాటవేత్త ధోరణి అవలంబిస్తూ ఎప్పటికప్పుడు విషయాలను
పక్కదారి పట్టిస్తుందని . తండ్రి ఉద్యోగాలు రాక. ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించక కుటుంబాల పోషణ గడవక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
గత కెసిఆర్ ప్రభుత్వం మారు పేర్లల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పరిష్కరించలేకపోయింది
ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మారు పేర్లను పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు పరిష్కరించలేకపోయింది
సమస్యల పరిష్కారం కోసం మారుపేర్ల బాధిత కుటుంబాలు శాంతియుతంగా సింగరేణి వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తూ. సింగరేణి ఏరియా ల అధికారులకు. మరియు కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు . సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘాల నాయకులకు మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రములు ఇస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు అయినా ప్రయోజనం లేకపోవడంతో మా తండ్రి ఉద్యోగాలు మాకు రావని మనస్థాపానికి గురై ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది
అయినా పరిష్కారం లేకపోయింది ఇప్పటికైనా. హామీ ఇచ్చి గెలిచినగ సంఘాలు.. సింగరేణి యాజమాన్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవత్వ కోణంలో ఆలోచించి
మారుపేర్ల బాధిత కుటుంబాలను ఆత్మహత్యల నుండి కాపాడాలని వెంటనే విజిలెన్స్ లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని ఏఐఎఫ్ టియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.!

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో గ్రామసభలు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download.wav?_=9

తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే స్థానిక సంస్థలఎన్నికల లో.కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు పునాదులు. అని. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ప్రవేశపెట్టిన పథకాలే స్థానిక అభ్యర్థులను గెలిపిస్తాయని దానికి ఇందిరమ్మ ఇండ్లు కానీ. సన్న బియ్యం గాని. రేషన్ కార్డులు గానీ. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కానీ. రైతు రుణమాఫీ కానీ. మహిళలకు పావలా వడ్డీరుణాలు గాని
. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 18 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పిస్తూ ఇక ముందు కూడా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కంటే. ఎక్కువగా అమలు చేస్తారని. తంగళ్ళపల్లి మండలంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రజలకు వివరిస్తూ. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని రాబోయే కాలంలో మరింత అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయేలా. ప్రజలు తమ ఓటు హక్కుతో స్థానిక అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగిల రాజు. సత్తు శ్రీనివాస్ రెడ్డి.లింగాల గుగ్గిళ్ళ భరత్
. బాలరాజ్ కోల మాజీ సర్పంచ్ బానయ్య.జలంధర్ రెడ్డి. సదానందం. శ్రీరామ్. శ్రీనివాస్. అంజయ్య. రాములు. లావణ్య. ప్రమీల. తంగళ్ళపల్లి మండల. ప్రతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
.

బిసిలకు 42శాతం రిజర్వేషన్ పోరాటం కోసం సిరిసిల్ల టు ఢిల్లీ ప్రయాణం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T132609.249.wav?_=10

బిసిలకు 42శాతం రిజర్వేషన్ పోరాటం కోసం సిరిసిల్ల టు ఢిల్లీ ప్రయాణం

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదట కులగణన చేసి అట్టి బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలుపగా కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ బిల్లును ఆమోదించి షెడ్యూల్ 9 లో చేర్చి చట్టబద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ కాలం గడుపుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర ప్రభుత్వాన్ని కి కనువిప్పు కలిగించి బీసీల చిరకాల ఆకాంక్ష నెరవేర్చాలని చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిరిసిల్ల నుంచి బయలుదేరారు. చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు గోనె ఎల్లప్ప, టౌన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గడ్డం కిరణ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధులు రెడ్దిమల్ల భాను, గుడిసె ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు సబ్బని వేణు కలిసి బయలుదేరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version