సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులకు కఠిన చర్యలు

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంక్రాంతి సెలవుల సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించి, నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ ఆదేశాలు విద్యార్థుల విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జారీ చేయబడ్డాయి.

పట్టణ పరిశుభ్రత పరిరక్షణ…..

పట్టణ పరిశుభ్రత పరిరక్షణ…..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో పరిశుభ్రత పరిరక్షణ కోసం మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు
ప్రతి దుకాణం, ప్రతి ఇల్లు ముందు చెత్త కోసం ప్రత్యేకంగా డబ్బాలు లేదా డస్ట్‌బిన్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలని మున్సిపల్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
చెత్తను యాదృచ్ఛికంగా రోడ్లపై, దుకాణాల ఎదుట లేదా ఖాళీ ప్రదేశాల్లో వేయడం వల్ల ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చెత్తను క్రమబద్ధంగా వేయని వారిపై తగిన చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

పౌరులు పరిశుభ్రత పట్ల బాధ్యతగా వ్యవహరించి, నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలన్నారు. చెత్త నిర్వహణ నియమాలను పాటించని దుకాణదారులు, ఇంటి యజమానులపై జరిమానాలు విధించే అవకాశం ఉన్నట్లు మున్సిపల్ శాఖ అధికారి వెల్లడించారు.
పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని, నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version