రాష్ట్రస్థాయిలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీలు
కొలనూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మొదటి సంవత్సరం , ఫలితాల్లో కొలనూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలకు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. గోరంటాల ధరణి బైపీసీ లో రాష్ట్రస్థాయిలో ఆరవ ర్యాంకును, గోరంటాల పూజ MPHW -1లో రాష్ట్రస్థాయి 8వ ర్యాంకులు మరియు గోరంటాల పల్లవి MPHW -1లో రాష్ట్రస్థాయి పదో ర్యాంకును సాధించారు.అత్యధిక మార్కులను సాధించిన వారిని కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ మరియు అధ్యాపకులు విద్యార్థులను శాలువాలతో వారిని అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా కష్టపడి అత్యధిక మార్కులు సాధించాలని, ఉన్నత చదువులు చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని వారు తెలిపారు .
