మహాశివరాత్రికి సర్వం సిద్ధం…

మహాశివరాత్రికి సర్వం సిద్ధం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఘ నంగా నిర్వహించుటకు ఏర్పా ట్లు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.15వ తేదీ ఆది వారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ ప్రధమ రుద్రా భిషేకం ఆరు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అభిషే కాలు పూజలు నిర్వహిస్తా మని రాత్రి 9:30 గంటలకు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని రాత్రి 12 గంటలకు లింగో ద్భవ పూజ శివపార్వతుల పంచులోహ విగ్రహాల ఊరే గింపు నిర్వహిస్తున్నట్లు కావు న భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగల రని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న.

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ దంపతులు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా సిరిసిల్ల జిల్లా ఎస్పీ. మహేష్ బి.గీతే దంపతులు శనివారం దర్శించుకోవడం జరిగినది. అనంతరం ఆలయ అర్చకులు జిల్లా ఎస్పీకి స్వాగతం పలుకుతూ, స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు.వేద పండితులు అద్దాల మండపంలో ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆలయ ఈవో కె.వినోద్ శేష వస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలు సిరిసిల్ల జిల్లా ఎస్పీకి అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version