
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఎస్పీ పరతోష్ పంకజ్ మంగళవారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ సీఎం పర్యటనకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.