
వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.
వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. నర్సంపేట,నేటిధాత్రి: శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ ఆంజనేయ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా దేవాలయం ప్రాంగణంలో మహాగణపతి హోమాన్ని నిర్వహించారు.దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల సందర్భంగా గ్రామంలోని పలువురి ఇండ్ల నుండి హైందవ ధర్మం, సాంప్రదాయ పద్ధతిలో సీతమ్మ రాములోరు, లక్ష్మణుడు, ఆంజనేయుని పంచలోహ విగ్రహాలను డప్పు…