టీచర్ ఉద్యోగం సాధించిన మహిళ కానిస్టేబుల్.

టీచర్ ఉద్యోగం సాధించిన మహిళ కానిస్టేబుల్ కు సన్మానం..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో మహిళ కానిస్టేబుల్ గా పనిచేసి విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించిన సూత్రపు లావణ్యను సన్మానించారు.పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు నుండి టీచర్ గా ఎంపికైన లావణ్యను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం లో పని చేస్తూ టీచర్ గా ఉద్యోగం సాధించడం ఎంతో గొప్పతనమని మహిళా పోలీస్ కానిస్టేబుల్ గా స్థానిక స్టేషన్లో విధులు నిర్వహించిన లావణ్య ఎంతో నమ్మకంతో పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ అందరి మన్ననలు పొందడం అభినందియమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందితోపాటు లావణ్య మిత్ర బృందం పాల్గొన్నారు.

స్టేట్ రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థికి.!

స్టేట్ రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఎమ్మెల్యే మాణిక్ రావు సన్మానం

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ మండల పరధిలోని శేఖాపూర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ – హుమెర గారి కుమారుడు
షేక్ అద్నాన్ సమీ ఇటీవలే విడుదలిన ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం పరీక్ష ఫలితాలలో ఎంపీసీ ~ 470 మార్కులకు 467 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన సందర్బంగా సన్మానం చేసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మాజి సర్పంచ్ చిన్న రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్,గ్హౌస్ తదితరులు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version