టీచర్ ఉద్యోగం సాధించిన మహిళ కానిస్టేబుల్ కు సన్మానం..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో మహిళ కానిస్టేబుల్ గా పనిచేసి విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించిన సూత్రపు లావణ్యను సన్మానించారు.పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు నుండి టీచర్ గా ఎంపికైన లావణ్యను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం లో పని చేస్తూ టీచర్ గా ఉద్యోగం సాధించడం ఎంతో గొప్పతనమని మహిళా పోలీస్ కానిస్టేబుల్ గా స్థానిక స్టేషన్లో విధులు నిర్వహించిన లావణ్య ఎంతో నమ్మకంతో పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ అందరి మన్ననలు పొందడం అభినందియమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందితోపాటు లావణ్య మిత్ర బృందం పాల్గొన్నారు.