తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో హృదయ విధాకరసంఘటన చోటు చేసుకుంది తెలిసిన సమాచార ప్రకారంఈ సందర్భంగా తెలిసిన సమాచారం ప్రకారం. నిన్నటి రోజున ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తంగళ్ళపల్లి మండల గ్రామానికి చెందిన మంచి కట్లలలిత. 56. సంవత్సరములు అదృశ్యమైనది.బంధువులు ఎంత వెతికినా కనబడకపోవడంతో ఈరోజు. మానేరు వాగులో శవమై లలిత మృతదేహం కనిపించడంతో తల్లి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక పోయిన కొడుకు అభిలాష్ అదే మానేరులోవాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో సదురు పోలీసు సిబ్బంది సంబంధిత జాలర్లు సిబ్బంది ఎంత వెతికినా అభిలాష్ ఆచూకీ దొరకకపోవడంతో గాలిస్తూ ఉండడంతో ఎట్టకేలకె అభిలాష్ మృతదేహం లభ్యం అయిందని సంబంధిత పోలీస్ సిబ్బంది తెలిపారు. అభిలాష్ సర్దాపూర్ .బెటాలియన్ లో ప్రస్తుతం కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు మృతునికి సంబంధించిన వారు వివరాలు తెలిపారు. అలాగే గతంలో ఆరు సంవత్సరాల క్రితం తండ్రి మోరిలో పడి మృతి చెందగా చెల్లెళ్లు మౌనిక మానస ఇద్దరికీ వివాహాలు జరిగాయని అభిలాష్ కి సైతం వివాహo కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిందిదీనిపై సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలించి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నదని సంబంధిత పోలీసుఅధికారులు తెలిపారు
